McDonald: చిన్నారికి వేడి చికెన్‌ నగెట్స్‌.. మెక్‌డొనాల్డ్స్‌కు రూ.6 కోట్ల ఫైన్‌..!

హ్యాపీ మీల్‌ తిందామని ఆశించిన ఓ చిన్నారికి.. ఎక్కువ వేడిగా ఉన్న ఆహారం అందించినందుకు మెక్‌డొనాల్డ్స్‌ సంస్థకు రూ.6.5 కోట్ల ఫైన్‌ పడింది.

Updated : 21 Jul 2023 13:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చికెన్‌ నగెట్స్‌ తిందామని ఆశపడిన చిన్నారికి.. విపరీతమైన వేడిగా ఉన్న ఆహారం అందించినందుకు ప్రముఖ ఫుడ్‌ చెయిన్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌ (McDonald)కు భారీగా ఫైన్‌ పడింది. ఈ ఘటన అమెరికా(USA)లో చోటు చేసుకొంది. ఒలివియా కారబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి 2019లో ఫ్లొరిడాలోని ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ సమీపంలో మెక్‌డొనాల్డ్స్‌ డ్రైవ్‌ ఇన్‌కు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ హ్యాపీ మీల్‌ను కొనుగోలు చేసింది. దానిని తినేందుకు కారులో బాక్స్‌ తెరవగా విపరీతమైన వేడిగా ఉన్న ఓ నగెట్‌ ఆమె కాలుపై పడింది. ఈ ఘటనలో ఆమె కాలుకు స్వల్ప గాయమైంది. దీనికి తోడు ఆమె భయంతో చాలా సేపు ఏడుస్తూనే ఉంది. దీంతో ఒలివియా కుటుంబ సభ్యులు మెక్‌డొనాల్డ్స్‌పై ఫ్లొరిడాలోని న్యాయస్థానంలో కేసు ఫైల్‌ చేశారు.

జియో ఫైనాన్షియల్‌ @ రూ.1,66,000 కోట్లు

కోర్టుకు చిన్నారి గాయం ఫొటోలు, ఆ సమయంలో పాప బాధతో ఏడుస్తున్న ఆడియోను అందించారు.  దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ చిన్నారికి గతంలో పడిన ఇబ్బందికి నాలుగు లక్షల డాలర్లు.. భవిష్యత్తు కోసం మరో నాలుగు లక్షల డాలర్లు చెల్లించాలని మెక్‌డొనాల్డ్స్‌ను ఆదేశించింది. ఇది భారత కరెన్సీలో రూ.6.5 కోట్లకు సమానం.

ఈ కేసులో మెక్‌డొనాల్డ్స్‌ తరపు లాయర్‌ స్పందిస్తూ.. కాలిన గాయం మూడు వారాల్లో తగ్గిన తర్వాత నొప్పి కూడా పోయిందని బాధితురాలి కుటుంబీకులు చెప్పారని వాదించారు. ఆమెకు  1.56లక్షల డాలర్లు సరిపోతాయన్నారు. ఆ పాప ఇప్పటికీ మెక్‌డొనాల్డ్స్‌ ఔట్‌లెట్లకు వెళ్లి చికెన్‌ నగెట్లను తింటోందని చెప్పారు. కానీ, న్యాయస్థానం మాత్రం 8,00,000 డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. పాప తల్లి కోర్టు బయట మాట్లాడుతూ..  ఈ తీర్పు కీలకమని.. తాము న్యాయస్థానం నుంచి ఏమీ ఆశించలేదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు