Anant Ambani: నా బలం, బలగం వాళ్లే..!: ఆకాశ్, ఈశా గురించి అనంత్ అంబానీ
తన తండ్రి తమతో స్నేహితుడిలా వ్యవహరిస్తారని, తమ తోబుట్టువుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్(Anant Ambani) అన్నారు.
ముంబయి: తమ ముగ్గురి మధ్య అనిర్వచనీయమైన అనుబంధం ఉందని ఆకాశ్(Akash Ambani), ఈశా(Isha Ambani) గురించి అనంత్ అంబానీ(Anant Ambani) వెల్లడించారు. వారెప్పుడూ తనకు అమూల్యమైన సూచనలు ఇస్తూ, తనను ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ప్రీవెడ్డింగ్ వేడుకల వేళ.. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన తోబుట్టువుల గురించి ఈవిధంగా స్పందించారు.
‘మా ముగ్గురి మధ్య ఎలాంటి పోటీ ఉండదు. ఆకాశ్, ఈశా నా మార్గనిర్దేశకులు. నా జీవితాంతం వారి సలహాలు అనుసరించాలని అనుకుంటున్నాను. వారికి నేను హనుమంతుడి లెక్క. నా అన్న నా రాముడు. ఈశా నాకు తల్లితో సమానం. మాది ఫెవిక్విక్ బంధం’ అంటూ నవ్వేశారు.
Anant Ambani: ‘అన్న సేవ’తో అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు ప్రారంభం
అలాగే తన తండ్రి ముకేశ్ అంబానీ(Mukesh Ambani) గురించి మాట్లాడుతూ.. ‘ఆయన నాతో ఒక స్నేహితుడిలా మెలుగుతారు. ఎప్పుడూ కఠినంగా వ్యవహరించరు. మాకు ఆయనంటే ఎంతో గౌరవం. నా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇవన్నీ నిర్మించగలుగుతున్నాను’ అని అన్నారు. అంబానీ కుటుంబంలో జన్మించడం వల్ల తనపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. ‘నేను నా మనసు చెప్పినట్టు చేస్తాను. చివరకు దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది. నేను కేవలం నాతండ్రి బాటలో వెళ్తున్నాను. అదే నన్ను ఎదిగేలా చేస్తోంది’ అని సమాధానమిచ్చారు.
‘అందుకే జామ్నగర్ ఎంచుకున్నాం’: ప్రీవెడ్డింగ్ వేదికపై అనంత్ స్పందన
అనంత్-రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలకు గుర్తుగా ముకేశ్ కుటుంబం బుధవారం రాత్రి ‘అన్నసేవ’ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో అంబానీ, మర్చంట్ కుటుంబాలు పాల్గొన్నాయి. ఇదిలాఉంటే.. ముకేశ్-నీతా అంబానీల ముగ్గురు పిల్లలు ఈశా, ఆకాశ్, అనంత్.. గత కొన్నేళ్లుగా వీరు రిటైల్, డిజిటల్ సేవలు, నూతన ఇంధనం సహా రిలయన్స్ కీలక వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నారు. అనుబంధ సంస్థల బోర్డుల్లోనూ సేవలందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల