Market Updates: ఎక్సికామ్ బిగ్ ఎంట్రీ.. టాటా మోటార్స్ షేర్ల పరుగు
Market Updates: స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఈరోజు రెండు కంపెనీల షేర్లు లిస్టయ్యాయి. మరోవైపు టాటా మోటార్స్ షేర్లు 52 వారాల గరిష్ఠానికి చేరగా.. ఐఐఎఫ్ల్ ఫైనాన్స్ షేర్లు లోయర్ సర్క్యూట్ను తాకాయి.
దిల్లీ: విద్యుత్తు వాహనాల ఛార్జింగ్ మౌలిక వసతుల కల్పన సంస్థ ఎక్సికామ్ టెలీ సిస్టమ్స్ లిమిటెడ్ (Exicom Tele Systems Listing) షేర్లు మంగళవారం తొలిసారి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.142తో పోలిస్తే బీఎస్ఈలో 85.91 శాతం లాభంతో రూ.264 వద్ద లిస్టయ్యింది. ఎన్ఎస్ఈలో 86.61 శాతం పెరిగి రూ.265 దగ్గర ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఐపీఓలో మదుపర్లు రూ.14,200తో కనీసం 100 షేర్లను కొనుగోలు చేశారు. దీంతో షేర్లు దక్కించుకున్నవారు లిస్టింగ్లో ఒక్కో లాట్పై రూ.12,200 లాభం పొందారు.
రూ.429 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎక్సికామ్ టెలీ సిస్టమ్స్ లిమిటెడ్ ఐపీఓ ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు జరిగింది. దాదాపు 129 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. షేరు ధరల శ్రేణిని 135-142 మధ్య నిర్ణయించారు. రూ.329 కోట్లు విలువ చేసే కొత్త షేర్లతో పాటు రూ.100 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద అందుబాటులో ఉంచారు. ఛార్జింగ్, పవర్ సొల్యూషన్స్.. రెండు విభాగాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
33% లాభంతో ప్లాటినం ఇండస్ట్రీస్ లిస్టింగ్
ప్లాటినం ఇండస్ట్రీస్ షేర్లు సైతం ఈరోజే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అరంగేట్రం చేశాయి (Platinum Industries Listing). ఇష్యూ ధర రూ.171తో పోలిస్తే బీఎస్ఈలో 33.33 శాతం లాభంతో రూ.228 దగ్గర, ఎన్ఎస్ఈలో 31.57 శాతం పుంజుకొని రూ.225 వద్ద లిస్టయ్యింది. రూ.235 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీఓ ఫిబ్రవరి 27, 28, 29 తేదీల్లో జరిగింది. మొత్తం 98.99 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
52 వారాల గరిష్ఠానికి టాటా మోటార్స్ షేర్లు
టాటా మోటార్స్ షేరు విలువ (Tata Motors shares) మంగళవారం ఆరంభంలో దాదాపు ఎనిమిది శాతం పెరిగి రూ.1,065 దగ్గర 52 వారాల గరిష్ఠానికి చేరింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.12,601 కోట్లు ఎగబాకి రూ.3,40,633.29 కోట్లకు చేరింది. టాటా మోటార్స్ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా విభజించాలనే ప్రతిపాదనకు సోమవారం బోర్డు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు షేర్లు రాణిస్తున్నాయి.
వాణిజ్య వాహనాల వ్యాపారం, దాని సంబంధిత పెట్టుబడులు ఒక సంస్థగా; ప్రయాణికుల వాహనాల (PVs) వ్యాపారాలు, విద్యుత్ వాహనాలు (Electric Vehicles- EV), జాగ్వార్ ల్యాండ్ రోవర్, దాని సంబంధిత పెట్టుబడులు మరొక సంస్థగా విడదీయాలనుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్ సమాచారమిచ్చింది. టాటా మోటార్స్ వాటాదార్లందరికీ ఈ రెండు నమోదిత సంస్థల్లో షేర్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది.
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేర్లు ఢమాల్..
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు (IIFL Finance shares) మంగళవారం 20 శాతానికి పైగా కుంగి బీఎస్ఈలో రూ.478.50 దగ్గర లోయర్ సర్క్యూట్ని తాకాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.4,552.85 కోట్లు తగ్గి రూ.18,253.97 కోట్లకు చేరింది.
పసిడి రుణాలు ఇవ్వకూడదంటూ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్పై ఆర్బీఐ సోమవారం ఆంక్షలు విధించింది. పసిడి శుద్ధతను పరీక్షించడం, లోడ్- టు- వ్యాల్యూ నిష్పత్తిలో ఉల్లంఘనలు, పసిడి రుణ మంజూరు, వేలం సమయంలో నికర బరువును లెక్కించడంలో లోపాలు, వేలం నిర్వహణలోనూ నిబంధనలు పాటించకపోవడం, వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీల్లో పారదర్శకత లేకపోవడం వంటి లోపాలు గుర్తించినట్లు ఆర్బీఐ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్