Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

Flipkart Year End Sale: ఫ్లిప్‌కార్ట్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌ తేదీలను ప్రకటించింది. పెద్ద ఎత్తున క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లతో ఈ సేల్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

Updated : 08 Dec 2023 15:22 IST

Flipkart Year End Sale | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ఇయర్‌ ఎండ్‌ సేల్‌ (Year End Sale)ను ప్రకటించింది. డిసెంబరు 9 నుంచి 16 వరకు ఏడు రోజుల పాటు ఈ సేల్‌ కొనసాగనుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఫ్యాషన్‌, గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ అందించనుంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది.

ఐఫోన్‌14 (iPhone 14) రిటైల్‌ ధర రూ.69,900 ఉండగా.. ఈ సేల్‌ ద్వారా రూ.55,000కే కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. మోటోరోలా ఎడ్జ్‌ 40 (Motorola Edge 40) పైనా ఫ్లిప్‌కార్ట్‌ రాయితీ అందిస్తోంది. రూ.34,999 ధర వద్ద విడుదలైన ఈ ఫోన్‌ రూ.25,499కే లభిస్తుంది. ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 30ఐ (Infinix Hot 30i)ను రూ.7,149కే కొనుగోలు చేయవచ్చు. నథింగ్‌ ఫోన్‌2 (Nothing Phone 2) ధర రూ.39,999 కాగా.. తాజా సేల్‌లో రూ.34,999కే కొనుగోలు చేయవచ్చు. అయితే బ్యాంక్‌ ఆఫర్లు, సేల్‌ ప్రత్యేక తగ్గింపు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను కలిపిన తర్వాత ఈ ధరలు వర్తిస్తాయి.

13న ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.469-493

వీటితో పాటు గూగుల్‌ పిక్సెల్‌7, రియల్‌మీ సీ53, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌14 5జీ, పోకో సీ55, రియల్‌మీ 11 ప్రో 5జీ.. సహా మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై గణనీయమైన తగ్గింపు ఉండనున్నట్లు వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై 75శాతం డిస్కౌంట్ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ( Bank of Baroda), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ( Bank of Baroda) డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్‌ అందించనుంది. అంతే కాదు ఎంపిక చేసిన కొన్ని కొనుగోళ్లపై అదనపు డిస్కౌంట్‌, నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని