Bitcoin: హ్యాకింగ్ ఎఫెక్ట్.. భారీగా పెరిగి ఆపై పతనమైన బిట్కాయిన్
బిట్కాయిన్ ఈటీఎఫ్లు అమెరికాలో కలకలం సృష్టించాయి. ఎస్ఈసీ ఖతా హ్యాకింగ్కు గురికావడమే దీనికి ప్రధాన కారణం.
ఇంటర్నెట్డెస్క్: హ్యాకింగ్ కారణంగా బిట్కాయిన్ ధర మంగళవారం ఒడుదొడుకులకు గురైంది. అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్ (ఎస్ఈసీ) ఎక్స్ ఖాతాను సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) దుండగులు హ్యాక్ చేశారు. బిట్ కాయిన్ ఈటీఎఫ్లపై తప్పుడు పోస్టు పెట్టారు. ‘‘అన్ని రిజిస్టర్డ్ నేషనల్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసుకోవడానికి బిట్కాయిన్ ఈటీఎఫ్లకు అనుమతి మంజూరు చేస్తున్నాం’’ అని దానిలో పేర్కొన్నారు. ఆ పోస్టు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
పిల్లల ఇన్స్టా, ఫేస్బుక్ ఫీడ్లో ఇక అవి కనిపించవు: మెటా
దీనిపై ఎస్ఈసీ ఛైర్మన్ గ్యారీ జెన్సలర్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో స్పందించారు. ఎస్ఈసీ ఖతా హ్యాక్ అయినట్లు ప్రకటించారు. దానిలో తప్పుడు పోస్టు పెట్టినట్లు వివరణ ఇచ్చారు. బిట్కాయిన్ ఈటీఎఫ్లకు ఎస్ఈసీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఆ పోస్టును కూడా తొలగించామన్నారు. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.
వాస్తవానికి అమెరికాలో స్పాట్ బిట్కాయిన్ ఈటీఎఫ్లకు అనుమతిపై ఈ వారం ఎస్ఈసీ నుంచి కీలక ప్రకటన వస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. చాలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఇప్పటికే దీనిపై ఎస్ఈసీకి పలు మార్లు విజ్ఞప్తి చేశాయి. అదే సమయంలో ఎక్స్లో పోస్టు రావడంతో మార్కెట్లో బిట్కాయిన్ ధర ఏకంగా 2,000 డాలర్లు పెరిగి.. 48,000 డాలర్లకు చేరింది. ఆ తర్వాత ఎస్ఈసీ ఛైర్మన్ వివరణతో తిరిగి 46,000 డాలర్లకు చేరుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!