Biden: చైనా స్మార్ట్ కార్లతో జాగ్రత్త : బైడెన్ సర్కార్
Biden: చైనా తయారుచేసిన కార్లపై దర్యాప్తు చేపట్టాలని బైడెన్ ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
వాషింగ్టన్: చైనా కార్లపై బైడెన్ (Biden) సర్కార్ దర్యాప్తునకు ఆదేశించింది. కార్ల సాయంతో అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని డ్రాగన్ సేకరించే ప్రమాదం ఉందని బైడెన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఎలక్ట్రిక్ సహా ఇతర కార్లలోని డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ వంటి ఫీచర్లను ఉపయోగించి అమెరికన్లపై గూఢచర్యం చేసేందుకు అవకాశం ఉందని భావిస్తోంది. ఈ క్రమంలో అమెరికన్ల డేటాను రక్షించడానికి ఈ చర్యలు చేపట్టినట్లు బైడెన్ గురువారం ప్రకటించారు.
‘అన్యాయమైన పద్ధతుల ద్వారా భవిష్యత్తులో ఆటో మొబైల్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించాలని చైనా నిశ్చయించుకుంది. చైనా అవలంభిస్తున్న విధానాలతో మొత్తం మార్కెట్ను వాటి వాహనాలతో నింపగలవు. అవి మన భద్రతకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. నా పాలనలో అలా జరగనివ్వను’ అని బైడెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికన్ల డేటా దుర్వినియోగం కాకుండా సంబంధిత సాంకేతికతను చైనా వినియోగించడంపై ఆంక్షలు విధించడానికి ఈ దర్యాప్తు దారితీయొచ్చని భావిస్తున్నారు.
నా బలం, బలగం వాళ్లే..!: ఆకాశ్, ఈశా గురించి అనంత్ అంబానీ
ఈ వ్యవహారంపై వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో మాట్లాడుతూ.. ఇంటర్నెట్కు అనసంధానించిన కార్లు.. చక్రాలపై ఉన్న స్మార్ట్ ఫోన్ల వంటివన్నారు. ‘చైనా స్మార్ట్ కార్లు ఇంటర్నెట్కు అనుసంధానించి ఉన్నాయి. డ్రైవర్ల ద్వారా వ్యక్తిగత సమాచారం, బయోమెట్రిక్ వంటి సున్నితమైన డేటాను సేకరిస్తాయి. ఇది జాతీయభద్రతకు, పౌరుల గోప్యతకు తీవ్ర ప్రమాదం కలిగిస్తుంది’ అని ఆమె అన్నారు. చైనా వాహనాలపై ట్రంప్ విధించిన అధిక సుంకాల విధానాన్ని బైడెన్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇది చైనా వాహన దిగుమతుల్ని కొంతవరకు నిరోధించింది. అయినప్పటికీ చైనా కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య