Flipkart: ఐఫోన్ ఆర్డర్ క్యాన్సిల్.. ఫ్లిప్కార్ట్కు రూ.10,000 జరిమానా!
Flipkart: ఐఫోన్ ఆర్డర్ను ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడం వల్ల కస్టమర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని.. అందుకు ఫ్లిప్కార్ట్ రూ.10,000 జరిమానా చెల్లించాలని సెంట్రల్ ముంబయికి చెందిన ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్’ ఆదేశించింది.
ముంబయి: ఫ్లిప్కార్ట్కు (Flipkart) సెంట్రల్ ముంబయికి చెందిన ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్’ రూ.10,000 జరిమానా విధించింది. ఓ కస్టమర్ ఆర్డర్ను అతని అనుమతి లేకుండా క్యాన్సిల్ చేసిందని తెలిపింది. అదనపు లాభం కోసమే ఈ - కామర్స్ సంస్థ అలా చేసిందని తేల్చింది. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లించాల్సిందేనని తీర్పు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే.. దాదర్కు చెందిన ఓ వ్యక్తి 2022 జులై 10న క్రెడిట్ కార్డు ద్వారా రూ.39,628కు ఫ్లిప్కార్ట్లో (Flipkart) ఐఫోన్ ఆర్డర్ చేశారు. జులై 12కల్లా ఫోన్ను వారికి అందజేయాల్సింది. కానీ, ఆరు రోజుల తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు ఎసెమ్మెస్ వచ్చింది. దీనిపై ఫ్లిప్కార్ట్ను సంప్రదించగా.. తమ ఈకార్ట్ ప్రతినిధి పలుమార్లు ఫోన్ను డెలివరీ చేయడానికి యత్నించినా కస్టమర్ అందుబాటులో లేరని తెలిపింది.
దీంతో కస్టమర్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫ్లిప్కార్ట్ (Flipkart) తన ఆర్డర్ను క్యాన్సిల్ చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మనోవేదనకు గురైనట్లు పేర్కొన్నారు. ఇది ఆన్లైన్ మోసం కిందకూ వస్తుందని తెలిపారు. దీంట్లో ఈకార్ట్ సంస్థనూ బాధ్యులుగా చేర్చారు. దీనిపై ఫ్లిప్కార్ట్ను కమిషన్ వివరణ కోరగా.. తమది కేవలం ఆన్లైన్ వేదిక మాత్రమేనని సమర్థించుకుంది. కొనుగోలు పూర్తిగా కస్టమర్, విక్రేతల మధ్య జరిగిన ఒప్పందమని.. దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఈ కేసులో విక్రేత ఇంటర్నేషనల్ వాల్యూ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని తెలిపింది. చెల్లించిన డబ్బును తిరిగిచ్చేశామని.. ఇక వివాదం విక్రేత, కస్టమర్ మధ్యే ఉందని సమర్థించుకుంది. విషయాన్ని ఇంటర్నేషనల్ వాల్యూ రిటైల్కు తెలియజేశామని పేర్కొంది.
సింగిల్ క్లిక్తో ఆధార్ హిస్టరీ.. ఎలా చూడాలంటే?
దీనిపై విచారణ చేపట్టిన కమిషన్.. ఆర్డర్ను ఫ్లిప్కార్ట్ ఏకపక్షంగా క్యాన్సిల్ చేసిందని తేల్చింది. పైగా అప్పటికే కస్టమర్ ఈ - కామర్స్ సంస్థతో నిరంతర సంప్రదింపులో ఉన్నారని తెలిపింది. ఆ సమయంలోనే ఆర్డర్ను క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. పైగా డెలివరీ చేయడానికి యత్నించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. మరోవైపు సమస్యను పరిష్కరిస్తున్నట్లు కస్టమర్కు తెలియజేసినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో కచ్చితంగా బాధ్యత ఫ్లిప్కార్ట్దేనని తేల్చింది. రిఫండ్ చేసి మరోసారి కొత్తగా ఫోన్ ఆర్డర్ చేసుకోవాలని సూచించినా.. అప్పటికే ధర రూ.7,000 పెరిగిందని గుర్తు చేసింది. ఇది పూర్తిగా కస్టమర్ను మనోవేదనకు గురి చేయడమేనని తేల్చింది. అదనపు లాభం కోసమే ఇలాంటి అక్రమ విధానాలను అవలంబించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.10,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్