రికార్డుల్ని బద్దలు కొట్టిన జియో సినిమా.. ఐపీఎల్‌కు 62కోట్ల వ్యూస్‌‌!

IPL 2024: ఐపీఎల్‌ వ్యూస్‌లో ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా సరికొత్త రికార్డును నెలకొల్పింది. 

Published : 30 May 2024 14:17 IST

JioCinema | ఇంటర్నెట్‌డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో సినిమా (Jio cinema) ఐపీఎల్‌ ప్రసారాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో జియో సినిమా వేదికగా మ్యాచ్‌ వీక్షించిన వారి సంఖ్య 62 కోట్లకు చేరింది. గతేడాదిలో నమోదైన సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది 53శాతం పెరిగింది. తాజా సీజన్‌లో 35,000 కోట్ల నిమిషాల వాచ్‌టైంను నమోదు చేసింది.

ఐపీఎల్‌ సీజన్‌ మొదటి రోజున జరిగిన మ్యాచ్‌ను 11.3 కోట్ల మంది వీక్షించారు. గతేడాది మొదటి రోజు వ్యూయర్‌షిప్‌తో పోలిస్తే 51శాతం వృద్ధి చెందింది. వీక్షకులు సెషన్‌కు సగటున 75 నిమిషాలు వెచ్చించారు. గతేడాదిలో ఈ సెషన్ సమయం 60 నిమిషాలుగా ఉంది. జియో సినిమా తన వీడియో క్వాలిటీని పెంచింది. 4కె వీడియో క్వాలిటీ, మల్టీ క్యామ్‌ ఆప్షన్స్‌, 12భాషల్లో ఫీడ్‌, AR/VR వంటి సదుపాయాలు తీసుకురావడం కూడా వ్యూయర్‌షిప్‌ను పెంచడంలో సాయపడ్డాయి. 

నగదు రహిత చికిత్సపై గంటలోపే నిర్ణయం

2024 ఒలింపిక్స్‌

2024 పారిస్‌ ఒలింపిక్స్‌ను తన వేదిక ద్వారా వీక్షించే సదుపాయాన్ని అందించాలని జియో సినిమా ప్లాన్‌ చేస్తోంది. గంట కొద్దీ లైవ్‌, ఆన్‌- డిమాండ్‌ కంటెంట్‌ను ఇవ్వాలని చూస్తోంది. 2024 జులై 26న ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11న ముగింపు వేడుకలు జరగనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని