బజాజ్- ట్రయంఫ్ నుంచి 2 మోటార్ సైకిల్స్.. ఆ బైక్స్కు గట్టి పోటీ!
బజాజ్ -ట్రయంఫ్ కలిసి రెండు కొత్త బైక్లను దేశీయ విపణిలోకి తీసుకొచ్చాయి. ఇందులో ట్రయంఫ్ స్పీడ్ ధరను రూ.2.33 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. రాయల్ ఎన్ఫీల్డ్కు ఈ బైక్ గట్టి పోటీ ఇవ్వనుంది.
పుణె: దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj Auto), బ్రిటీష్ మోటార్ సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ (Triumph) కలిసి డెవలప్ చేసిన రెండు బైకులు దేశీయ విపణిలోకి అడుగుపెట్టాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 (Triumph Speed 400), స్క్రాంబ్లర్ 400 ఎక్స్ (Scrambler 400 X) పేరిట వీటిని తీసుకొచ్చాయి. లండన్లో గత వారం ఈ రెండు బైకులు విడుదల చేశారు. ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ.2.33 లక్షలుగా నిర్ణయించారు. తొలి 10 వేల కస్టమర్లకు రూ.2.23 లక్షలకే విక్రయించనున్నట్లు రెండు కంపెనీలు ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. స్క్రాంబ్లర్ 400 ఎక్స్ ధరను వెల్లడించలేదు. స్పీడ్ 400 ఈ నెల నుంచే విక్రయించనుండగా.. స్క్రాంబ్లర్ 400 ఎక్స్ విక్రయాలు అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇక ఇంజిన్ విషయానికొస్తే.. ఈ రెండు మోటార్ సైకిళ్లు 398 సీసీ ఇంజిన్తో వస్తున్నాయి. లిక్విడ్ కూల్డ్, డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ సింగిల్ సిలిండర్తో వస్తున్న ఈ ఇంజిన్.. 40 పీఎస్ పవర్ను, 39.5 నానోమీటర్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు. లీటర్కు 28 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి ఉన్నాయి.
Also Read: హార్లే డేవిడ్సన్ ఎక్స్ 440 బైక్
చకన్ ప్లాంట్లో ఈ రెండు మోటార్ సైకిళ్లను తయారు చేస్తున్నారు. నెలకు 5 వేల యూనిట్లను ఉత్పత్తి చేయనున్నామని, డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచనున్నట్లు బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. మెరుగైన అమ్మకాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. రెండు కంపెనీలు 2017లోనే గ్లోబల్ పార్ట్నర్షిప్ను కుదుర్చకున్నాయి. దేశీయంగా ట్రయంఫ్ మోటార్ సైకిళ్ల విక్రయాలు, మార్కెట్ కార్యకలాపాలు వంటి వ్యవహారాలను బజాజ్ ఆటోనే చూస్తోంది. ఇప్పటికే కేటీఎం, చేతక్ ఎలక్ట్రిక్స్, బజాజ్ ద్విచక్ర, త్రిచక్ర వాహన వ్యాపార కార్యకలాపాలను బజాజ్ నిర్వహిస్తోంది.
బజాజ్-ట్రయంఫ్ తీసుకొచ్చిన కొత్త బైక్స్ దేశీయంగా రాయల్ ఎన్ఫీల్డ్కు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. అలాగే, ఇటీవల దేశీయంగా విడుదలైన హార్లేడేవిడ్సన్ ఎక్స్440కి నుంచీ గట్టి పోటీ ఉండనుంది. KTM 390 సిరీస్తో బీఎండబ్ల్యూ జీ310, త్వరలో విడుదల కానున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 సైతం ఈ సెగ్మెంట్లో పోటీపడనున్నాయి. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అమ్మకాలతో దూసుకెళుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం