Anand Mahindra: మహీంద్రా యూనివర్సిటీకి రూ.500కోట్లు.. ప్రకటించిన ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra: మహీంద్రా యూనివర్సిటీలో రానున్న ఐదేళ్లలో రూ.500 కోట్లు ఇస్తామని ఆనంద్‌ మహీంద్రా ప్రకటించారు.

Published : 26 Mar 2024 18:04 IST

దిల్లీ: హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మహీంద్రా యూనివర్సిటీ (Mahindra University)కి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) కీలక ప్రకటన చేశారు. ఈ విశ్వవిద్యాలయానికి రూ.500కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఐదేళ్లలో తమ కుటుంబం ఈ మొత్తాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీని అత్యుత్తమ కేంద్రంగా మార్చేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు.

పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.100కోట్లు పక్కన పెట్టనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఈ యూనివర్సిటీ అనుబంధ విద్యా సంస్థ ఇందిరా మహీంద్రా స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌కు మరో రూ.50కోట్లు ఇస్తామని ప్రకటించారు.

వాళ్ల ఉద్యోగాలకు ‘బెల్‌’ కొట్టారు.. 400 మందికి లేఆఫ్‌

2020లో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డాక్టరేట్‌ స్థాయిల్లో 35 ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు. ఇప్పటివరకు ఇందులో 4100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 10శాతం పీజీ చేస్తున్నవారే. త్వరలోనే ఈ యూనివర్సిటీ కింద స్కూల్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, లిబరల్‌ ఆర్ట్స్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని