Elon musk: ‘ట్విటర్ బ్లూతో పైసా వసూల్..’.. మస్క్పై ఇన్ఫ్లూయెన్సర్ల ప్రశంసలు!
Twitter Ads Revenue Scheme: ట్విటర్లో యాడ్ రెవెన్యూ షేరింగ్ మోడల్పై ఇన్ఫ్లూయెన్సర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మస్క్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇన్నాళ్లు ట్విటర్లో (ప్రస్తుతం X) చేపట్టిన మార్పుల విషయంలో ఎలాన్ మస్క్పై (Elon musk) అసహనం చేయని వారు లేరు. బ్లూ టిక్ తీసుకురావడం, లోగోలో పక్షి బొమ్మను తీసివేయడం వంటి చర్యలు ఆగ్రహానికి కారణమయ్యాయి. కంపెనీలో జరిగిన పరిణామాలూ పలువురికి ఆగ్రహం తెప్పించాయి. అలాంటి ఎలాన్ మస్క్పై ఇన్ఫ్లూయెన్సర్లు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మస్క్.. నువ్వు మంచోడివి, గ్రేట్’ అంటూ తెగ పొగిడేస్తున్నారు. అయితే, కొత్తగా తీసుకొచ్చిన యాడ్ రెవెన్యూ మోడలే (Ads Revenue) ఇందుకు కారణం. యాడ్ రెవెన్యూ షేరింగ్ కింద తమకు ట్విటర్ డబ్బులు వేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబంధిత స్క్రీన్ షాట్లను ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారు.
ట్విటర్లో వెరిఫై అయిన వారికి యాడ్ రెవెన్యూ షేరింగ్ కింద ట్విటర్ డబ్బులు జమ చేస్తోంది. గత మూడు నెలలుగా నెలకు 5 మిలియన్ ఇంప్రెషన్లను పొందిన వారు రెవెన్యూ షేరింగ్కు అర్హులు. అలాగే స్ట్రైప్ పేమెంట్ అకౌంట్ కలిగి ఉండాలి. ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉండాలి. అలాంటి వారికి వారు పెట్టిన పోస్టులకు వచ్చే రిప్లయ్ల మధ్యలో వచ్చే యాడ్స్కు గానూ ట్విటర్ ఈ చెల్లింపులు చేస్తోంది. దీంతో తమకు ఇంత మొత్తం వచ్చిందంటూ ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు.
రాజస్థాన్ అందాలు వీక్షించాలనుకుంటున్నారా..?.. IRCTC ప్యాకేజీ వివరాలివే..
ట్విటర్లో గబ్బర్ సింగ్గా పేరొందిన జోరో కో-ఫౌండర్ అభిషేక్ ఆస్తానా తాజాగా తనకు ట్విటర్ నుంచి రూ.2.01 లక్షలు వచ్చినట్లు పేర్కొంటూ ట్వీట్ చేశారు. ‘బ్లూ టిక్ పైసా వసూల్’ అని పేర్కొన్నాడు. మిథున్ అనే మరో ఇన్ఫ్లూయెన్సర్ సైతం తనకు ఏకంగా మూడున్నర లక్షలు వచ్చాయంటూ తెలిపాడు. భారత్కు చెందిన వారు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారూ ఇందులో ఉన్నారు. కంటెంట్ క్రియేటర్లను పెద్ద ఎత్తున ఈ వేదికపైకి రప్పించేందుకే ట్విటర్ ప్రయత్నంలో ఇది భాగమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ‘పెద్ద ఇన్ఫ్లూయెన్సర్లకు డబ్బులు జమ చేసి మరింత మందిని ట్విటర్ బ్లూ కొనుగోలు చేసేలా ప్రేరేపిస్తోంది. వీరిని సేల్స్మన్లాగా వాడుకుంటోంది’’ అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం