Telecom: ప్రపంచంలో చౌకైన టెలికాం సేవలు భారత్లోనే ఉండాలి: అశ్వినీ వైష్ణవ్
Telecom: ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత చౌకైన టెలికాం సేవలు భారత్లోనే ఉన్నాయని.. ఇక ముందూ ఇవి కొనసాగాలని ప్రభుత్వం కోరుకుంటోందని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
దిల్లీ: భారత టెలికాం సేవలు (Telecom services) ప్రపంచంలోనే అత్యంత చౌకైనవిగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా అత్యంత అందుబాటు ధరలో ఉన్న టెలికాం రంగం ప్రస్తుతం భారత్దేనని వెల్లడించారు.
టెలికాం నిపుణుల ప్రకారం.. ‘ఒక్కో యూజర్పై సగటు ఆదాయం (ARPU)’ రూ.270- 300గా ఉండాలి. అలా అయితేనే 5జీ నెట్వర్క్ అమలుపై చేసిన వ్యయం వచ్చే మూడేళ్లలో తిరిగి వస్తుంది. ప్రస్తుతం ఆర్పూ రూ.140-200గా ఉంది. చైనాలో ఇది రూ.580గా నమోదైంది. ప్రపంచ సగటు ఆర్పూ రూ.600- 850. గత ఏడాది అమల్లోకి వచ్చిన 5జీ సేవల నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఎలాంటి ఆదాయం రావడం లేదని ‘సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ఇటీవల తెలిపింది. మరోవైపు తమ నెట్వర్క్కు భారీ ఎత్తున ట్రాఫిక్ తీసుకొస్తున్న యాప్లు.. వారి ఆదాయంలో కొంత భాగాన్ని తమకు చెల్లించాలని టెలికాం ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. భారత్లో ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ రెండు కంపెనీలు కలిసి 5జీ నెట్వర్క్పై రూ.3 లక్షల కోట్లు వెచ్చించాయని అంచనా. ఈ రెండు కంపెనీలూ ఇప్పటి వరకు 5జీ సేవల కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడం లేదు.
బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ విస్తరణ దీపావళి తర్వాత ఊపందుకుంటుందని వైష్ణవ్ తెలిపారు. తర్వాత దీన్ని 5జీ నెట్వర్క్కు అప్గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు. 6జీపై తమ రోడ్మ్యాప్ను వెల్లడిస్తూ.. ప్రధాని మోదీ ఇప్పటికే ఈ విషయంలో నాయకత్వం వహించాలని భారత టెలికాం సంస్థలకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించారు. మన దేశ 6జీ విజన్ను ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ ఆమోదించినట్లు తెలిపారు. ఈ కొత్త సాంకేతికతపై పనిచేయడం కోసం టెలికాం, విద్య, ప్రభుత్వ, పరిశోధన విభాగాలతో కూడిన కూటమి కూడా ఏర్పాటైనట్లు వెల్లడించారు. యాంటెనా గ్రూప్, వేవ్ఫారం గ్రూప్, ఎక్విప్మెంట్ గ్రూప్లు 6జీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
యూజర్ల రక్షణపై దృష్టి సారిస్తూ టెలికాం రంగంలో రెండో దశ సంస్కరణలు ప్రారంభమయ్యాయని వైష్ణవ్ తెలిపారు. ఆ క్రమంలో వచ్చిందే సంచార్ సాథి అని వివరించారు. క్రమంగా మరిన్ని మార్పులూ రాబోతున్నట్లు తెలిపారు. 2021లో వచ్చిన తొలి దశ సంస్కరణల్లో భాగంగా టెలికాం కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి