Artificial Intelligence: ‘మనకెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. ఏఐపై మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Artificial Intelligence: ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఈ అధునాతన సాంకేతికత ప్రభావం గురించి వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్: టెక్ ప్రపంచంలో కృత్రిమ మేధ (Artificial Intelligence - AI ) సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయోగాలు, పరిశోధనలు ఓ వైపు ఆసక్తి రేకెత్తిస్తూనే.. మరోవైపు ఆందోళనకూ గురిచేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయనే వాదన కొన్ని వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై టెక్ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలను నేటి యువతరం నిశితంగా పరిశీలిస్తోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. ఏఐని మనుషుల్లా చూడడం ఆపాలని గట్టిగానే హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్యారిస్ కేంద్రంగా ‘వివా టెక్’ పేరిట నిర్వహించిన స్టార్టప్ సదస్సులో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
రాబోయే రోజుల్లో ఉద్యోగం చేయడం ఒక వ్యాపకంగా మారుతుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అన్ని ఉత్పత్తులు, సేవలను ఏఐ ఆధారిత సాధనాలు, రోబోలే అందిస్తాయని అంచనా వేశారు. అదే జరిగితే మనకెవ్వరికీ జాబ్స్ ఉండకపోవచ్చునని వివరించారు. అవసరమైతే ఒక వ్యాపకంగా మాత్రమే ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు రావొచ్చని తెలిపారు. అయితే, ఆ స్థితికి చేరుకోవడానికి ప్రపంచంలో ప్రతిఒక్కరికీ ‘యూనివర్సల్ హై ఇన్కమ్’ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పరోక్షంగా అందరికీ పెద్ద మొత్తంలో ఆదాయం ఉండాలని సూచించారు. దీనిపై ఆయన మరింత లోతుల్లోకి మాత్రం వెళ్లలేదు.
‘ఏఐ’ని మనుషుల్లా చూడడం ఆపాలి: సత్య నాదెళ్ల
కొన్నేళ్లలో ఏఐ సామర్థ్యాలు గణనీయంగా మెరుగయ్యాయని మస్క్ (Musk) తెలిపారు. దీంతో ఈ అధునాతన సాంకేతికతను బాధ్యతాయుతంగా ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కంపెనీలు, ప్రభుత్వాలు, నియంత్రణా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయని గుర్తుచేశారు. తనను వ్యక్తిగతంగా భయానికి గురిచేసేది ‘టెక్నాలజీ’ మాత్రమేనని చెప్పారు. ఇయాన్ బ్యాంక్స్ రాసిన ‘కల్చర్’ సిరీస్ పుస్తకాల్లో చూపించిన కల్పిత ప్రపంచం భవిష్యత్తులో ఆవిష్కృతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులకు మస్క్ ఓ కీలక సూచన చేశారు. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు గడిపే సమయాన్ని నియంత్రించాలని సూచించారు. వాటికి అలవాటుపడటం కోసం డోపమైన్ అనే హార్మోన్ను పెంచే విధంగా ఏఐతో ప్రోగ్రామ్ చేస్తున్నారని వెల్లడించారు. దీనిని ‘ఫీల్-గుడ్ హార్మోన్’గా వ్యవహరిస్తుంటారు. మనిషిలో ఆనందం, సంతృప్తి, ప్రేరణ వంటి భావాలకు ఇదే కారణమని వైద్యనిపుణులు చెబుతుంటారు. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, నిద్ర, సాధన, ఏకాగ్రత, కదలికల వంటి ఇతర శారీరక విధుల నియంత్రణలోనూ దీని పాత్ర ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి
ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ ఎన్ఎండీసీ లిమిటెడ్ రెట్టింపు ఉత్పత్తిపై దృష్టి సారించింది. దీనికి తగ్గట్లుగా పెట్టుబడులు సిద్ధం చేస్తోంది. -
కొత్త వ్యాపారాల్లో అయిదింతల వృద్ధి లక్ష్యం
వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు, సీఈఓ అనిశ్ షా తెలిపారు. -
నియంత్రణ పటిష్ఠమైనా మోసాలు తగ్గట్లేదు: కేపీఎంజీ సర్వే
నియంత్రణ చర్యల్లో పలు మార్పులు చేసినా, మోసాల సంఖ్య తగ్గడం లేదని తమ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది వెల్లడించినట్లు కేపీఎంజీ వెల్లడించింది. -
తాజా ఉత్తీర్ణులకు హుషారే
గత ఆరు నెలల్లో తాజా ఉత్తీర్ణుల (ఫ్రెషర్స్) నియామకాలు 5% పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. ఐటీ రంగ పరిస్థితి క్రమంగా మెరుగవుతుండటం ఇందుకు కారణమని పేర్కొంది. -
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్ యాంపీర్ నెక్సస్
గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్కు చెందిన ఇ-మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రై.లి. తన ఫ్యామిలీ విద్యుత్ స్కూటర్ యాంపీర్ నెక్సస్ను ఆవిష్కరించింది. -
అవిన్యా బ్రాండ్పై టాటా ప్రీమియం విద్యుత్తు కార్లు
టాటా మోటార్స్, ప్రీమియం విద్యుత్తు కార్లను అవిన్యా బ్రాండ్పై ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోందని సమాచారం. -
సంక్షిప్త వార్తలు(7)
ఈ ఏడాది, వచ్చే సంవత్సరానికి అంతర్జాతీయంగా ముడిచమురు వినియోగ అంచనాల్లో ఎటువంటి మార్పులు చేయడం లేదని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా వెల్లడించింది. 2024లో రోజుకు 2.25 మిలియన్ బ్యారెళ్లు, వచ్చే ఏడాదిలో రోజుకు 1.85 మిలియన్ బ్యారెళ్ల చొప్పున చమురుకు గిరాకీ పెరుగుతుందన్నది ఒపెక్ అంచనా. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.. -
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
ఇంటిపై రుణం ఇచ్చే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి?
తాజా వార్తలు (Latest News)
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్
-
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో