Byjus lay offs: బైజూస్లో 500 మందికి ఉద్వాసన.. ఫోన్లోనే సమాచారం!
బైజూస్ సంస్థ మరోసారి ఉద్యోగ కోతలు చేపట్టింది. దాదాపు 500 మందిని ఇంటికి సాగనంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగులకు ఫోన్లోనే తొలగింపు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
Byjus layoffs | దిల్లీ: ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక ఆర్థికంగా అష్టకష్టాలు పడుతున్న ఎడ్టెక్ సంస్థ బైజూస్ (Byjus).. మరికొంతమంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. గత రెండేళ్లలో దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ.. తాజాగా మరో 500 మందికి ఉద్వాసన పలికింది. ఉద్యోగం కోల్పోయిన వారిలో సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. అలాగే, బైజూస్ ట్యూషన్ సెంటర్ కార్యకలాపాల్లో ఉన్న ఉద్యోగులూ తాజా తొలగింపులకు గురైన జాబితాలో ఉన్నట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి.
గత 8 వారాలుగా పనితీరు సరిగా కనబరచని ఉద్యోగులను విధుల నుంచి తప్పించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తొలగింపునకు సంబంధించిన సమాచారం ఫోన్లోనే ఉద్యోగులకు తెలియజేసినట్లు సమాచారం. ఇదే చివరి పని దినమని, తక్షణమే విధుల నుంచి తప్పిస్తున్నట్లు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఫోన్లో తెలియజేసినట్లు కొందరు ఉద్యోగులు ఆంగ్ల మీడియాకు తెలియజేశారు. నోటీసు పీరియడ్ ప్రస్తావన గానీ, పనితీరు మెరుగుపరుచుకునే అవకాశం గానీ ఇవ్వలేదని ఉద్యోగులు వాపోతున్నారు.
30 ఏళ్ల క్రితం ఎస్బీఐలో తాతకు షేర్లు.. ఇప్పటి విలువ చూసి మనవడు షాక్!
సంస్థ కార్యకలాపాలను సులభతరం చేయడం, ఖర్చులను తగ్గించేందుకు గానూ కంపెనీ గతేడాది అక్టోబర్లో వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ చేపట్టింది. తొలగింపుల వేళ.. ఈ ప్రక్రియ తుది దశకు చేరిందని కంపెనీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ఎంతమందిని లేఆఫ్ల్లో భాగంగా తొలగించిందీ వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. రైట్స్ ఇష్యూ ద్వారా సమకూరిన నిధుల వినియోగంపై ఆంక్షలు కొనసాగుతున్నందున జీతాలు సకాలంలో చెల్లించలేని పరిస్థితి నెలకొందంటూ ఆ సంస్థ సోమవారం ఉద్యోగులకు సమాచారం ఇచ్చిన మరుసటిరోజే ఉద్యోగులను తొలగించడం గమనార్హం.
కరోనా సమయంలో ఆన్లైన్ చదువులకు పెరిగిన డిమాండ్తో.. భవిష్యత్ను తప్పుగా అంచనా వేసి చేతులు కాల్చుకుంది బైజూస్. స్కూళ్లు యథావిధిగా తెరుచుకోవడంతో ఈ సంస్థకు 2022లోనే కష్టాలు మొదలయ్యాయి. దీనినుంచి బయటపడేందుకు సంస్థ లేఆఫ్ల మార్గాన్ని ఎంచుకుంది. మరోవైపు ఇన్వెస్టర్లతో పేచీల మూలంగా ఇటీవల రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించిన మొత్తాలనూ వినియోగించలేక ఇబ్బందిపడుతోంది. దీంతో ఫిబ్రవరి నెల వేతనాలను ఇప్పటికీ పూర్తిస్థాయిలో చెల్లించలేని స్థితికి చేరుకుంది. తొలగించిన ఉద్యోగులకు బకాయి పడిన వేతనాలను ఏప్రిల్ 5 నాటికి జమ చేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. 90 రోజుల్లో ఫైనల్ సెటిల్మెంట్ ఉంటుందని చెప్పడం కంపెనీ పరిస్థితికి అద్దం పడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి