Elon Musk: ఎలాన్ మస్క్కు ‘టెస్లా’ షాక్.. ఒక్క రోజే రూ.1.64లక్షల కోట్లు ఆవిరి
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావానికి ప్రపంచ కుబేరుల్లో అగ్ర స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ (Elon Musk) సంపదలో ఒక్క రోజే రూ.1.64లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)కు భారీ షాక్ తగిలింది. టెస్లా షేర్ల భారీ పతనం (Tesla shares tumble)తో మస్క్ ఒక్కరోజే ఏకంగా 20.3 బిలియన్ డాలర్ల (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.64లక్షల కోట్లకు పైమాటే) సంపదను కోల్పోయారు. అయినప్పటికీ ఇంకా ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల ధరలను మరింత తగ్గించాలని యోచిస్తున్నట్లు టెస్లా (Tesla) ప్రకటించింది. వడ్డీ రేట్లు ఇలాగే కొనసాగితే విద్యుత్ వాహనాల ధరలను మరింత తగ్గించక తప్పదని మస్క్ (Elon Musk) వెల్లడించారు. దీంతో గురువారం నాటి అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్లో ఈ కంపెనీ షేర్ల ధర భారీగా పతనమైంది. షేరు ధర ఏకంగా 9.7శాతం కుంగింది. దీంతో ఒక్కరోజే ఎలాన్ మస్క్ సంపదలో 20.3 బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం మస్క్ మొత్తం నికర సంపద 234.4 బిలియన్ డాలర్లకు తగ్గింది.
ఈ ఏడాది జూన్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ స్థాపించిన ఎల్వీఎంహెచ్ షేర్లు భారీగా పతనమవ్వడంతో ఆయన సంపద తరిగిపోయింది. దీంతో మస్క్ మళ్లీ బెర్నార్డ్ను దాటి ప్రపంచ కుబేరుడి జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు టెస్లా షేర్ల నష్టంతో వీరిద్దరి సంపదల మధ్య వ్యత్యాసం తగ్గింది. అయినప్పటికీ మస్కే ఇంకా తొలి స్థానంలో కొనసాగుతున్నారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్ సూచీ ప్రకారం.. రెండో సంపన్నుడు బెర్నార్డ్ కంటే మస్క్ సంపద 33 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది.
గురువారం నాటి ట్రేడింగ్లో అమెరికాకు చెందిన నాస్డాక్ 100 సూచీ 2.3శాతం కుంగింది. దీంతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్తో సహా లారీ ఎల్లిసన్ (ఒరాకిల్), స్టీవ్ బాల్మెర్ (మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ), మార్క్ జుకర్బర్గ్ (మెటా అధినేత), లారీ పేజ్, సెర్గీ బ్రిన్ల (ఆల్ఫాబెట్ సహ వ్యవస్థాపకులు) నికర సంపదలు కూడా భారీగా తరిగిపోయాయి. వీరంతా కలిసి ఒక్కరోజే 20.8 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668
Stock Market Opening bell: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 దగ్గర కొనసాగుతోంది. -
పతంజలి దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు
Patanjali: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పది ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను రద్దు చేసింది. -
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.