SBI shares: 30 ఏళ్ల క్రితం ఎస్బీఐలో తాతకు షేర్లు.. ఇప్పటి విలువ చూసి మనవడు షాక్!
30 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి ఎస్బీఐ షేర్లలో పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు ఆయన మనవడు తాజాగా కనుగొన్నాడు. వాటి ఇప్పటి విలువ చూసి షాకయ్యాడు.
SBI shares | ఇంటర్నెట్ డెస్క్: పొదుపు విషయంలో మనకంటే మన పూర్వీకులే ముందు వరుసలో ఉంటారు. పెద్దగా పెట్టుబడి సాధనాలు అందుబాటులో లేని రోజుల్లో భావితరాల కోసం ఆస్తులు కూడబెట్టేవారు. అలాంటిది స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేని 30 ఏళ్ల క్రితమే ఓ వ్యక్తి ఎంతో ముందుచూపుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షేర్లను కొని, వాటిని అలానే వదిలేశారు. అప్పట్లో రూ.500 పెట్టి కొన్న వాటాల నేటి విలువ చూసి ఆశ్చర్యపోవడం ఆయన మనవడి వంతైంది.
చండీగఢ్కు చెందిన డాక్టర్ తన్మయ్ మోతీవాలా చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా పని చేస్తున్నారు. ఆయన తాత 1994లో రూ.500 విలువైన ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేశారు. ఇటీవల కుటుంబ ఆస్తులను ఒకచోట చేర్చినప్పుడు దీనికి సంబంధించిన షేర్ల సర్టిఫికెట్ను కనుగొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ షేర్లను తన తాత విక్రయించకుండా అలానే వదిలేశారని, వాటి గురించి మరిచిపోయారని పేర్కొన్నారు. ఆ వాటాల విలువ ఇప్పుడు డివిడెండ్లు ఏవీ కలపకుండానే రూ.3.75 లక్షలు అయ్యిందని మోతీవాలా తెలిపారు. ఇప్పుడు ఆ మొత్తం ఎక్కువ కానప్పటికీ.. 30 ఏళ్లలో 750 రెట్లు రిటర్నులు ఇవ్వడమంటే సాధారణ విషయం కాదని తన పోస్ట్లో చెప్పుకొచ్చారు.
ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..!
ఈ స్టాక్స్ను డీమ్యాట్ అకౌంట్లోకి మార్చడానికి పేరు, చిరునామాలో పొరపాట్లు ఉన్నాయని, అందుకోసమే ఓ కన్సల్టెంట్ను సంప్రదించానని మోతీవాలా తెలిపారు. ఇది కాస్త క్లిష్టమైన వ్యవహారమని, అందుకు కొంత సమయం కూడా పడుతుందన్నారు. ఈ వాటాలను విక్రయించాలని తాను అనుకోవడం లేదన్నారు. ఈ వైద్యుడి పోస్ట్ వైరల్గా మారడంతో కొందరు నెటిజన్లు స్పందించారు. ‘మన పెద్దవాళ్లను చూసి నేర్చుకోవాలి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తనకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టారు. ఎస్బీఐ ఉద్యోగి అయిన తన తండ్రి అప్పట్లో 500 షేర్లను కొనుగోలు చేశారని, ఆయన మరణానంతరం తాను ఆ షేర్లను విక్రయించినట్లు చెప్పారు. ఆ తర్వాత ఈక్విటీల్లో మదుపు చేయడం ప్రారంభించాననని పేర్కొన్నాడు.
రూ.500 కాదు.. రూ.5వేలు!
డా.తన్మయ్ ట్వీట్ వైరల్గా మారడంతో కొందరు అదెలా సాధ్యమంటూ ఆరాతీయడం మొదలుపెట్టారు. దీంతో తన్మయ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి తన తాత షేర్లు కొన్నది 5 వేల రూపాయలకు అని, ముఖ విలువ ఆధారంగా రూ.500గా లెక్కించి తాను పొరబడినట్లు పేర్కొన్నారు. అలాగే, స్టాక్ స్ప్లిట్ కారణంగా షేర్ల సంఖ్య 500 అయ్యాయని, కాబట్టి వాటి మొత్తంలో ఎలాంటి తేడా లేదని తెలిపారు. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో పెట్టుబడుల వల్ల ప్రయోజనం గురించి చెప్పడమే తన ఉద్దేశమని తాజా ట్వీట్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత