Google: నెట్వర్క్ లేకున్నా ఫోన్ కనిపెట్టేయొచ్చు.. ఫైండ్ మై డివైజ్ను అప్గ్రేడ్ చేసిన గూగుల్
Google: గూగుల్ తన Find My Device ఫీచర్ని అప్గ్రేడ్ చేసింది. దీంతో బ్యాటరీ అయిపోయినా, నెట్వర్క్ లేకున్నా.. మొబైల్ని సులువుగా కనిపెట్టేయొచ్చు.
Google | ఇంటర్నెట్డెస్క్: పోగొట్టుకున్న మొబైల్ను కనిపెట్టాలంటే చాలా కష్టం. పొరపాటున ఎవరైనా మన ఫోన్ దొంగిలిస్తే దానిపై ఆశలు వదలుకోవాల్సిన పరిస్థితి. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను గుర్తించేందుకు ‘ఫైండ్ మై డివైజ్’ (Find My Device) లాంటి సదుపాయం ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా, డివైజ్ ఆఫ్లైన్లో ఉన్నా గుర్తించడం కష్టం. ఇలాంటి సమస్యలకు ఫుల్స్టాప్ పెడుతూ గూగుల్ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. తన Find My Device సదుపాయాన్ని అప్గ్రేడ్ చేసింది.
కొత్తగా అప్గ్రేడ్ చేసిన ఫైండ్ మై డివైజ్ ఆప్షన్లో ఫోన్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా మొబైల్ను కనిపెట్టొచ్చు. యాపిల్ సంస్థ తన ఐఫోన్ యూజర్ల కోసం చాలాకాలం కిందటే ‘ఫైండ్ మై నెట్వర్క్’ ఫీచర్ను తీసుకొచ్చింది. అదేతరహాలో ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ను గూగుల్ అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లందరూ ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చని తన బ్లాగ్లో పేర్కొంది. ఇకపై ఐఫోన్లానే ఆండ్రాయిడ్ మొబైల్ ఎక్కడున్నా ఇట్టే కనిపెట్టేయొచ్చన్నమాట.
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
ఈ అప్గ్రేడ్ చేసిన ఫీచర్ ఆండ్రాయిడ్ 9 లేదా, ఆ తర్వాత వెర్షన్ ఫోన్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. గూగుల్కు చెందిన పిక్సెల్ 8, 8 ప్రో ఫోన్లలో ఈ సదుపాయం మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఒకవేళ పిక్సెల్ ఫోన్ ఆఫ్లో ఉన్నా, బ్యాటరీ పూర్తిగా అయిపోయినా సరే ఈ ఫోన్లలో ఉండే హార్డ్వేర్ సాయంతో సులువుగా కనిపెట్టొచ్చని గూగుల్ చెబుతోంది. కేవలం స్మార్ట్ఫోన్లే కాదు.. స్మార్ట్వాచ్లు, ఇయర్ బడ్స్ను కూడా ఆఫ్లైన్లో ఉంటే కనిపెట్టేయొచ్చట. వాస్తవానికి ఈ ఫీచర్ని గతేడాదే తీసుకురావాలని సంస్థ భావించింది. ఎక్కడ ఈ ఫీచర్ను దుర్వినియోగం చేస్తారో అన్న ఉద్దేశంతో కాస్త ఆలస్యంగా అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు గూగుల్ ఈ ఏడాది మేలో తీసుకురానున్న పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫొటోలు బయటకొచ్చాయి. ఈ మొబైల్ టెన్సర్ జీ3 ప్రాసెసర్తో రానున్నట్లు తెలుస్తోంది. వెనకవైపు రెండు కెమెరాలు, 6.1 అంగుళాల డిస్ప్లే, 90Hz రీఫ్రెష్ రేటు, 5,000mAh బ్యాటరీతో రావొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?