HRA Fraud: అద్దె భత్యం కోసం అడ్డదారులు.. ఆ ఉద్యోగులపై ఐటీ శాఖ నజర్!
అద్దె భత్యం కోసం కొందరు అనధికారికంగా పాన్ కార్డులు వినియోగిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. వారిపై చర్యలకు ఉపక్రమించనుంది.
దిల్లీ: దేశంలో మరో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. ఇంటి అద్దె భత్యం (HRA) కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని ఆదాయపు పన్ను శాఖ (IT department) గుర్తించింది. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం పాన్ కార్డులను అనధికారికంగా ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అద్దె ఇంట్లో నివసించనప్పటికీ.. కేవలం పన్ను నుంచి తప్పించుకోవడం కోసం ఇతరుల పాన్ కార్డులను అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించింది. ఇలా సుమారు 8-10 వేల కేసులను గుర్తించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపినట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది.
హెచ్ఆర్ఏ అనేది వేతనంలో భాగంగా ఉంటుంది. అద్దె ఇంట్లో ఉంటున్నవారు రెంటల్ అగ్రిమెంట్ చూపించి పన్ను మినహాయింపు పొందొచ్చు. కొందరు వ్యక్తులు తాము అద్దెకు లేకపోయినా అద్దె చెల్లిస్తున్నట్లు పేర్కొనడం వెలుగుచూసింది. ఇందుకోసం వారు ఇతరుల పాన్ కార్డులను అనధికారికంగా వినియోగిస్తున్నట్లు తేలింది. అంటే పాన్ కార్డుదారుడికి తన పేరుమీద అద్దె అదాయం వస్తున్నట్లు కూడా తెలీదన్నమాట. కోటి రూపాయల రెంట్ రిసిప్ట్ను ఓ వ్యక్తి పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. సదరు పాన్ కార్డుదారుడిని ఆరా తీస్తే తనకూ ఎలాంటి అద్దె రావడం లేదని పేర్కొనడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.
ఆ కాల్ ఫార్వర్డింగ్లు ఆపండి.. టెలికాం ఆపరేటర్లకు డాట్ సూచన
ఆదాయపు పన్ను మినహాయింపు కోసమే కొందరు ఉద్యోగులు ఈ తరహాలో అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలిసింది. పాన్ కార్డు ఇలా దుర్వినియోగం అవుతుండడంతో ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తునకు సిద్ధమైంది. ఎవరైతే తప్పుడు ట్యాక్స్ క్లెయిమ్లు దాఖలు చేశారో వారిపై గురి పెట్టనుందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది తెలియాల్సిఉంది. నెలవారీ అద్దె రూ.50 వేలు, లేదా వార్షికంగా అయితే రూ.6 లక్షలు ఉన్నప్పుడు మాత్రమే మూలం వద్ద కోత వర్తిస్తుంది. సరిగ్గా ఇదే అదునుగా అద్దె ఆదాయంపై పన్ను కట్టకుండా కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
నిత్య జీవితంలో జరిగే ఆర్థిక లావాదేవీలన్నీ పాన్తో ముడిపడి ఉంటాయి. ఒకప్పటితో పోలిస్తే సాంకేతికత కూడా బాగా అభివృద్ధి చెందింది. పన్ను తప్పించుకోవడానికి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఐటీ శాఖ ఇట్టే పట్టేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పన్ను మాట పక్కన పెడితే.. ఒకవేళ ఆదాయపు పన్ను శాఖకు చిక్కితే భారీ జరిమానాలతోపాటు, న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులకు అద్దె ఆదాయం చెల్లించాల్సినవారు కూడా చెక్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాలని సూచిస్తున్నారు. అద్దె అందుకుంటున్న వారు కూడా ఈ మొత్తాన్ని తమ అద్దె ఆదాయంలో చూపించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ