Smartphone trick: గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ఫోన్ లేనిదే రోజు గడవని పరిస్థితి. కేవలం ఫోన్ నంబర్లే కాదు.. మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారమూ అందులోనే ఉంటోంది. మన అశ్రద్ధ వల్ల స్మార్ట్ఫోన్ పోతే.. దానికి ఎవర్నీ నిందించక్కర్లేదు. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మన స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. బాధపడాల్సి వస్తుంది. పైగా వందల మంది గుమిగూడినచోట అలాంటిదేమైనా జరిగితే ఇక వాటిపై ఆశలు వదులుకోవాల్సిందే. అంతమంది గుమిగూడిన చోట కూడా కొట్టేసిన ఫోన్లను సింపుల్ ట్రిక్తో కనిపెట్టి రెండు ఫోన్లను పొందగలిగాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. ఇంతకీ ఏం జరిగింది? అంతమందిలో ఉన్నా తన ఫోన్లను ఎలా కనిపెట్టగలిగాడు?
టెక్ ఇన్ఫ్లూయెన్సర్లలో ఒకరైన షారుక్.. గతేడాది రంజాన్ సందర్భంగా జరిగిన ఘటనను తాజాగా పంచుకున్నాడు. తన భార్యతో దిల్లీలోని జామా మసీదుకు ఇఫ్తార్ విందుకు వెళ్లినప్పుడు జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు. రెండు ఫోన్లు ఎలా పోగొట్టుకున్నదీ.. వాటిని ఎలా తిరిగి పొందిందీ తెలిపాడు. వరుస ట్వీట్లలో దాన్ని వివరించాడు.
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
‘‘2023 ఏప్రిల్ 15న దిల్లీలోని రంజాన్ నెల సందర్భంగా జామా మసీదుకు నేనూ, నా భార్య ఇఫ్తార్ విందుకు వెళ్లాం. చుట్టూ ఇసుకేస్తే రాలనంత జనం. మా దగ్గర మూడు ఫోన్లు ఉన్నాయి. ఐఫోన్ 13, షావోమి సివి2, రెడ్మీ కే50 అల్ట్రా. మూడు ఫోన్లనూ బ్యాగ్లో ఓ జిప్లో పెట్టాం. కాసేపటి తర్వాత చూస్తే బ్యాగు తెరిచి ఉంది. అందులో ఐఫోన్, షావోమి ఫోన్లు మాయమయ్యాయి. చూసిన వెంటనే ‘దొంగా.. దొంగా. నా ఫోన్లు ఎవరో కొట్టేశారు’ అంటూ గట్టిగా అరిచా. అయినా ఫలితం లేకపోయింది. అక్కడే ఉన్న అధికారులకు వెంటనే సమాచారం చేరవేశా. నాకు సాయం చేయకపోగా.. ‘మీలాంటి వాళ్ల కోసమే మైక్లో చెప్తుంటాం. మమ్మల్ని పట్టించుకుంటేగా’ అంటూ మాపైనే తిరిగి అరిచారు.
ఏం చేశానంటే?
- తొలుత ఐఫోన్కు కాల్ చేశా. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తర్వాత ఇంకో ఫోన్కు కాల్ చేశా. ఆ ఫోన్ ఆన్లోనే ఉంది. ఆ ఫోన్ను ఆపలేకపోయారు. షట్డౌన్ కన్ఫర్మేషన్ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవడమే దానికి కారణం. ఈ ఫీచర్ ఆన్లో ఉన్నప్పుడు స్విచ్చాఫ్ చేయాలంటే పాస్వర్డ్ ఇవ్వాల్సిందే. దీంతో ఆ ఫోన్ను అలానే ఉంచేశారు.
- వెంటనే నా దగ్గర ఉన్న వేరే మొబైల్లో ‘ఫైండ్ మై డివైజ్ ’ ఫీచర్ ఓపెన్ చేశాను. అందులో చూస్తే... మొబైల్ లొకేషన్ అదే మసీదు ప్రాంగణంలో చూపించింది. ఫైండ్ మై డివైజ్లో మిస్ అయిన మొబైల్ సెలక్ట్ చేసుకొని.. ట్యాప్ సౌండ్ క్లిక్ చేశా. దీంతో ఆ ఫోన్ మోగడం మొదలైంది. ఆ సౌండ్ను సైలెంట్ చేయాలన్నా అవతలి వారికి కుదరదు.
- ఆ ఫోన్ నుంచి శబ్దం గట్టిగా వస్తూనే ఉండటంతో... వెంటనే ఆఫోన్కి కాల్ చేశా. అప్పటివరకు ఫోన్ ఎత్తని వ్యక్తి.. తర్వాత చేసేది లేక కాల్ ఎత్తి.. మసీదు గేట్ నంబర్ 2 దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకోవాలని చెప్పాడు. నేను వెళ్లగానే రెండు ఫోన్లూ నా చేతికిచ్చాడు.
‘కిందపడిపోతే తీసుకున్నా’ అని చెప్పాడు. నా ఫోన్లు నాకు దొరికేసరికి నేనూ ఏం మాట్లాడలేదు. కాస్త ఓపిగ్గా ఆలోచించడం మూలంగానే నా ఫోన్లు నాకు దొరికాయి. అదే ఆ దొంగ కాస్త తెలివైనవాడు అయితే నా ఫోన్లు అంతే!’’ అంటూ పోస్ట్ పెట్టాడు. ‘బాగా చెప్పావ్ బ్రో’ అంటూ ఒకరు.. ‘ఈ ట్రిక్ రివీల్ చేసి లేనిపోని ఐడియాలు ఇవ్వకు బ్రో’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
‘ఫ్లైఓవర్’ కష్టాలకు చెక్.. గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్లు
Google Maps: ఫ్లైఓవర్ కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ మ్యాప్స్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వాట్సప్లో ఏఐ ఫీచర్.. మిమ్మల్ని మీరు ఊహించుకోండి!
Whatsapp AI feature: వాట్సప్లో కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ను మీకు నచ్చినట్లుగా జనరేట్ చేసుకోవచ్చు. -
యూట్యూబ్లో అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు
YouTube down: ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్
Amazon prime day sale: జులై 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఇందులో పలు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తున్నారు. -
విండోస్లో ‘బ్లూ స్క్రీన్’ ఎర్రర్.. కారణమిదే!
Microsoft outage: క్రౌడ్ స్ట్రయిక్ అప్డేట్ కారణంగానే విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తేలింది. -
ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం.. విమాన సర్వీసులపైనా ఎఫెక్ట్
Microsoft outage: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమయ్యింది. -
అపరిమిత 5జీ కోసం ఎయిర్టెల్లో డేటా బూస్టర్ ప్యాక్లు
Airtel: టారిఫ్ల పెంపు తర్వాత ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ ప్రయోజనాన్ని తొలగించింది. అలాంటి వారికోసం కొత్తగా డేటా బూస్టర్ ప్యాక్లు తీసుకొచ్చింది. -
టెలికాం ఛార్జీల ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్కు పెరుగుతున్న సబ్స్క్రైబర్లు
BSNL: టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు బీఎస్ఎన్ఎల్వైపు చూస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. -
50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్ సపోర్ట్తో హానర్లో 2 కొత్త ఫోన్లు
Honor 200 Series: హానర్లో మరో రెండు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. వీటిలో 50 ఎంపీ కెమెరా సెటప్, 5,200mAh బ్యాటరీ సహా మరిన్ని ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. విడుదల సందర్భంగా డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. -
గూగుల్ జెమినీలో కొత్త సదుపాయం.. లాక్స్క్రీన్లోనూ ఇక సమాధానం
Gemini on Lock screen: గూగుల్ జెమినీని ఇకపై లాక్ స్క్రీన్పై కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ను మాన్యువల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. -
బిగ్ బ్యాటరీతో శాంసంగ్ M35 5జీ.. సేల్, ఆఫర్లు ఇవే..!
Samsung Galaxy M35 5G: శాంసంగ్ సంస్థ కొత్తగా ఎం35 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ₹1,999కే ఫైర్ టీవీ స్టిక్.. ₹2,499తో ఎకో పాప్
Amazon Prime Day Sale: ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ తమ బ్రాండ్తో వస్తోన్న ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపునిస్తోంది. -
100W ఫాస్ట్ ఛార్జింగ్తో వన్ప్లస్ నార్డ్ 4.. ట్యాబ్, వాచ్, బడ్స్ వివరాలు ఇవే..
OnePlus Nord 4: వన్ప్లస్ సంస్థ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్లో నార్డ్ 4ను తీసుకొచ్చింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. -
రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ
iQOO Z9 Lite: ఐకూ జెడ్9 లైట్ ఫోన్ భారత్లో విడుదలైంది. రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొద్ది 5జీ ఫోన్లలో ఇదొకటి. -
ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు.. అవేంటి? ప్రయోజనాలెలా ఉన్నాయ్?
Reliance Jio: టారిఫ్ల పెంపు తర్వాత రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో అనేక మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ టెలికాం ప్రొవైడర్ కేవలం రెండు వార్షిక ప్లాన్లను మాత్రమే విక్రయిస్తోంది. అవేంటి? అందులో ప్రయోజనాలెలా ఉన్నాయో చూద్దాం.. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఆడియో వినే పని లేకుండానే!
Whatsapp new feature: వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆడియో సందేశాలకు అక్షర రూపం ఇవ్వనుంది. బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. -
ఒప్పో రెనో 12 సిరీస్.. 50MP కెమెరా, ఏఐ టూల్స్, 5,000mAh బ్యాటరీ
Oppo Reno 12 series: ఒప్పో రెనో సిరీస్లో మరో రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. 50MP కెమెరా సహా ఏఐ టూల్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
స్కామ్ అలర్ట్: ఇండియా పోస్ట్ పేరుతో లింకులు.. క్లిక్ చేస్తే అంతే!
India post scam: తపాలా శాఖ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసానికి తెర తీశారు. మోసపూరిత లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సేవలు
Flipkart : ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్ సొల్యూషన్ల సంస్థ బిల్డెస్క్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!