Bharti Hexacom IPO: భారతీ హెగ్జాకామ్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
Bharti Hexacom IPO: భారతీ హెగ్జాకామ్ ఐపీఓ ప్రారంభమైంది. 5న ముగియనుంది. మదుపర్లు కనీసం రూ.14,820తో 26 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
దిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ ‘భారతీ హెగ్జాకామ్’ ఐపీఓ (Bharti Hexacom IPO) బుధవారం ప్రారంభమైంది. ఈ నెల 5 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. షేరు ధరల శ్రేణిని రూ.542 - 570గా కంపెనీ నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.4,275 కోట్లు సమీకరించనుంది. రిటైల్ మదుపర్లు కనీసం రూ.14,820తో 26 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీ హెగ్జాకామ్ ఐపీఓనే (IPO) మొదటిది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద జరగనుంది. దీంతో ఐపీఓ ద్వారా సమీకరించే నిధులేమీ కంపెనీకి చెందబోవు. ఓఎఫ్ఎస్లో భాగంగా 7.5 కోట్ల షేర్లను వాటాదారు ‘టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా’ (టీసీఐఎల్) విక్రయించనుంది. ఈ సంస్థలో 70 శాతం వాటా భారతీ ఎయిర్టెల్కు, 30 శాతం టీసీఐఎల్కు ఉన్నాయి.
ఐపీఓలో 75 శాతం షేర్లను అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు (QIBs), 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు (NIIs), 10 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.6,719.20 కోట్లుగా, పన్నేతర లాభం రూ.549 కోట్లుగా నమోదైంది.
రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాల టెలికాం సర్కిళ్లలో భారతీ హెగ్జాకామ్ మొబైల్, ఫిక్స్డ్ లైన్ టెలిఫోన్, బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తోంది. ఐపీఓ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, యాక్సిస్ క్యాపిటల్, బీఓబీ క్యాపిటల్ మార్కెట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తున్నాయి. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో నమోదు కానున్నాయి.
ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..
- ఐపీఓ తేదీలు: ఏప్రిల్ 03-05
- ధరల శ్రేణి: రూ.542-570
- షేరు ముఖ విలువ: రూ.5
- కనీసం కొనాల్సిన షేర్ల సంఖ్య: 26 (ఒక లాట్)
- కనీస పెట్టుబడి: రూ.14,820
- అలాట్మెంట్ తేదీ: ఏప్రిల్ 8
- రిఫండ్ తేదీ: ఏప్రిల్ 10
- లిస్టింగ్ తేదీ: ఏప్రిల్ 12
(గమనిక: ఐపీఓలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. ఐపీఓలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ