Flipkart sale: ఫ్లిప్కార్ట్ నుంచి మరో సేల్.. ఈ కార్డులపై డిస్కౌంట్స్
Flipkart Big Dussehra Sale: ఫ్లిప్కార్ట్ అక్టోబర్ 22 నుంచి 29 వరకు 8 రోజుల పాటు మరో సేల్ నిర్వహించనుంది. కొన్ని కార్డులపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.
Flipkart Big Dussehra Sale | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (flipkart) మరోసేల్కు సిద్ధమైంది. ఇటీవల బిగ్ బిలియన్ డేస్ పేరుతో అతిపెద్ద సేల్ నిర్వహించిన ఆ సంస్థ.. దసరా సందర్భంగా ‘బిగ్ దసరా సేల్’ను నిర్వహిస్తోంది. 22వ తేదీ నుంచి 29 వరకు మొత్తం 8 రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందే ఈ సేల్ అందుబాటులోకి రానుంది.
బిగ్ దసరా సేల్లో భాగంగా కోటక్, ఆర్బీఎల్, ఎస్బీఐ కార్డు హోల్డర్లకు 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. ఐసీఐసీఐ కార్డు డెబిట్/క్రెడిట్ కార్డులపైనా ప్లస్ మెంబర్లకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, 21వ తేదీ ఒక్కరోజు మాత్రమే. సూపర్ కాయిన్ల ద్వారా 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. దీని తర్వాత ఫ్లిప్కార్ట్ దీపావళికి ముందు మరో సేల్ నిర్వహించనుంది.
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ FDపై 7.75% వడ్డీ.. పూర్తి వివరాలు ఇవే!
ఇక ఆఫర్ల విషయానికొస్తే.. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, దుస్తులపై ఆఫర్లు ఇస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ పేర్కొంది. ఇప్పటికే కొన్ని స్మార్ట్ ఫోన్లపై డీల్స్ ప్రకటించింది. మోటోరొలా ఎడ్జ్ 40, ఒప్పో రెనో 10 5జీ, గూగుల్ పిక్సెల్ 7ఏ, శాంసంగ్ ఎస్ 22 5జీ, పోకో ఎఫ్5, వివో టీ2 ప్రో వంటి మొబైల్స్పై ఆఫర్లు ప్రకటించింది. ఐఫోన్ 14 సహా పలు మొబైల్స్పై త్వరలో ఆఫర్లను రివీల్ చేయనుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ ధరలే ఇంచుమించు ఉండనున్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఆఫర్లు మిస్ అయిన వారు ఈ సేల్లో పాల్గొనొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు