Swiggy - Zomato: స్విగ్గీ, జొమాటోతోనే మాకు పోటీ: ఎడిల్విస్ సీఈఓ
Edelweiss CEO Radhika Gupta Zomato, Swiggy: మ్యుచువల్ ఫండ్స్ సంస్థ ఎడిల్విస్ సీఈఓ రాధికా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు స్విగ్గీ, జొమాటోతోనే పోటీ అని అన్నారు.
Swiggy - Zomato | ఇంటర్నెట్ డెస్క్: భవిష్యత్ అవసరాల కోసం ఎంతోకొంత దాచుకోవాలని ఒకప్పటి తరం యువతకు సూచించేది. ఇప్పుడంటే అనేక పెట్టుబడి సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో నెల నెలా ఎంతో కొంత మొత్తాన్ని క్రమానుగత పెట్టుబడి విధానం (SIP)లో మదుపు చేయాలని చాలా మంది చెబుతుంటారు. ప్రస్తుతం దేశంలో సుమారు 4 కోట్ల మంది ఇన్వెస్టర్లు సిప్ పద్ధతిలో వివిధ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎడిల్విస్ మ్యూచువల్ ఫండ్స్ సీఈఓ, ఎండీ రాధికా గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు స్విగ్గీ, జొమాటో, నెట్ఫ్లిక్స్తోనే పోటీ అంటున్నారు. ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థకు అధినేత అయిన ఆమె ఎందుకలా అన్నారు?
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు శంతను దేశ్పాండే ‘ది బార్బర్షాప్ విత్ శంతను’ పేరిట నిర్వహించిన పాడ్కాస్ట్లో రాధికా గుప్తా తాజాగా మాట్లాడారు. యువతకు పొదుపు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ స్విగ్గీ, జొమాటో, నెట్ఫ్లిక్స్ వంటి కంపెనీలతో పోటీ పడుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
40 ఏళ్లు అలాగే పనిచేశా.. ‘70 పనిగంటల’ను సమర్థించుకున్న నారాయణమూర్తి
‘‘ఎవరైనా నెలకు రూ.50-60 వేలు సంపాదిస్తూ ఉంటే అందులో నెలకు ఎంతో కొంత పొదుపు చేయండి. చాలా మంది తగినంత మొత్తం లేక సిప్ విధానంలో కనీసం రూ.100 కూడా పెట్టుబడి పెట్టలేకపోతున్నామని నాతో చెప్తుంటారు. కానీ నెట్ఫ్లిక్స్కు నెలకు రూ.100 కడుతుంటారు. దేశంలో ఓటీటీ ప్లాట్ఫాంలు, స్విగ్గీ, జొమాటోకు 40 కోట్ల మంది కస్టమర్లు ఉంటే.. మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీలో కేవలం 4 కోట్ల మంది మాత్రమే పెట్టుబడి పెడుతున్నారు. అందుకే స్విగ్గీ, జొమాటోతోనే మా పోటీ’’ అని రాధికా గుప్తా అన్నారు. ‘‘ఒకప్పటి తరం బతకడానికి చాలా కష్టపడే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆదాయాలు పెరిగాయి. ఇప్పటి తరానికి ఆదాయానికి కొదవ లేదు. కానీ వారిలో పొదుపు చేయాలన్న భావన కనిపించడం లేదు’’ అని రాధికా గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. తమ భవిష్యత్ కోసం యువత ఎంతో కొంత మదుపు చేసుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది. -
400 మంది ఇంజినీర్ల నియామకాలు: కోటక్ బ్యాంక్
ఈ ఏడాది దాదాపు 400 మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనిఖీల్లో వెలుగు చూసిన సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు, టెక్నాలజీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని బ్యాంక్ భావిస్తోంది. -
10 కిలోల పెంపుడు జంతువు క్యాబిన్లోనే
తమ దేశీయ విమానాల క్యాబిన్లో 10 కిలోల లోపున్న పెంపుడు జంతువులను అనుమతిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎల్అండ్టీ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.4,396.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,986.78 కోట్లతో పోలిస్తే ఇది 10.2% అధికం. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
తమ వెబ్సైట్లో వేసవి విహారం కోసం శోధించిన వాటి వివరాలను ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు