Jio vs Airtel: ట్రాయ్కు ఎయిర్టెల్ ఫిర్యాదు.. జియో ఫైర్!
Jio slams Airtel: జియో బ్రాడ్బ్యాండ్ ద్వారా టీవీ ప్రసారాలను అందించడంపై ఎయిర్టెల్ ట్రాయ్కు ఫిర్యాదు చేసింది. దీనిపై జియో మండిపడింది. వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడానికే ఈ ఫిర్యాదు చేసిందని పేర్కొంది.
దిల్లీ: జియో ఫైబర్ (Jio Fiber) ద్వారా లైవ్ టీవీ ప్రసారాలను (Live TV) అందించడంపై ట్రాయ్కు ఎయిర్టెల్ (Airtel) చేసిన ఫిర్యాదు చేయడంపై జియో మండిపడింది. జియో ఫైబర్లో సరసమైన ధరల్లో సేవలను అందించడాన్ని ప్రత్యర్థి కంపెనీ ఓర్వలేకపోతోందని పేర్కొంది. తన సంకుచిత ప్రయోజనాల కోసం జియోపై బురద చల్లే ప్రయత్నంగా అభివర్ణించింది. భవిష్యత్లో ఎయిర్టెల్ మరోసారి ఇలాంటి ఫిర్యాదులు చేయకుండా హెచ్చరించాలంటూ ట్రాయ్ను తన లేఖలో కోరింది.
జియో టీవీలో ఐపీఎల్ ప్రసారం చేయడాన్ని ఉద్దేశించి ఎయిర్టెల్ ఈ ఫిర్యాదు చేసింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) బ్రాడ్బ్యాండ్ ప్లాన్లతో ప్రత్యక్ష టీవీ ప్రసారాలను దోపిడీ ఆఫర్లతో జియో అందిస్తోందని పేర్కొంటూ మార్చి 31న ఎయిర్టెల్ ఈ ఫిర్యాదు చేసింది. అన్ రిజిస్టర్డ్ డిజిటల్ పంపిణీ ప్లాట్ఫాల ద్వారా బ్రాడ్కాస్ట్ కంటెంట్ను అందించడం ద్వారా ప్రసారకర్తలు డౌన్లింకింగ్ విధానాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ట్రాయ్ జియో వివరణ కోరగా.. ఏప్రిల్ 6న జియో సమాధానం ఇచ్చింది. తాజాగా ఈ లేఖ బయటకొచ్చింది.
తన వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే భారతీ ఎయిర్టెల్ ఈ ఫిర్యాదు చేసిందని ట్రాయ్కు రాసిన లేఖలో జియో పేర్కొంది. జియో ఫైబర్ తక్కువ ధరకే కస్టమర్లకు సేవలు అందించడాన్ని ఎయిర్టెల్ జీర్ణించుకోలేకపోతోందని పేర్కొంది. వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకునేందుకు చేసిన ఈ ఫిర్యాదును తోసిపుచ్చాలని జియో కోరింది.
‘‘రూ.198 (పన్నులు అదనం) అద్దెపై ఫైబర్ బ్యాకప్ ప్లాన్ కింద 10 ఎంబీపీఎస్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను జియో అందిస్తోంది. ఐదు నెలల అడ్వాన్సుపై ఈ సేవలు అందిస్తున్నాం. జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ (JPL) అందించే జియో ఓటీటీ యాప్స్ సహా 14 ఇతర ఓటీటీ యాప్స్ కావాలంటే అదనంగా రూ.100, 200 చొప్పున నెలవారీ యాడ్-ఆన్ ప్యాక్లు తీసుకోవాల్సి ఉంటుంది. సరసమైన ధరల్లో బ్రాడ్బ్యాండ్ ప్లాన్పై లిమిటెడ్ కనెక్టివిటీ సర్వీసులను మాత్రమే అందిస్తున్నాం. ఓటీటీ సేవలను గానీ, బ్రాడ్కాస్టింగ్ సేవలను గానీ అందించడం లేదు’’ అని జియో పేర్కొంది.
‘‘జేపీఎల్ అనేది ఓ అగ్రిగేటర్. జియో టీవీ ప్లస్ పేరిట ఓటీటీ యాప్స్ను ఇది అందిస్తుంది. జియో టీవీ ప్లస్ యాప్లో ఓటీటీ సహా ఇతర ఛానెళ్ల ప్రసారాలూ లభిస్తాయి. డిస్నీ+ హాట్స్టార్, జీ5, సోనీ లివ్ వంటి ఓటీటీ యాప్స్ కూడా టీవీ ఛానెళ్ల డిజిటల్ ఫీడ్ను అందిస్తున్నాయి. జియో ఫైబర్ సేవలు తీసుకుని ఓటీటీ యాప్స్కు సబ్స్క్రైబ్ చేసుకునే వారు.. ఓటీటీ సేవలతో పాటు ఛానెళ్లు సైతం పొందుతారు. ఎయిర్టెల్ కూడా అదే పనిచేస్తోంది. కాబట్టి ఎయిర్టెల్ చేసిన ఫిర్యాదులో ఎలాంటి ఆధారాలూ లేవు’’ అని జియో పేర్కొంది. కాబట్టి ఎయిర్టెల్ ఫిర్యాదును తిరస్కరించాలని ట్రాయ్ను కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
‘ఫ్లైఓవర్’ కష్టాలకు చెక్.. గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్లు
Google Maps: ఫ్లైఓవర్ కష్టాలకు చెక్ పెడుతూ గూగుల్ మ్యాప్స్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ వారంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వాట్సప్లో ఏఐ ఫీచర్.. మిమ్మల్ని మీరు ఊహించుకోండి!
Whatsapp AI feature: వాట్సప్లో కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ను మీకు నచ్చినట్లుగా జనరేట్ చేసుకోవచ్చు. -
యూట్యూబ్లో అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు
YouTube down: ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐఫోన్ 13పై డిస్కౌంట్
Amazon prime day sale: జులై 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ఇందులో పలు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తున్నారు. -
విండోస్లో ‘బ్లూ స్క్రీన్’ ఎర్రర్.. కారణమిదే!
Microsoft outage: క్రౌడ్ స్ట్రయిక్ అప్డేట్ కారణంగానే విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తేలింది. -
ప్రపంచవ్యాప్తంగా విండోస్ సేవల్లో అంతరాయం.. విమాన సర్వీసులపైనా ఎఫెక్ట్
Microsoft outage: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయం తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమయ్యింది. -
అపరిమిత 5జీ కోసం ఎయిర్టెల్లో డేటా బూస్టర్ ప్యాక్లు
Airtel: టారిఫ్ల పెంపు తర్వాత ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ ప్రయోజనాన్ని తొలగించింది. అలాంటి వారికోసం కొత్తగా డేటా బూస్టర్ ప్యాక్లు తీసుకొచ్చింది. -
టెలికాం ఛార్జీల ఎఫెక్ట్.. బీఎస్ఎన్ఎల్కు పెరుగుతున్న సబ్స్క్రైబర్లు
BSNL: టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు బీఎస్ఎన్ఎల్వైపు చూస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. -
50MP ట్రిపుల్ కెమెరా, 100W ఛార్జింగ్ సపోర్ట్తో హానర్లో 2 కొత్త ఫోన్లు
Honor 200 Series: హానర్లో మరో రెండు స్మార్ట్ఫోన్లు వచ్చాయి. వీటిలో 50 ఎంపీ కెమెరా సెటప్, 5,200mAh బ్యాటరీ సహా మరిన్ని ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. విడుదల సందర్భంగా డిస్కౌంట్లను కూడా ఇస్తోంది. -
గూగుల్ జెమినీలో కొత్త సదుపాయం.. లాక్స్క్రీన్లోనూ ఇక సమాధానం
Gemini on Lock screen: గూగుల్ జెమినీని ఇకపై లాక్ స్క్రీన్పై కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్ను మాన్యువల్గా మార్చుకోవాల్సి ఉంటుంది. -
బిగ్ బ్యాటరీతో శాంసంగ్ M35 5జీ.. సేల్, ఆఫర్లు ఇవే..!
Samsung Galaxy M35 5G: శాంసంగ్ సంస్థ కొత్తగా ఎం35 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ₹1,999కే ఫైర్ టీవీ స్టిక్.. ₹2,499తో ఎకో పాప్
Amazon Prime Day Sale: ప్రైమ్ డే సేల్ సందర్భంగా అమెజాన్ తమ బ్రాండ్తో వస్తోన్న ఉత్పత్తులపై గణనీయమైన తగ్గింపునిస్తోంది. -
100W ఫాస్ట్ ఛార్జింగ్తో వన్ప్లస్ నార్డ్ 4.. ట్యాబ్, వాచ్, బడ్స్ వివరాలు ఇవే..
OnePlus Nord 4: వన్ప్లస్ సంస్థ కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. నార్డ్ సిరీస్లో నార్డ్ 4ను తీసుకొచ్చింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. -
రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ
iQOO Z9 Lite: ఐకూ జెడ్9 లైట్ ఫోన్ భారత్లో విడుదలైంది. రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొద్ది 5జీ ఫోన్లలో ఇదొకటి. -
ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు.. అవేంటి? ప్రయోజనాలెలా ఉన్నాయ్?
Reliance Jio: టారిఫ్ల పెంపు తర్వాత రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్లలో అనేక మార్పులు చేసింది. ప్రస్తుతం ఈ టెలికాం ప్రొవైడర్ కేవలం రెండు వార్షిక ప్లాన్లను మాత్రమే విక్రయిస్తోంది. అవేంటి? అందులో ప్రయోజనాలెలా ఉన్నాయో చూద్దాం.. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఆడియో వినే పని లేకుండానే!
Whatsapp new feature: వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆడియో సందేశాలకు అక్షర రూపం ఇవ్వనుంది. బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. -
ఒప్పో రెనో 12 సిరీస్.. 50MP కెమెరా, ఏఐ టూల్స్, 5,000mAh బ్యాటరీ
Oppo Reno 12 series: ఒప్పో రెనో సిరీస్లో మరో రెండు కొత్త ఫోన్లు వచ్చాయి. 50MP కెమెరా సహా ఏఐ టూల్స్, బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
స్కామ్ అలర్ట్: ఇండియా పోస్ట్ పేరుతో లింకులు.. క్లిక్ చేస్తే అంతే!
India post scam: తపాలా శాఖ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసానికి తెర తీశారు. మోసపూరిత లింకులను పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సేవలు
Flipkart : ఫాస్టాగ్, డీటీహెచ్ రీఛార్జ్ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్ సొల్యూషన్ల సంస్థ బిల్డెస్క్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వెల్లడించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నెట్ఫ్లిక్స్కు నిరసన సెగ.. నెట్టింట్లో బాయ్కాట్ కాల్స్
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
-
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి