e-Sanjeevani App: ప్రధాని మెచ్చిన ఈ-సంజీవని యాప్.. ఎలా పనిచేస్తుంది?
కరోనా (Covid-19) సమయంలో దూర ప్రాంతాలవారు, ప్రయాణ సౌకర్యంలేని ప్రాంతాల్లో నివసించేవారు అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ల నుంచి వైద్య సలహాలను పొందేందుకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health) ఈ-సంజీవని యాప్ను పరిచయం చేసింది.
దిల్లీ: భారత్ డిజిటల్ విప్లవ సామర్థ్యాన్ని ఈ - సంజీవని (e-Sanjeevani) యాప్ ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Naredra Modi) అన్నారు. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 10 కోట్ల మందికిపైగా భారతీయులు లబ్ధి పొందారని తెలిపారు. ఆదివారం 98వ ఎడిషన్ మన్కీ బాత్ (Mann Ki Baat)లో మాట్లాడుతూ ప్రధాని ఈ యాప్ గురించి ప్రస్తావించారు. ఇంతకీ ఈ-సంజీవని యాప్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఈ యాప్ ద్వారా దేశ ప్రజలు ఎలాంటి సేవలను పొందవచ్చనేది చూద్దాం.
కరోనా (Covid-19) సమయంలో దూర ప్రాంతాలవారు, ప్రయాణ సౌకర్యంలేని ప్రాంతాల్లో నివసించేవారు అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ల నుంచి వైద్య సలహాలను పొందేందుకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health) ఈ యాప్ను పరిచయం చేసింది. వెబ్ పోర్టల్, యాప్ వెర్షన్లలో ఈ-సంజీవని అందుబాటులో ఉంది.
ఈ యాప్ ద్వారా డాక్టర్-టు-డాక్టర్, పేషంట్-టు-డాక్టర్ ఒకరితో ఒకరు అనుసంధానం కావొచ్చు. జాతీయ టెలీమెడిసిన్ సర్వీస్ ఆఫ్ ఇండియా(National Telemedicine Service of India)గా పేరుగాంచిన ఈ యాప్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే అతి పెద్ద టెలీమెడిసన్ వ్యవస్థని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
- యూజర్లు ఈ యాప్ను ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ (PlayStore), యాపిల్ యాప్ స్టోర్ (App Store) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత పేషెంట్ రిజిస్ట్రేషన్/జనరేట్ టోకెన్ (Patient Registration/Generate Token), పేషెంట్ లాగిన్ (Patient Login), పేషెంట్ ప్రొఫైల్ (Patient Profile) అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
- వాటిలో పేషెంట్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి యూజర్ తన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు, కొవిడ్ కేంద్రాలకు సంబంధించిన ఓపీడీ సమయాల పూర్తి సమాచారం ఉంటుంది.
- అందులో యూజర్ సంప్రదించాలనుకుంటున్న స్పెషలిస్ట్ డాక్టర్ (అంటే జనరల్ మెడిసన్/కార్డియో/ఈఎన్టీ/న్యూరాలజీ వంటి వాటితోపాటు ఇతర విభాగాలు)ను ఎంపిక చేసుకోవాలి.
- తర్వాత ఓటీపీతో మొబైల్ నంబర్ను వెరిఫై చేస్తే యూజర్కు సంబంధించి టోకెన్ జనరేట్ అవుతుంది. దాంతో లాగిన్ చేసి యూజర్ పేరు, ఇతర వివరాలతోపాటు మెడికల్ రిపోర్ట్లు వంటి ఏవైనా ఉంటే వాటిని అప్లోడ్ చేయొచ్చు.
- వివరాలు నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే పేషెంట్ ఐడీతో డాక్టర్తో అపాయింట్మెంట్ టైమ్ను ఎస్సెమ్మెస్ ద్వారా తెలియజేస్తుంది. అందులో సూచించిన సమయానికి ఆన్లైన్లో కాల్ నౌ (Call Now) బటన్పై క్లిక్ చేసి డాక్టర్ను సంప్రదించి వైద్య సలహాలు పొందవచ్చు. డాక్టర్ లైవ్ సెషన్ ముగిసిన తర్వాత ఈ-ప్రిస్క్రిప్షన్ (ePrescription) ద్వారా అవసరమై మందులు కొనుగోలు చేయొచ్చు.
- పేషెంట్ లాగిన్ (Patient Login)/ పేషేంట్ ప్రొఫైల్(Patient Profile) సెక్షన్లలో పేషెంట్ ఐడీ, టోకెన్ నంబర్ ఎంటర్ చేయమని సూచిస్తుంది. అవి ఎంటర్ చేసి పేషెంట్ అందిన వైద్యానికి సంబంధించిన వివరాలను చూడొచ్చు.
కొన్నిరాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని విభాగాల సేవలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉన్నట్లు చూపిస్తుంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ-సంజీవని కొవిడ్ కేంద్రాలు, ఈఎస్ఐ ఆస్పత్రుల వివరాలను మాత్రమే చూపిస్తుంది. వాటిలో కొన్ని ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు చూపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
‘ఫ్లైఓవర్’ కష్టాలకు చెక్.. గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్లు
Google Maps: ఫ్లైఓవర్ కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ మ్యాప్స్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వాట్సప్లో ఏఐ ఫీచర్.. మిమ్మల్ని మీరు ఊహించుకోండి!
Whatsapp AI feature: వాట్సప్లో కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ను మీకు నచ్చినట్లుగా జనరేట్ చేసుకోవచ్చు. -
యూట్యూబ్లో అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు
YouTube down: ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్
Amazon prime day sale: జులై 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఇందులో పలు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తున్నారు. -
విండోస్లో ‘బ్లూ స్క్రీన్’ ఎర్రర్.. కారణమిదే!
Microsoft outage: క్రౌడ్ స్ట్రయిక్ అప్డేట్ కారణంగానే విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తేలింది. -
ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం.. విమాన సర్వీసులపైనా ఎఫెక్ట్
Microsoft outage: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమయ్యింది. -
అపరిమిత 5జీ కోసం ఎయిర్టెల్లో డేటా బూస్టర్ ప్యాక్లు
Airtel: టారిఫ్ల పెంపు తర్వాత ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ ప్రయోజనాన్ని తొలగించింది. అలాంటి వారికోసం కొత్తగా డేటా బూస్టర్ ప్యాక్లు తీసుకొచ్చింది. -
టెలికాం ఛార్జీల ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్కు పెరుగుతున్న సబ్స్క్రైబర్లు
BSNL: టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు బీఎస్ఎన్ఎల్వైపు చూస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. -
50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్ సపోర్ట్తో హానర్లో 2 కొత్త ఫోన్లు
Honor 200 Series: హానర్లో మరో రెండు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. వీటిలో 50 ఎంపీ కెమెరా సెటప్, 5,200mAh బ్యాటరీ సహా మరిన్ని ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. విడుదల సందర్భంగా డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. -
గూగుల్ జెమినీలో కొత్త సదుపాయం.. లాక్స్క్రీన్లోనూ ఇక సమాధానం
Gemini on Lock screen: గూగుల్ జెమినీని ఇకపై లాక్ స్క్రీన్పై కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ను మాన్యువల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. -
బిగ్ బ్యాటరీతో శాంసంగ్ M35 5జీ.. సేల్, ఆఫర్లు ఇవే..!
Samsung Galaxy M35 5G: శాంసంగ్ సంస్థ కొత్తగా ఎం35 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ₹1,999కే ఫైర్ టీవీ స్టిక్.. ₹2,499తో ఎకో పాప్
Amazon Prime Day Sale: ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ తమ బ్రాండ్తో వస్తోన్న ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపునిస్తోంది. -
100W ఫాస్ట్ ఛార్జింగ్తో వన్ప్లస్ నార్డ్ 4.. ట్యాబ్, వాచ్, బడ్స్ వివరాలు ఇవే..
OnePlus Nord 4: వన్ప్లస్ సంస్థ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్లో నార్డ్ 4ను తీసుకొచ్చింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. -
రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ
iQOO Z9 Lite: ఐకూ జెడ్9 లైట్ ఫోన్ భారత్లో విడుదలైంది. రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొద్ది 5జీ ఫోన్లలో ఇదొకటి. -
ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు.. అవేంటి? ప్రయోజనాలెలా ఉన్నాయ్?
Reliance Jio: టారిఫ్ల పెంపు తర్వాత రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో అనేక మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ టెలికాం ప్రొవైడర్ కేవలం రెండు వార్షిక ప్లాన్లను మాత్రమే విక్రయిస్తోంది. అవేంటి? అందులో ప్రయోజనాలెలా ఉన్నాయో చూద్దాం.. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఆడియో వినే పని లేకుండానే!
Whatsapp new feature: వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆడియో సందేశాలకు అక్షర రూపం ఇవ్వనుంది. బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. -
ఒప్పో రెనో 12 సిరీస్.. 50MP కెమెరా, ఏఐ టూల్స్, 5,000mAh బ్యాటరీ
Oppo Reno 12 series: ఒప్పో రెనో సిరీస్లో మరో రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. 50MP కెమెరా సహా ఏఐ టూల్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
స్కామ్ అలర్ట్: ఇండియా పోస్ట్ పేరుతో లింకులు.. క్లిక్ చేస్తే అంతే!
India post scam: తపాలా శాఖ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసానికి తెర తీశారు. మోసపూరిత లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సేవలు
Flipkart : ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్ సొల్యూషన్ల సంస్థ బిల్డెస్క్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. -
శాంసంగ్ కొత్త ఫ్లిప్, ఫోల్డ్ ఫోన్లు వచ్చేశాయ్.. ధర, ఇతర వివరాలు ఇవే..!
Samsung Unpacked event: శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఫ్లిప్, ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటితో పాటు మరికొన్ని ఉత్పత్తులను తీసుకొచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం