Market Updates: ఎక్సికామ్ బిగ్ ఎంట్రీ.. టాటా మోటార్స్ షేర్ల పరుగు
Market Updates: స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఈరోజు రెండు కంపెనీల షేర్లు లిస్టయ్యాయి. మరోవైపు టాటా మోటార్స్ షేర్లు 52 వారాల గరిష్ఠానికి చేరగా.. ఐఐఎఫ్ల్ ఫైనాన్స్ షేర్లు లోయర్ సర్క్యూట్ను తాకాయి.
దిల్లీ: విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ మౌలిక వసతుల కల్పన సంస్థ ఎక్సికామ్ టెలీ సిస్టమ్స్ లిమిటెడ్ (Exicom Tele Systems Listing) షేర్లు మంగళవారం తొలిసారి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.142తో పోలిస్తే బీఎస్ఈలో 85.91 శాతం లాభంతో రూ.264 వద్ద లిస్టయ్యింది. ఎన్ఎస్ఈలో 86.61 శాతం పెరిగి రూ.265 దగ్గర ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఐపీఓలో మదుపర్లు రూ.14,200తో కనీసం 100 షేర్లను కొనుగోలు చేశారు. దీంతో షేర్లు దక్కించుకున్నవారు లిస్టింగ్లో ఒక్కో లాట్పై రూ.12,200 లాభం పొందారు.
రూ.429 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎక్సికామ్ టెలీ సిస్టమ్స్ లిమిటెడ్ ఐపీఓ ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు జరిగింది. దాదాపు 129 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. షేరు ధరల శ్రేణిని 135-142 మధ్య నిర్ణయించారు. రూ.329 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు రూ.100 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద అందుబాటులో ఉంచారు. ఛార్జింగ్, పవర్ సొల్యూషన్స్.. రెండు విభాగాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
33% లాభంతో ప్లాటినం ఇండస్ట్రీస్ లిస్టింగ్
ప్లాటినం ఇండస్ట్రీస్ షేర్లు సైతం ఈరోజే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అరంగేట్రం చేశాయి (Platinum Industries Listing). ఇష్యూ ధర రూ.171తో పోలిస్తే బీఎస్ఈలో 33.33 శాతం లాభంతో రూ.228 దగ్గర, ఎన్ఎస్ఈలో 31.57 శాతం పుంజుకొని రూ.225 వద్ద లిస్టయ్యింది. రూ.235 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీఓ ఫిబ్రవరి 27, 28, 29 తేదీల్లో జరిగింది. మొత్తం 98.99 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
52 వారాల గరిష్ఠానికి టాటా మోటార్స్ షేర్లు
టాటా మోటార్స్ షేరు విలువ (Tata Motors shares) మంగళవారం ఆరంభంలో దాదాపు ఎనిమిది శాతం పెరిగి రూ.1,065 దగ్గర 52 వారాల గరిష్ఠానికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.12,601 కోట్లు ఎగబాకి రూ.3,40,633.29 కోట్లకు చేరింది. టాటా మోటార్స్ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా విభజించాలనే ప్రతిపాదనకు సోమవారం బోర్డు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు షేర్లు రాణిస్తున్నాయి.
వాణిజ్య వాహనాల వ్యాపారం, దాని సంబంధిత పెట్టుబడులు ఒక సంస్థగా; ప్రయాణికుల వాహనాల (PVs) వ్యాపారాలు, విద్యుత్ వాహనాలు (Electric Vehicles- EV), జాగ్వార్ ల్యాండ్ రోవర్, దాని సంబంధిత పెట్టుబడులు మరొక సంస్థగా విడదీయాలనుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్ సమాచారమిచ్చింది. టాటా మోటార్స్ వాటాదార్లందరికీ ఈ రెండు నమోదిత సంస్థల్లో షేర్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది.
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేర్లు ఢమాల్..
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు (IIFL Finance shares) మంగళవారం 20 శాతానికి పైగా కుంగి బీఎస్ఈలో రూ.478.50 దగ్గర లోయర్ సర్క్యూట్ని తాకాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.4,552.85 కోట్లు తగ్గి రూ.18,253.97 కోట్లకు చేరింది.
పసిడి రుణాలు ఇవ్వకూడదంటూ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్పై ఆర్బీఐ సోమవారం ఆంక్షలు విధించింది. పసిడి శుద్ధతను పరీక్షించడం, లోడ్- టు- వ్యాల్యూ నిష్పత్తిలో ఉల్లంఘనలు, పసిడి రుణ మంజూరు, వేలం సమయంలో నికర బరువును లెక్కించడంలో లోపాలు, వేలం నిర్వహణలోనూ నిబంధనలు పాటించకపోవడం, వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీల్లో పారదర్శకత లేకపోవడం వంటి లోపాలు గుర్తించినట్లు ఆర్బీఐ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
Elon Musk: దాదాపు వారం క్రితం ఎలాన్ మస్క్ భారత పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆకస్మికంగా చైనాలో పర్యటిస్తున్నట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్