Flipkart sale: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ కార్డులపై 10% డిస్కౌంట్
Flipkart slae: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 9 వరకు ఆరు రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale)ను ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది. సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభిస్తాయి. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ యూజర్లు ఒక రోజు ముందుగానే ఈ సేల్లో పాల్గొనవచ్చని ప్రకటించింది.
ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై.. 9 మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ కార్డ్పై సూపర్ కాయిన్స్ లభించనున్నాయి. క్రేజీ డీల్స్ పేరున అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కొత్త ఆఫర్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. అయితే ఫోర్ అవర్ డీల్స్ సేల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు ప్రత్యేకమైన ఆఫర్లు ఉండనున్నాయని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.
ఐటీ రిటర్నులు ఫైల్ చేశారా... రిఫండ్ల విషయంలో ఈ తప్పులొద్దు!
ఇక ఈ సేల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్ అందిచనున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ల్యాప్టాప్లు, స్మార్ట్వాచ్లు, దుస్తులు, ఫర్నిచర్లపై 80శాతం డిస్కౌంట్ పొందవచ్చు. టీవీ, ఏసీలు, ఫ్రిడ్జ్లపై 75 శాతం, బ్యూటీ, ఫుడ్, టాయ్స్పై 85 శాతం వరకు డిస్కౌంట్లు అందించనుంది. అయితే, ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్ అన్న వివరాలను వెల్లడించలేదు.
అమెజాన్ కాస్త ముందుగానే..
అమెజాన్ తన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Great Freedom Festival sale) తేదీలను సవరించింది. ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు ఈ సేల్ నిర్వహించనుంది. ప్రైమ్ కస్టమర్లకు 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. తొలుత ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు సేల్ నిర్వహిస్తామని అమెజాన్ ప్రకటించడం గమనార్హం. సేల్లో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. త్వరలో ఆఫర్ల వివరాలు వెల్లడి కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.