BSNL: బీఎస్ఎన్ఎల్లో మరోసారి VRS.. 35% మంది ఉద్యోగులను ఇంటికి పంపే యోచన!
.webp)
BSNL | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన శ్రామిక శక్తిని తగ్గించి, బ్యాలెన్స్ షీట్ను మెరుగుపరిచేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం మరోసారి స్వచ్ఛంద పదవీవిరమణ పథకం (VRS) అమలుచేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదాన్ని కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం. తద్వారా 35 శాతం శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని చూస్తోందని ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
బ్యాలెన్స్ షీట్ను మెరుగుపరిచేందుకు వీఆర్ఎస్ (VRS) ద్వారా టెల్కోలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని డాట్కు బీఎస్ఎన్ఎల్ బోర్డు ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ఇందుకోసం వీఆర్ఎస్ అమలుకు ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి రూ.15 వేల కోట్లను డాట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టెలికాం సంస్థకు వచ్చే ఆదాయంలో రూ.7,500 కోట్లు అంటే దాదాపు 38 శాతం ఉద్యోగుల జీతాల కోసం కేటాయిస్తోంది. ఈ వ్యయాన్ని రూ.5,000 కోట్లకు తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖతో పాటు కేబినెట్ ఆమోదం అనంతరం వీఆర్ఎస్ ప్రక్రియ చేపట్టనున్నారు.
ప్రస్తుతానికి వీఆర్ఎస్ ప్లాన్ ఇంకా అంతర్గత చర్చల్లో ఉందని, ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంస్థకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే ఈ విషయంపై టెలికాం అధికారిక ప్రకటన చేయలేదు. 2019లో బీఎస్ఎన్ఎల్, మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్కు (MTNL) రూ.69 వేల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ముందస్తు పదవీ విరమణ అంశం కూడా ఇమిడి ఉంది. ఆ సమయంలో ఈ రెండు టెలికాం సంస్థలకు చెందిన 93 వేల మంది ఉద్యోగులు వీఆర్ఎస్ను ఎంచుకున్నారు. 2022లో రెండోవిడతగా రూ.1.64 లక్షల కోట్లను కేంద్రం పునరుద్ధరణ ప్యాకేజీ కింద కేటాయించింది. దిల్లీ, ముంబయి నగరాల్లో ఎంటీఎన్ఎల్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. ఈ రెండు నగరాలు మినహా దేశమంతటా బీఎస్ఎన్ఎల్ సేవలందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. - 
                                    
                                        

హిందుజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
Hinduja Group Chairman: ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి హిందుజా (85) కన్నుమూశారు. లండన్లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. - 
                                    
                                        

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
SBI Q2 Results: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. - 
                                    
                                        

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
Free ChatGPT Go Plan: ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ తాజాగా భారత్లో ‘చాట్జీపీటీ గో’ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. - 
                                    
                                        

భారత్లోని కుబేరుల సంపద 23 ఏళ్లలో 62% వృద్ధి: జీ20 నివేదిక
Billionaires: ఆర్థిక అసమానతల వల్ల దేశాలు ప్రజాస్వామ్య తిరోగమాన్ని చవిచూస్తాయని జీ20 నివేదిక వెల్లడించింది. - 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్స్టైల్ బ్రాండ్గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. - 
                                    
                                        

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) ఎలా ఉన్నాయో చూడండి.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


