IRCTC package: రాజస్థాన్ అందాలు వీక్షించాలనుకుంటున్నారా..?.. IRCTC ప్యాకేజీ వివరాలివే..
IRCTC tour package: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది. రాజస్థాన్లో ప్రసిద్ధ కట్టడాలను వీక్షించే అవకాశం ఈ ప్యాకేజీ ద్వారా కల్పిస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: రాజస్థాన్ అనగానే మనకు గుర్తొచ్చేవి.. రాచరికానికి దర్పం పట్టే కోటలు, ప్యాలెస్లు, సరస్సులు. ప్రముఖుల వివాహాలూ ఎక్కువగా ఇక్కడే జరుగుతుంటాయి. అలాంటి ప్రదేశాలను వీక్షించాలనుకునే వారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అవకాశం కల్పిస్తోంది. విమాన ప్రయాణంతో పాటు అన్ని వసతులతో ఉండే విధంగా ‘రాయల్ రాజస్థాన్’ (ROYAL RAJASTHAN) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. రాజస్థాన్ రాజధాని జైపుర్తో పాటూ ఉదయ్పుర్, జోధ్పుర్ వంటి నగరాలను సందర్శించొచ్చు. ఐదు రాత్రులు, ఆరు పగళ్లతో ఈ టూర్ ఉంటుంది. సెప్టెంబర్ 10న ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
విమాన ప్రయాణం ఇలా..
- హైదరాబాద్ నుంచి ఉదయం 11:30 గంటలకు విమానం (6E 913) బయల్దేరుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు జైపుర్ విమానాశ్రయం చేరుతారు. హోటల్లో బస ఉంటుంది. మధ్యాహ్నం భోజనం ముగించుకొని అమేర్ ఫోర్ట్ చూడటానికి వెళ్తారు. తిరిగి రాత్రి అదే హోటల్లో భోజనం, రాత్రి బస ఉంటుంది.
- రెండో రోజు ఉదయం అల్పాహారం తీసుకున్నాక జైపుర్ సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ చూడటానికి తీసుకెళ్తారు. ఆ రోజు సాయంత్రం అక్కడే షాపింగ్ చూసుకొని తిరిగి హోటల్ చేరుకోవాల్సి ఉంటుంది.
- మూడో రోజు ఉదయం జైపుర్ నుంచి పుష్కర్కు చేరుకుంటారు. అక్కడ బ్రహ్మ ఆలయాన్ని సందర్శించి మధ్యాహ్నానికి ఉదయ్పుర్కు పయనమవుతారు. ఆ రోజు రాత్రి ఉదయపుర్లో ఏర్పాటు చేసిన హోటల్లో బస ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం అల్పాహారం స్వీకరించాక సిటీ ప్యాలెస్ అందాలు వీక్షించి సహేలియోన్ కీ బరీ చూస్తారు. ఇక సాయంత్రం పిచోలా లేక్ చూడటానికి వెళ్తారు. సాయంత్రం యాత్రికుల ఇష్టం మేరకు షాపింగ్కు వెళ్లొచ్చు. ఆ రోజు రాత్రి ఉదయ్పుర్లోనే బస ఉంటుంది.
- ఐదో రోజు టిఫిన్ చేశాక జోధ్పుర్కు బయల్దేరుతారు. మధ్యాహ్నం జోధ్పుర్ చేరుకొని ఉమైద్ భవన్ ప్యాలెస్ అందాలు వీక్షిస్తారు. జోధ్పుర్లో ముందుగా ఏర్పాటు చేసిన హోటట్లోనే బస ఉంటుంది.
- ఆరో రోజు ఉదయం అల్పాహారం తీసుకున్నాక మెహ్రాన్ఘర్ కోటను సందర్శిస్తారు. సాయంత్రం 4:55 గంటలకు జోధ్పుర్ ఎయిర్పోర్ట్ చేరుకొని విమానంలో (6E 6592) హైదరాబాద్కు పయనమవుతారు. సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో మీ ప్రయాణం ముగుస్తుంది.
ఇవి ప్యాకేజీలో భాగమే
- హైదరాబాద్- జైపూర్/ జోధ్పూర్- హైదరాబాద్ విమాన టికెట్లు
- జైపుర్, ఉదయ్పుర్, జోధ్పుర్లో హోటల్ బస
- ఐదు రోజుల పాటు ఉదయం టిఫిన్, రాత్రి భోజనాలు ప్యాకేజీలో భాగమే
- పర్యాటక ప్రదేశాల వీక్షణానికి ఏసీ బస్సును ఐఆర్సీటీసీనే ఏర్పాటు చేస్తుంది.
- ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం ఉంటుంది.
- ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్ అందుబాటులో ఉంటారు.
రైల్లో లోయర్ బెర్త్ కావాలా? ఈసారి ఇలా చేయండి..
ఇవి గుర్తుంచుకోండి..
- టూర్ సమయంలో మధ్యాహ్నం భోజన బాధ్యత యాత్రికులదే.
- హైదరాబాద్ ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి తిరుగు ప్రయాణానికీ యాత్రికులే ఏర్పాట్లు చేసుకోవాలి.
- విమానంలో ఆహారానికి యాత్రికులే చెల్లించాలి.
- చూడదగిన ప్రదేశాల్లో టికెట్ల ఖర్చు ప్రయాణికులే భరించాలి.
- 75 ఏళ్లు పైబడిన వారు ప్రయాణించాలంటే కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఎస్కార్ట్గా నియమించుకోవాలి.
- వాతావరణం లేదా ఎయిర్లైన్స్ షెడ్యూళ్ల కారణంగా విమాన సమయం మారొచ్చు.
ప్యాకేజ్ ఛార్జీలు.. (ఒక్కొక్కరికీ)
- రూమ్లో సింగిల్ షేరింగ్ కావాలంటే రూ.37,750
- ట్విన్ షేరింగ్ అయితే రూ.30,450
- ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.28,900
- 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్ బెడ్ అయితే రూ.25,200. విత్ అవుట్ బెడ్ అయితే రూ.20,100 చెల్లించాలి.
- 2-4 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.17,900 చెల్లించాలి.
- ఒకవేళ ఏదైనా కారణంతో 21 రోజుల ముందు టికెట్ను క్యాన్సిల్ చేసుకుంటే టికెట్ మొత్తం ధరలో 30 శాతం మినహాయిస్తారు. అదే 21 నుంచి 15 రోజుల్లో అయితే 55 శాతం, 14 నుంచి 8 రోజుల్లో అయితే 80 శాతం డబ్బును మీ టికెట్ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.
ప్రయాణ టికెట్ బుకింగ్, ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా తన బ్యాగేజీ పాలసీని మార్చింది. కొత్త రూల్స్ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
కౌంటర్కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. UTS యాప్తో బుకింగ్ ఎలా..?
UTS app: టికెట్ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం.. -
ఆధార్ కార్డ్లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో తప్పుందా? మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్డేట్ చేసుకోవాలో చూడండి.. -
పెట్టుబడి ప్రభుత్వ బాండ్లలో
చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం. -
టెక్నాలజీ కంపెనీల్లో
బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
ఆధార్ ఏటీఎం.. ఇంటి నుంచే క్యాష్ విత్డ్రా ఎలా చేసుకోవాలి?
Aadhaar ATM: ఇంటి నుంచే డబ్బు విత్డ్రా చేసుకొనే సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందిస్తోంది. దీన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.. -
వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు
IRCTC tour package: వేసవిలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లతో ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ వివరాలను ఓసారి పరిశీలించండి. -
టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి భరోసానిచ్చేలా
బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్ పాలసీలు. వీటిని ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు. -
కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ
IRCTC tour package: వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న కేరళ టూర్ ప్యాకేజీ వివరాల్ని పరిశీలించండి.. -
తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి.. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
డిజీ లాకర్తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య