IPO: వచ్చేవారం 3 ఐపీఓలు.. రూ.1,325 కోట్ల సమీకరణ
IPO: వచ్చేవారం మెయిన్బోర్డ్ సెగ్మెంట్లో మరో మూడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. రూ.1,325 కోట్లు సమీకరించనున్నాయి.
IPO | దిల్లీ: వరుస ఐపీఓలతో (IPO) స్టాక్ మార్కెట్ వచ్చేవారమూ బిజీ బిజీగా ఉండనుంది. మొత్తం మూడు కంపెనీలు తమ తొలి పబ్లిక్ ఆఫర్లను ప్రారంభించనున్నాయి. రూ.1,325 కోట్లు సమీకరించనున్నాయి. గోపాల్ స్నాక్స్, ఆర్కే స్వామి, జేజీ కెమికల్స్ మెయిన్బోర్డు సెగ్మెంట్లో పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. వీటి తర్వాత లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ స్టాన్లీ లైఫ్స్టయిల్స్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ సైతం ఈ నెలలోనే ఐపీఓకి రానున్నాయి.
సానుకూల స్థూల ఆర్థిక అంశాలతో పాటు ఇటీవల ఐపీఓకి (IPO) వచ్చిన కంపెనీలు మంచి లాభాలను ఇవ్వడం వల్లే పబ్లిక్ ఇష్యూలు క్యూ కట్టాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 16 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.13,000 కోట్లు సమీకరించాయి. రూ.224 కోట్ల నిధులను సమకూర్చుకోవడమే లక్ష్యంగా ప్రారంభమైన ముక్కా ప్రోటీన్స్ ఇష్యూ మార్చి 4న ముగియనుంది. 2023లో 58 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చి రూ.52,637 కోట్లు సమీకరించాయి.
గోపాల్ స్నాక్స్ లిమిటెడ్ ఐపీఓ..
గోపాల్ స్నాక్స్ లిమిటెడ్ ఐపీఓ (Gopal Snacks IPO) మార్చి 6-11 మధ్య జరగనుంది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.381-401గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.650 కోట్లు సమీకరించనుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో ఎలాంటి కొత్త షేర్లను జారీ చేయడం లేదు. 1999లో రాజ్కోట్ కేంద్రంగా గోపాల్ స్నాక్స్ను స్థాపించారు. భారత్ సహా అంతర్జాతీయంగా నమ్కీన్, వెస్టర్న్ స్నాక్స్ వంటి ఉత్పత్తులను తయారుచేస్తోంది. 2023 సెప్టెంబరు నాటికి 10 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడు డిపోలు, 617 పంపిణీ కేంద్రాలున్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.1,128.86 కోట్లుగా ఉన్న కంపెనీ కార్యకలాపాల ఆదాయం 2023 నాటికి రూ.1,394.65 కోట్లకు చేరింది. లాభం రూ.21.12 కోట్ల నుంచి రూ.112.37 కోట్లకు పెరిగింది. కనీసం రూ.14,837తో 37 షేర్లు (ఒక లాట్) సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్కే స్వామి ఐపీఓ..
రూ.423.56 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తోన్న ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సర్వీసెస్ సంస్థ ఆర్కే స్వామి ఐపీఓ (RK Swamy IPO) మార్చి 4-6 మధ్య జరగనుంది. షేరు ధరల శ్రేణిని రూ.270-288 మధ్య నిర్ణయించింది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.173 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద మరో 250.56 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను అందుబాటులో ఉంచనుంది. ఈ నిధులను డిజిటల్ వీడియో కంటెంట్ ప్రొడక్షన్ స్టూడియో, కస్టమర్ ఎక్స్పీరియెన్స్ సెంటర్లు, కంప్యూటర్ ఆధారిత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కేంద్రాల ఏర్పాటుతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. ఐటీ మౌలిక వసతుల అభివృద్ధికీ కొంత డబ్బును వెచ్చించనున్నారు.
జేజీ కెమికల్స్ ఐపీఓ..
జింక్ ఆక్సైడ్ తయారీ సంస్థ జేజీ కెమికల్స్ ఐపీఓ (JG Chemicals IPO) మార్చి 5-7 మధ్య జరగనుంది. ధరల శ్రేణిని రూ.210-221గా నిర్ణయించింది. రూ.165 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా.. ఆఫర్ ఫర్ సేల్ కింద మరో రూ.86.2 కోట్లు సమకూర్చుకోనుంది. ఈ నిధుల్లో రూ.91 కోట్లను జేజీ కెమికల్స్ అనుబంధ సంస్థ బీడీజే ఆక్సైడ్స్లో ఇన్వెస్ట్ చేయనుంది. మరో రూ.35 కోట్లు దీర్ఘకాల నిర్వహణ మూలధనంగా ఉపయోగించుకోనుంది. మిగతా వాటిని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వాడుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు