Sundar Pichai: వర్క్-లైఫ్ బ్యాలెన్స్పై పిచాయ్.. చెప్పిన మాటకు కట్టుబడిన గూగుల్ బాస్
Sundar Pichai: వారానికి రెండు రోజులు రిమోట్ మోడల్లో పనిచేయడం వల్ల ఉద్యోగులు వర్క్-లైఫ్ని బ్యాలెన్స్ చేయొచ్చని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. దాన్నే ఇప్పుడు ఆచరణలో పెట్టారు.
Sundar Pichai | ఇంటర్నెట్డెస్క్: ఇంటర్నెట్డెస్క్: కొవిడ్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి ప్రారంభమైంది. తర్వాత హైబ్రిడ్ విధానం అమల్లోకి వచ్చింది. వర్క్ను, లైఫ్ను బ్యాలెన్స్ చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని గతంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. రెండేళ్ల క్రితం దీనిపై మాట్లాడారు. దాన్ని ఆచరణలోనూ పెట్టారు. చాలా సంస్థలు ఉద్యోగుల్ని తిరిగి కార్యాలయాలకు రప్పిస్తున్నా.. గూగుల్ మాత్రం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసేలా తన విధానాన్ని రూపొందించడం గమనార్హం.
హైబ్రిడ్ విధానంలో పనిచేయడం వల్ల ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని గతంలో పిచాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి, రెండు రోజులు ఇంటి నుంచి పని చేసినప్పుడే వర్క్-లైఫ్ సులభంగా బ్యాలెన్స్ చేయగలరని భావిస్తున్నా. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి పని చేయడంతో పాటు ఇంటినుంచి పని చేయడం వల్ల రెండింటినీ సమతౌల్యం చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి ప్రధాన నగరాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఇది సరైన పరిష్కారం’’ అని సుందర్ పిచాయ్ 2021లో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
యాపిల్ యూజర్లకు కేంద్రం ‘హై-రిస్క్’ అలర్ట్..
సీఈఓ అభిప్రాయం మేరకు 2023లో గూగుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీల్లో మార్పులు తీసుకొచ్చింది. అన్ని కంపెనీలు కచ్చితంగా ఆఫీసులకే వచ్చి పనిచేయాలని చెప్తుంటే.. గూగుల్ మాత్రం హైబ్రీడ్ విధానానికే జై కొట్టింది. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్కు రావాలని కోరుతూ ఉద్యోగులకు సమాచారం అందించింది. అయినప్పటికీ కంపెనీ ఉద్యోగులు మాత్రం ఈ విషయంపై విచారం వ్యక్తంచేస్తూ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. దీంతో కార్యాలయంలో జరిపే చర్చల ప్రాముఖ్యతను గురించి గూగుల్ చీఫ్ ఉద్యోగులకు ఇ-మెయిల్స్ ద్వారా తెలియజేశారు. ఒకేచోట కలిసి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల