Apple: ఐఫోన్ 12 రేడియేషన్ గురించి మాట్లాడొద్దు..!
యాపిల్ ఐఫోన్ 12 రేడియేషన్పై ఐరోపా సమాఖ్యలో ఆందోళనలు మొదలయ్యాయి. అక్కడి దేశాలు ఈ అంశంపై దృష్టిపెట్టాయి.
ఇంటర్నెట్డెస్క్: ఐఫోన్ 12 (iPhone 12) రేడియేషన్కు సంబంధించి యాపిల్ (Apple) సంస్థపై విమర్శలొస్తున్నాయి. ఫ్రాన్స్లోని టెక్ సపోర్టింగ్ స్టాఫ్ .. ఈ రేడియేషన్పై ఎలాంటి సమాచారాన్ని బయటకు వెల్లడించవద్దని యాపిల్ ఆదేశించినట్లు బ్లూమ్బెర్గ్ రిపోర్ట్లో పేర్కొంది. ఐరోపా సమాఖ్య నిర్దేశించిన ప్రమాణాల కంటే ఈ ఫోన్ అధికంగా ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఐఫోన్ 12 విక్రయాలు నిలిపివేయాలని యాపిల్ సంస్థను ఫ్రాన్స్ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సిబ్బందికి యాపిల్ మార్గదర్శకాలను పంపింది. ఐఫోన్12 కొని రెండు వారాలు దాటితే.. వారు రిటర్న్, ఎక్స్ఛేంజ్ చేసుకోవడానికి అంగీకరించవద్దని పేర్కొంది. దీంతోపాటు వారి ఫోన్లు పూర్తిగా సురక్షితమైనవని.. కఠిన పరీక్షలను దాటుకొని వచ్చాయని కస్టమర్లకు వెల్లడించాలని పేర్కొంది.
ఐఫోన్12 విక్రయాల నిలిపివేతపై ఫ్రాన్స్ డిజిటల్ మంత్రి మాట్లాడుతూ.. ఆ ఫోన్ ఐరోపా సమాఖ్య ప్రమాణాల కంటే అధిక రేడియేషన్ వెదజల్లుతోందన్నారు. కాకపోతే అది ప్రమాదకర స్థాయి కాదని పేర్కొన్నారు. ఓ సాఫ్ట్వేర్ అప్డేట్తో దీనిని సరిచేయవచ్చని వెల్లడించారు. తాము యాపిల్ ప్రతిస్పందన కోసం చూస్తున్నట్లు వెల్లడించారు.
ఫ్రాన్స్ బాటలో మరిన్ని దేశాలు..?
ఐఫోన్ 12పై తాజాగా బెల్జియం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఫోన్ వినియోగంలో ఉన్న రిస్క్లపై టెలికామ్ నియంత్రణ సంస్థ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఆ దేశ జూనియర్ డిజిటల్ మినిస్టర్ కోరారు. మరో వైపు జర్మనీ కూడా ఈ ఫోన్ రేడియేషన్ స్థాయిని తనిఖీ చేయనున్నట్లు వెల్లడించింది. డచ్ కూడా ఐఫోన్12పై యాపిల్ను వివరణ కోరింది.
యాత్రా ఆన్లైన్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే
ఫ్రాన్స్కు చెందిన రేడియేషన్ వాచ్ డాగ్ ఏఎన్ఆర్ఎఫ్ (ఏజెన్సీ నేషనల్ డెస్ ఫ్రీక్వెన్సీస్) మొత్తం 141 ఫోన్లపై పరీక్షలు నిర్వహించింది. ఐఫోన్ 12ను పట్టుకొన్నా, జేబులో పెట్టుకొన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఈయూ ప్రమాణాల ప్రకారం ఇది ప్రతి కిలోగ్రామ్కు 4 వాట్స్ ఉండాలి. కానీ, ఐఫోన్ 12లో 5.74గా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు