Google: నెట్వర్క్ లేకున్నా ఫోన్ కనిపెట్టేయొచ్చు.. ఫైండ్ మై డివైజ్ను అప్గ్రేడ్ చేసిన గూగుల్
Google: గూగుల్ తన Find My Device ఫీచర్ని అప్గ్రేడ్ చేసింది. దీంతో బ్యాటరీ అయిపోయినా, నెట్వర్క్ లేకున్నా.. మొబైల్ని సులువుగా కనిపెట్టేయొచ్చు.
Google | ఇంటర్నెట్డెస్క్: పోగొట్టుకున్న మొబైల్ను కనిపెట్టాలంటే చాలా కష్టం. పొరపాటున ఎవరైనా మన ఫోన్ దొంగిలిస్తే దానిపై ఆశలు వదలుకోవాల్సిన పరిస్థితి. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ను గుర్తించేందుకు ‘ఫైండ్ మై డివైజ్’ (Find My Device) లాంటి సదుపాయం ఉన్నప్పటికీ.. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా, డివైజ్ ఆఫ్లైన్లో ఉన్నా గుర్తించడం కష్టం. ఇలాంటి సమస్యలకు ఫుల్స్టాప్ పెడుతూ గూగుల్ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. తన Find My Device సదుపాయాన్ని అప్గ్రేడ్ చేసింది.
కొత్తగా అప్గ్రేడ్ చేసిన ఫైండ్ మై డివైజ్ ఆప్షన్లో ఫోన్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా మొబైల్ను కనిపెట్టొచ్చు. యాపిల్ సంస్థ తన ఐఫోన్ యూజర్ల కోసం చాలాకాలం కిందటే ‘ఫైండ్ మై నెట్వర్క్’ ఫీచర్ను తీసుకొచ్చింది. అదేతరహాలో ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ను గూగుల్ అప్గ్రేడ్ చేసింది. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లందరూ ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చని తన బ్లాగ్లో పేర్కొంది. ఇకపై ఐఫోన్లానే ఆండ్రాయిడ్ మొబైల్ ఎక్కడున్నా ఇట్టే కనిపెట్టేయొచ్చన్నమాట.
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
ఈ అప్గ్రేడ్ చేసిన ఫీచర్ ఆండ్రాయిడ్ 9 లేదా, ఆ తర్వాత వెర్షన్ ఫోన్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. గూగుల్కు చెందిన పిక్సెల్ 8, 8 ప్రో ఫోన్లలో ఈ సదుపాయం మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఒకవేళ పిక్సెల్ ఫోన్ ఆఫ్లో ఉన్నా, బ్యాటరీ పూర్తిగా అయిపోయినా సరే ఈ ఫోన్లలో ఉండే హార్డ్వేర్ సాయంతో సులువుగా కనిపెట్టొచ్చని గూగుల్ చెబుతోంది. కేవలం స్మార్ట్ఫోన్లే కాదు.. స్మార్ట్వాచ్లు, ఇయర్ బడ్స్ను కూడా ఆఫ్లైన్లో ఉంటే కనిపెట్టేయొచ్చట. వాస్తవానికి ఈ ఫీచర్ని గతేడాదే తీసుకురావాలని సంస్థ భావించింది. ఎక్కడ ఈ ఫీచర్ను దుర్వినియోగం చేస్తారో అన్న ఉద్దేశంతో కాస్త ఆలస్యంగా అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు గూగుల్ ఈ ఏడాది మేలో తీసుకురానున్న పిక్సెల్ 8ఏ (Google Pixel 8a) ఫొటోలు బయటకొచ్చాయి. ఈ మొబైల్ టెన్సర్ జీ3 ప్రాసెసర్తో రానున్నట్లు తెలుస్తోంది. వెనకవైపు రెండు కెమెరాలు, 6.1 అంగుళాల డిస్ప్లే, 90Hz రీఫ్రెష్ రేటు, 5,000mAh బ్యాటరీతో రావొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్లో ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్ ఉండనుంది. -
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ రిస్క్ తీసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. జెఫ్ బెజోస్ నుంచి నేర్చుకున్న విలువైన పాఠం గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో పంచుకున్నారు. -
WAISLలో వాటాను కొనుగోలు చేయనున్న జీఎంఆర్
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రా WAISLలో 8.40 శాతం వాటాను రూ.56.66 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. -
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
టెస్లాలో పని చేస్తున్న ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఎలాన్ మస్క్ ఉద్వాసన పలికారు. టెస్లా కార్ల విక్రయాలు క్షీణించిన నేపథ్యంలో వీరిపై వేటు వేసినట్లు తెలిసింది. -
చివరి అరగంటలో అమ్మేశారు.. సూచీలకు నష్టాలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 188 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. -
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
Gold: మార్చిలో బంగారం ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జనవరి-మార్చి త్రైమాసికంలో గిరాకీ ఎనిమిది శాతం పుంజుకుంది. -
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
విప్రో కొత్త సీఈఓగా ఇటీవల నియమితులైన శ్రీనివాస్ పల్లియా వేతనం వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. -
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
Wearable AC: మెడపై ధరించి ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగలిగేలా సోనీ ఓ కొత్త ఏసీ డివైజ్ను తీసుకొచ్చింది. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
Elon Musk: టెస్లా షేర్ల ర్యాలీతో బిలియనీర్ ఎలాన్ మస్క్ సంపద ఇటీవల గణనీయంగా పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఆయన షేర్ల విలువ 18.5 బిలియన్ డాలర్లు ఎగసింది. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,668
Stock Market Opening bell: ఉదయం 9:18 గంటల సమయంలో సెన్సెక్స్ 114 పాయింట్ల లాభంతో 74,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 22,668 దగ్గర కొనసాగుతోంది. -
పతంజలి దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్స్ రద్దు
Patanjali: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పది ఉత్పత్తుల తయారీ లైసెన్స్ను రద్దు చేసింది. -
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి