Budget: తాత్కాలిక బడ్జెట్పైనా ఆశలు ఇందుకే.. గత అనుభవాలివీ..!
Union budget 2024: తాత్కాలిక పద్దు అయినప్పటికీ.. గతంలో కొన్ని ప్రజాకర్షక నిర్ణయాలు వెలువడ్డాయి. ఇప్పుడూ అదే ఆనవాయితీ కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి.
Union budget 2024 | ఇంటర్నెట్ డెస్క్: సార్వత్రిక సమరానికి ముందు భాజపా సర్కారు తాత్కాలిక బడ్జెట్ (Union budget 2024)ను ప్రవేశపెట్టబోతోంది. మూడోసారి అధికారం చేపట్టాలన్న ఆకాంక్షల మధ్య ఈ బడ్జెట్ తీసుకొస్తోంది. ఈసారి బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండకపోవచ్చంటూ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) కొన్ని రోజుల ముందు కీలక ప్రకటన చేశారు. తాత్కాలిక బడ్జెట్ కాబట్టి పెద్దగా మార్పులేవీ ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. నిర్మలమ్మ చెప్పినట్లు తాత్కాలిక బడ్జెట్లో కొత్త పథకాలు, స్కీములు, పన్నుల్లో మార్పులు వంటివి పెద్దగా ఉండవు. ఎన్నికల అనంతరం కొలువుదీరే కొత్త ప్రభుత్వానిదే వాటి బాధ్యత. కానీ, ఈ సంప్రదాయానికి ఎప్పుడో తెరపడింది. ఎన్నికల ముందు వచ్చే తాత్కాలిక బడ్జెట్లోనూ కీలక ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ఎన్నికల ముందు ప్రజాకర్షక పథకాలు, ఓటర్లను ఆకట్టుకునే నిర్ణయాలు తీసుకోవడం 20 ఏళ్ల క్రితమే మొదలైంది. 2004 ఎన్డీయే ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి జశ్వంత్సింగ్.. తాత్కాలిక బడ్జెట్లో కీలక నిర్ణయం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకోవడానికి 50 శాతం డియర్నెస్ అలవెన్సును (DA) ఐదో వేతన సంఘం సిఫార్సుల మేరకు మూలవేతనంలో కలుపుతూ నిర్ణయం ప్రకటించారు. అంత్యోదయ అన్నయోజన లబ్ధిదారుల కుటుంబాల సంఖ్యను 1.5 కోట్ల నుంచి 2 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
బడ్జెట్లో ఇంటికి ఏ మేరకు దన్ను?
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం సైతం తాత్కాలిక బడ్జెట్లో ఇదే సంప్రదాయాన్ని కొనసాగించింది. 2009లో నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని 10 నుంచి 8 శాతానికి, సర్వీస్ ట్యాక్స్ను 12 నుంచి 10 శాతానికి తగ్గించారు. 2014లో తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన చిందంబరం.. కొన్నింటిపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్, టూవీలర్లు, కార్లు, కమర్షియల్ వాహనాలు, మొబైల్ ఫోన్లపై తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునేలా 2014 జూన్ 30 వరకే అమలయ్యేలా బడ్జెట్లో ప్రకటన చేశారు.
యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల అనంతరం భాజపా నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మళ్లీ కొలువుదీరింది. 2019లో ఎన్నికలకు ముందు పీయూష్ గోయల్ ఆర్థికమంత్రిగా తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో రైతులను ఆకట్టుకునేలా ప్రధాన్మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించారు. ఏటా రూ.6 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో వేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సూచన మేరకు చివరి నిమిషంలో చేర్చినట్లు చెబుతుంటారు. అలాగే, పన్ను ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్నవారికి పన్ను రిబేటును ఇదే బడ్జెట్లో ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ను సైతం రూ.40వేల నుంచి రూ.50 వేలకు పెంచుతూ నిర్ణ్ణయం తీసుకున్నారు.
ఇక 2024లో ఏప్రిల్- మే నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముంగిట ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో పీఎం-కిసాన్ కింద ఇచ్చే మొత్తాన్ని పెంచుతారన్న అంచనాలు ఉన్నాయి. పట్టణ ప్రజల కోసం పీఎం- ఆవాస్ యోజన తరహా పథకం, పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, విద్యుత్ వాహనాలకు రాయితీ వంటి ప్రకటనలు ఉండొచ్చని తెలుస్తోంది. గత కొన్ని బడ్జెట్లుగా మౌలిక వసతులపై దృష్టిసారించిన ప్రభుత్వం.. ఈసారి ప్రజలను ఆకట్టుకునేలా ఏవైనా ప్రకటనలు చేస్తుందేమో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు