Budget: ‘సరసమైన ఇళ్ల’ నిర్వచనంలో మార్పునకు క్రెడాయ్ విజ్ఞప్తి
Budget: 2017లో నిర్ణయించిన ‘సరసమైన ఇళ్ల’ నిర్వచనాన్ని మార్చుతూ బడ్జెట్లో ప్రకటన ఉండాలని కేంద్రాన్ని క్రెడాయ్ కోరింది.
దిల్లీ: రెసిడెన్షియల్ ప్రాపర్టీల డిమాండ్ను పెంచడానికి గృహ రుణాలపై చెల్లించే వడ్డీతో పాటు అసలు మొత్తంపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని ‘భారత స్థిరాస్తి సంఘాల సమాఖ్య’ (CREDAI) ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ‘సరసమైన ఇళ్ల’ నిర్వచనాన్ని సైతం సవరించాలని బడ్జెట్ (Union Budget 2024) అంచనాల్లో భాగంగా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం సెక్షన్ 80సీ కింద గృహ రుణాల అసలు మొత్తం చెల్లింపులో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని మరింత విస్తరిస్తూ బడ్జెట్లో (Union Budget 2024) ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని క్రెడాయ్ కోరింది. లేదా అసలు మొత్తం కింద చేసే చెల్లింపులకు సెక్షన్ 80సీకి వెలుపల ప్రత్యేక మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేసింది.
రూ.45 లక్షలకు పరిమితమైన ‘సరసమైన ఇళ్ల’ (Affordable Housing) నిర్వచనాన్ని సవరించాలని క్రెడాయ్ డిమాండ్ చేసింది. ఈ పరిమితిని 2017లో నిర్ణయించారని గుర్తుచేసింది. అప్పటితో పోలిస్తే ద్రవ్యోల్బణం, స్థిరాస్తి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. ‘నేషనల్ హౌసింగ్ బ్యాంక్’ గణాంకాల ప్రకారం.. 2018 నుంచి స్థిరాస్తి ధరలు 24 శాతం పెరిగాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.45 లక్షల బడ్జెట్లో ఇళ్లు నిర్మించడం డెవలపర్లకు సాధ్యం కావడం లేదని వివరించింది. సరసమైన ఇళ్ల నిర్వచనానికి ధరలను కాకుండా విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని క్రెడాయ్ సూచించింది. మెట్రో ప్రాంతాల్లో 90 చదరపు మీటర్లు.. మెట్రోయేతర ప్రాంతాల్లో 120 చదరపు మీటర్లలో నిర్మించే వాటిని ఈ కేటగిరీలోకి తీసుకురావాలని సిఫార్సు చేసింది.
ఎన్పీఎస్ మరింత ఆకర్షణీయంగా.. బడ్జెట్లో ప్రకటన?
ప్రస్తుతం గృహ రుణాలపై చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. దీన్ని రూ.5 లక్షల వరకు పెంచాలని క్రెడాయ్ (CREDAI) కోరింది. దేశ జీడీపీకి గణనీయ వాటా సమకూరుస్తూ స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపింది. మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి కల్పనకూ తోడ్పాటునందిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం దన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..