Layoffs:: వాళ్ల ఉద్యోగాలకు ‘బెల్’ కొట్టారు.. 10 నిమిషాల వీడియోకాల్.. 400 మందికి లేఆఫ్
Layoffs: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా ‘బెల్’ సంస్థ స్వల్పకాలిక వీడియో మీటింగ్లో 400 మందికి ఉద్వాసన పలికింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో కొలువులు ఊడుతున్నాయి. వ్యయ నియంత్రణ చర్యలు, ఇతరత్రా కారణాలతో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా సంస్థలు ఉద్యోగాల కోతలు (Layoffs) కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బెల్ (Bell) లేఆఫ్లు ప్రకటించింది. కేవలం 10 నిమిషాల వీడియో కాల్లో 400లకు పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇటీవల జరిగిన కంపెనీ వర్చువల్ గ్రూప్ మీటింగ్లో బెల్ మేనేజర్ ఈ లేఆఫ్ నోటీసును చదివి వినిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగుల తొలగింపులపై కంపెనీ సీఈవో మిర్కో బిబిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థ పునర్వ్యవస్థీకరణ కోసం సంస్థాగత మార్పులు చేయనున్నామని, అందుకు కోతలు తప్పేలా లేవని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దాదాపు 4,800 మందిని తొలగించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది 9శాతానికి సమానం.
అయితే, తాజా లేఆఫ్లపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ‘సిగ్గుచేటు’ చర్య అని కెనడాకు చెందిన ఉద్యోగుల సంఘం ‘యూనిఫోర్’ దుయ్యబట్టింది. నిమిషాల వ్యవధిలో తొలగింపులపై ప్రకటన చేశారని, కనీసం ఉద్యోగులు ప్రశ్నలు అడిగేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని ఆరోపించింది. ఓవైపు, వాటాదారులకు డివిడెండ్ పేఅవుట్ను పెంచుకుంటూ సామాన్య ఉద్యోగులను తొలగించడాన్ని తప్పుబట్టింది.
ఆసియాలో కుబేరుల ‘రాజధాని’ ముంబయి.. బీజింగ్ను అధిగమించి టాప్లోకి
డెల్లోనూ కోతలు..
అటు ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్ (Dell) కూడా ఇదే బాట పట్టినట్లు తెలుస్తోంది. ఖర్చు తగ్గింపులో భాగంగా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. అయితే, ఎంతమందికి ఉద్వాసన పలికారన్న దాన్ని మాత్రం వెల్లడించలేదు. గతేడాది ఈ సంస్థ ఏకంగా 6,650 మందికి లేఆఫ్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి డెల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,20,000కు పడిపోయింది.
గత కొన్నేళ్లుగా ఈ కంపెనీ పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో నష్టాలను చవిచూస్తోంది. గత నెల ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ ఆదాయం 11శాతం తగ్గింది. ఈ క్రమంలోనే తాజా తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక, వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనపై ఇటీవల డెల్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెనీ నిబంధనల ప్రకారం ఆఫీసుకు రానివారికి ప్రమోషన్లు ఉండవని తేల్చి చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్