Smartphones: ఐఫోన్14, పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్.. లేటెస్ట్ ధరలివే..!
వేసవి ప్రత్యేక సేల్లో భాగంగా పలు స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గాయి. ఐఫోన్ 14, పిక్సెల్ 7 సిరీస్ ఫోన్ల ధరలు దిగొచ్చాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ సహా ఆయా వేదికలపై ఉండే ప్రత్యేక ఆఫర్లలో భాగంగా ధరలు తగ్గాయి.
ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని రోజుల్లో ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) ప్రారంభం కానుంది. ఈ తరుణంలో గూగుల్ తమ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో ధరల్ని తగ్గించింది. సేల్ ప్రారంభమైన తర్వాత పిక్సెల్ 7 సిరీస్ (Pixel 7 series) ఫోన్లపై మరిన్ని డిస్కౌంట్లు జత కానున్నాయి. గత ఏడాది అక్టోబర్లో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో గూగుల్కు మాత్రమే ప్రత్యేకమైన టెన్సర్ జీ2 ప్రాసెసర్ ఉంటుంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తాయి. వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది.
ధరల్ని తగ్గించిన తర్వాత గూగుల్ పిక్సెల్ 7 ధర ప్రస్తుతం రూ.49,999గా ఉంది. అదే పిక్సెల్ 7 ప్రో ధరను రూ.69,999గా నిర్ణయించారు. గత ఏడాది ఈ ఫోన్లు వరుసగా రూ.59,999, రూ.84,999 ధర వద్ద మార్కెట్లోకి వచ్చాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ (Flipkart Big Saving Days Sale)లో ఇవ్వనున్న ఆఫర్లను బట్టి చూస్తే వీటి ధరలు మరో రూ.5,000 వరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ తగ్గింపు ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ కార్డులతో కొనుగోళ్ల రూపంలో ఉండే అవకాశం ఉంది.
తగ్గిన ఐఫోన్ 14 ధర..
యాపిల్ మరికొన్ని రోజుల్లో ఐఫోన్15ను ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ధరలు (iPhone 14 Price) కొంత వరకు దిగొచ్చాయి. ముఖ్యంగా థర్డ్ పార్టీ వేదికలపై కొనుగోలు చేసేవారికి ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి వాటిలో ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నాయి. అధికారికంగా ఐఫోన్14 (iPhone 14 Price) బేస్ మోడల్ ధర రూ.79,900. కానీ, క్రెడిట్ కార్డులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఆయా సైట్లలో ఉన్న ప్రత్యేక తగ్గింపులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ధర రూ.66 వేల వరకు దిగొచ్చినట్లు స్పష్టమవుతోంది. ఉదాహరణకు ఫ్లిప్కార్ట్లో పైన తెలిపిన మోడల్ ప్రారంభ ధర రూ.69,999గా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు ఫ్లాట్ రూ.4,000 తగ్గింపు లభిస్తోంది. ఈ లెక్కన ఐఫోన్14 బేస్ మోడల్ ధర రూ.65,999కి చేరింది. ఇలాగే అమెజాన్, క్రోమా, విజయ్ సేల్స్ సహా ఇతర వేదికల్లోనూ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
మే 11న పిక్సెల్ 7ఏ..
మరోవైపు గూగుల్ తమ కొత్త పిక్సెల్ 7ఏ (Pixel 7a) ఫోన్ను భారత్లో విడుదల చేయనుంది. మే 11న దేశీయ విపణిలోకి దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇటీవల ఈ ఫోన్ ధర, రంగులు సహా పలు స్పెసిఫికేషన్లపై ఆన్లైన్లో అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఫ్లిప్కార్ట్లో మే 11 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం! -
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ P సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
రియల్మీ సంస్థ పి సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
జీ-మెయిల్లో లార్జ్ ఫైల్స్ను సెండ్ చేయడం ఎలా?
Tech Tip- Gmail: నిత్యం వినియోగించే జీ- మెయిల్లో కూడా లార్జ్ డేటా ఫైల్స్ను ఎలా సెండ్ చేయొచ్చు. -
108 ఎంపీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్లు
Infinix Note 40 Pro series: వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ రెండు కొత్త మొబైల్స్ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో ఈ ఐకాన్ మీకూ కనిపించిందా? ఆ కొత్త ఫీచర్ ఇదే..!
వాట్సప్ మరో కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. త్వరలోనే వాట్సప్కు ఏఐ ఫీచర్లను జోడించనుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియరాలేదు. -
గూగుల్ ఫొటోస్ గుడ్న్యూస్.. పిక్సెల్ ఫోన్లలోని ఈ టూల్స్ ఇకపై అందరికీ!
Google Photos: తమ యూజర్లందరికీ ఏఐ టూల్స్ను అందించనున్నట్లు గూగుల్ ఫొటోస్ ప్రకటించింది. ఇప్పటి వరకు పిక్సెల్ 8, 8ప్రో స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. -
ట్రూకాలర్లో వెబ్ వెర్షన్.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు
ట్రూకాలర్ కొత్త సదుపాయం తీసుకొచ్చింది. వెబ్ వెర్షన్ను లాంచ్ చేసింది. తద్వారా కొత్త నంబర్లను వెబ్లోనూ వెతకొచ్చు. -
సరైన ఎయిర్ కూలర్ ఎంపిక ఎలా?.. కొనే ముందు ఇవి తెలుసుకోండి
ఈ వేసవిలో కూలర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కొనే ముందు ఏమేం చూడాలి? -
బోట్ యూజర్లకు షాక్.. రిస్క్లో 75 లక్షల మంది డేటా
బోట్ వేరియబుల్ బ్రాండ్కు సంబంధించిన యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. 75 లక్షల మంది డేటా లీకైనట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. -
45W ఫాస్ట్ ఛార్జింగ్ శాంసంగ్ ఎం55.. ₹12 వేలకే ఎం 15
Samsung Galaxy M55: శాంసంగ్ కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఎం సిరీస్లో 55 5జీ, 15 5జీ ఫోన్లను తీసుకొచ్చింది. అమెజాన్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం