crude oil bill: క్రూడాయిల్ దిగుమతుల బిల్లు తగ్గింది, కానీ..!
దేశీయ ముడి చమురుల దిగుమతుల బిల్లు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 16 శాతం మేర తగ్గింది.
Crude oil bill | దిల్లీ: దేశీయ చమురు అవసరాల కోసం భారత్ ఇతర దేశాలపైనే అధికంగా ఆధారపడుతుంటుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దిగుమతి, వినియోగదారుగా ఉన్న భారత్.. ఖజానాలోని విదేశీ మారకాన్ని పెద్ద మొత్తంలో దీనికే వెచ్చించాల్సి వస్తోంది. తాజాగా ఈ బిల్లు దిగి వచ్చింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 16 శాతం తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం ఇందుకు కారణం. ఆ సమయంలో అంతర్జాతీయ సరఫరాలపై ఆధారపడడం మరింత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 232.5 మిలియన్ టన్నుల క్రూడాయిల్ను దిగుమతి చేసుకుందని పెట్రోలియం మంత్రిత్వశాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) డేటా చెబుతోంది. ఇలా దిగుమతి చేసుకున్న ముడి చమురునే పెట్రోల్, డీజిల్గా మార్చి దేశీయంగా వినియోగిస్తుంటారు. అంతకుముందు ఏడాది సైతం దాదాపు ఇంతే మొత్తంలో క్రూడాయిల్ను భారత్ దిగుమతి చేసుకుంది. అయితే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులకు గానూ 157.5 బిలియన్ డాలర్లు చెల్లించిన భారత్.. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం 132.4 బిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చించింది.
పీఎఫ్లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్డ్రా
అదే సమయంలో ఇతర దేశాలపై ఆధారపడడం స్వల్పంగా పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 87.4 శాతంగా ఉన్న ఈ మొత్తం.. గత ఆర్థిక సంవత్సరంలో 87.7 శాతానికి పెరిగింది. దేశీయంగా చమురు ఉత్పత్తి ఆ మేరకు తగ్గడమే ఇందుకు కారణం. ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఇతర పెట్రోలియం ఉత్పత్తులైన ఎల్పీజీ 48.1 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకోగా.. అందుకు 23.4 బిలియన్ డాలర్లను భారత్ వెచ్చించింది. 30.91 బిలియన్ క్యూబిక్ మీటర్ల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుని 13.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. నికరంగా ఆయిల్, గ్యాస్ దిగుమతుల బిల్లు ( క్రూడాయిల్+ ఎల్ఎన్జీ- ఎగుమతులు) 121.6 బిలియన్ డాలర్లుగా లెక్క తేలింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం 144.2 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశీయంగా క్రూడాయిల్ దిగుమతి తక్కువగా ఉన్నప్పటికీ.. అధిక రిఫైనరీ కెపాసిటీ కారణంగా డీజిల్ వంటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!