Flipkart: ఐఫోన్ ఆర్డర్ క్యాన్సిల్.. ఫ్లిప్కార్ట్కు రూ.10,000 జరిమానా!
Flipkart: ఐఫోన్ ఆర్డర్ను ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడం వల్ల కస్టమర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని.. అందుకు ఫ్లిప్కార్ట్ రూ.10,000 జరిమానా చెల్లించాలని సెంట్రల్ ముంబయికి చెందిన ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్’ ఆదేశించింది.
ముంబయి: ఫ్లిప్కార్ట్కు (Flipkart) సెంట్రల్ ముంబయికి చెందిన ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్’ రూ.10,000 జరిమానా విధించింది. ఓ కస్టమర్ ఆర్డర్ను అతని అనుమతి లేకుండా క్యాన్సిల్ చేసిందని తెలిపింది. అదనపు లాభం కోసమే ఈ - కామర్స్ సంస్థ అలా చేసిందని తేల్చింది. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లించాల్సిందేనని తీర్పు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే.. దాదర్కు చెందిన ఓ వ్యక్తి 2022 జులై 10న క్రెడిట్ కార్డు ద్వారా రూ.39,628కు ఫ్లిప్కార్ట్లో (Flipkart) ఐఫోన్ ఆర్డర్ చేశారు. జులై 12కల్లా ఫోన్ను వారికి అందజేయాల్సింది. కానీ, ఆరు రోజుల తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు ఎసెమ్మెస్ వచ్చింది. దీనిపై ఫ్లిప్కార్ట్ను సంప్రదించగా.. తమ ఈకార్ట్ ప్రతినిధి పలుమార్లు ఫోన్ను డెలివరీ చేయడానికి యత్నించినా కస్టమర్ అందుబాటులో లేరని తెలిపింది.
దీంతో కస్టమర్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫ్లిప్కార్ట్ (Flipkart) తన ఆర్డర్ను క్యాన్సిల్ చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నారు. ఇది ఆన్లైన్ మోసం కిందకూ వస్తుందని తెలిపారు. దీంట్లో ఈకార్ట్ సంస్థనూ బాధ్యులుగా చేర్చారు. దీనిపై ఫ్లిప్కార్ట్ను కమిషన్ వివరణ కోరగా.. తమది కేవలం ఆన్లైన్ వేదిక మాత్రమేనని సమర్థించుకుంది. కొనుగోలు పూర్తిగా కస్టమర్, విక్రేతల మధ్య జరిగిన ఒప్పందమని.. దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ కేసులో విక్రేత ఇంటర్నేషనల్ వాల్యూ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని తెలిపింది. చెల్లించిన డబ్బును తిరిగిచ్చేశామని.. ఇక వివాదం విక్రేత, కస్టమర్ మధ్యే ఉందని సమర్థించుకుంది. విషయాన్ని ఇంటర్నేషనల్ వాల్యూ రిటైల్కు తెలియజేశామని పేర్కొంది.
సింగిల్ క్లిక్తో ఆధార్ హిస్టరీ.. ఎలా చూడాలంటే?
దీనిపై విచారణ చేపట్టిన కమిషన్.. ఆర్డర్ను ఫ్లిప్కార్ట్ ఏకపక్షంగా క్యాన్సిల్ చేసిందని తేల్చింది. పైగా అప్పటికే కస్టమర్ ఈ - కామర్స్ సంస్థతో నిరంతర సంప్రదింపులో ఉన్నారని తెలిపింది. ఆ సమయంలోనే ఆర్డర్ను క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. పైగా డెలివరీ చేయడానికి యత్నించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. మరోవైపు సమస్యను పరిష్కరిస్తున్నట్లు కస్టమర్కు తెలియజేసినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా బాధ్యత ఫ్లిప్కార్ట్దేనని తేల్చింది. రిఫండ్ చేసి మరోసారి కొత్తగా ఫోన్ ఆర్డర్ చేసుకోవాలని సూచించినా.. అప్పటికే ధర రూ.7,000 పెరిగిందని గుర్తు చేసింది. ఇది పూర్తిగా కస్టమర్ను మనోవేదనకు గురి చేయడమేనని తేల్చింది. అదనపు లాభం కోసమే ఇలాంటి అక్రమ విధానాలను అవలంబించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.10,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి