Apple iPhone: యాపిల్‌ ఐఫోన్‌ 17 మోడళ్లన్నీ భారత్‌లోనే

Eenadu icon
By Business News Team Published : 20 Aug 2025 17:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్‌ తన ఐఫోన్ల ఉత్పత్తిని భారత్‌లో విస్తృతం చేస్తోంది. త్వరలో విడుదల కాబోయే ఐఫోన్ 17 మోడళ్లన్నింటినీ (ప్రో వెర్షన్లు సహా) దేశంలోనే తయారు చేయాలని నిర్ణయించింది. చైనా మీద ఆధారపడడాన్ని తగ్గించి, అమెరికాకు ఎగుమతులపై టారిఫ్‌ రిస్క్‌లను తప్పించుకోవడానికి యాపిల్‌ ఈ వ్యూహాత్మక ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌ నుంచి అమెరికాకు ఐఫోన్‌ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.

యాపిల్ రాబోయే అన్ని ఐఫోన్‌ 17 మోడళ్లను భారత్‌లోని ఐదు ప్లాంట్లలో చేపట్టనుంది. విడుదలకు ముందే ప్రో వెర్షన్లు సహా అన్ని కొత్త ఐఫోన్‌ మోడళ్లను భారత్‌లోనే తయారుచేయడం ఇదే మొదటిసారి. తమిళనాడులోని హోసూర్‌లో టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ప్లాంట్‌తో పాటు బెంగళూరు విమానాశ్రయం సమీపంలోని ఫాక్స్‌కాన్‌ యూనిట్‌ ఈ ఉత్పత్తిలో కీలక భూమిక పోషించనున్నాయని బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు