Steve Jobs: మీటింగ్లో నోట్స్ రాయడం స్టీవ్ జాబ్స్కు నచ్చదట.. ఎందుకో తెలుసా?
Steve Jobs: యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ గురించి ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఫిల్ షిల్లర్ ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు.
Steve Jobs | ఇంటర్నెట్డెస్క్: మీటింగ్ సమయంలో చర్చకు వచ్చే ముఖ్యమైన అంశాలను పేపర్పై నోట్ చేసుకోవడం చాలామందికి ఉండే అలవాటు. ఏ విషయాన్ని మర్చిపోకూడదనే ఉద్దేశంతో ప్రతీది నోట్ చేసుకొనే వారూ ఉంటారు. ఇదొక మంచి అలవాటని చాలామంది భావిస్తారు. కాని, దీనికి యాపిల్ (Apple) సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ (Steve Jobs) పూర్తి వ్యతిరేకమట. మీటింగ్ సమయంలో నోట్స్ రాసుకోవడం ఆయనకు అసలు నచ్చదట.
యాపిల్ ఎగ్జిక్యూటివ్ ఫిల్ షిల్లర్ ‘ది ఆస్ట్రేలియన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీవ్ గురించి ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. ‘‘1997లో స్టీవ్ జాబ్స్ తిరిగి వచ్చినప్పుడు సమావేశాల్ని ఏర్పాటుచేశారు. మీటింగ్ సమయంలో ఎవరో నోట్స్ రాసుకుంటుండటం ఆయన గమనించారు. ‘ఎందుకు రాసుకుంటున్నారు? గుర్తుంచుకునేందుకు ప్రయత్నించాలి’ అని చెప్పారు. అంతే వెంటనే సమావేశంలోని వారంతా నోట్ చేసుకోవడం మానేసి శ్రద్ధగా వినడం ప్రారంభించారు’’ అని షిల్లర్ అన్నారు. మీటింగ్ సమయంలోని ప్రతీ అంశాన్ని గుర్తుంచుకోవాలని జాబ్స్ చెబుతుంటారని తెలిపారు.
యంగ్ ఇండియాది విరాట్ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్ రాజన్
అమెరికన్ రచయిత వాల్టర్ ఐజాక్సన్ కూడా స్టీవ్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఓసారి ప్యానెల్లో మాట్లాడాలని స్టీవ్ని పిలిచారంట. అయితే ఆయన దానిని నిరాకరించి నడుస్తూ మాట్లాడుకుందామని సూచించారట. నడుస్తూ సంభాషించడానికే ఆయన ఇష్టపడతారని రచయితకు అప్పుడే అర్థమైంది. ఏదైనా ముఖ్యమైన విషయానికి సంబంధించి చర్చించేటప్పుడు నడుస్తూనే సహోద్యోగులతో చర్చలు జరిపేవారని తెలిపారు. స్టీవ్ ఒక్కరే కాదు.. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే కూడా ఆరుబయట సమావేశాలనే ఇష్టపడతారట. స్నేహితులతో ఉన్నప్పుడు అలా నడుచుకుంటూ మాట్లాడటానికే ప్రాధాన్యం ఇస్తానంటూ గతంలో ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ