జియో సినిమా ప్రీమియం వార్షిక ప్లాన్.. ప్రారంభ ఆఫర్ కింద 50% తగ్గింపు
JioCinema: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో సినిమా ప్రీమియం వార్షిక ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ను తీసుకొచ్చింది. ప్రారంభ ఆఫర్ కింద 50శాతం తగ్గింపు అందిస్తోంది.
JioCinema | ఇంటర్నెట్డెస్క్: రిలయన్స్కు చెందిన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో సినిమా (Jio Cinema) ప్రీమియం కొత్త వార్షిక సబ్స్క్రిప్షన్ ప్లాన్ను తీసుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం నెలవారీ ప్లాన్ తీసుకొచ్చిన ఈ సంస్థ.. తాజాగా అందుబాటు ధరలో దీన్ని ప్రవేశపెట్టింది. ఈ సబ్స్క్రిప్షన్ కింద ఎలాంటి ప్రకటనలూ లేకుండా 4కె రిజల్యూషన్తో స్ట్రీమింగ్ వీడియోలను చూడొచ్చు.
జియో తీసుకొచ్చిన వార్షిక ప్లాన్ ధర రూ.599. ప్రారంభ ఆఫర్ కింద వార్షిక సబ్స్క్రిప్షన్ ధరపై 50శాతం తగ్గింపును అందిస్తోంది. అంటే కేవలం రూ.299కే ప్లాన్ లభించనుంది. మొదటి 12 నెలల బిల్లింగ్ సైకిల్ ముగిశాక సబ్స్క్రిప్షన్ కావాలంటే పూర్తి మొత్తంలో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాది పొడవునా ఒక డివైజ్లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా కంటెంట్ను వీక్షించొచ్చు. అదీ 4కే వీడియో క్వాలిటీతో. డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లోనూ కంటెంట్ను ఎంజాయ్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టోర్నమెంట్, ఇతర క్రీడలు, ప్రత్యక్ష ప్రసార ఈవెంట్లు మాత్రం యాడ్స్తో వస్తాయి. జియో మునుపటి వార్షిక ప్లాన్ రూ.999తో పోలిస్తే ఇది చాలా తక్కువ.
చివరి నిమిషాల్లోనూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్ గురించి తెలుసా?
ఇటీవల జియో రూ.29, రూ.89తో (ఫ్యామిలీ ప్యాక్) రెండు కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి నెలవారీ ప్లాన్లు. సినిమాలు, హాలీవుడ్ బ్లాక్బస్టర్లు, పిల్లల షోలు, టీవీ ఎంటర్టైన్మెంట్ను స్మార్ట్ టీవీ సహా ఏ డివైజ్లోనైనా వీక్షించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తీసుకొచ్చిన వార్షిక ప్లాన్లోనూ ఈ తరహా సదుపాయాలే ఉన్నాయి. జియో గత నెలలో ప్రీమియం ఫ్యామిలీ సబ్స్క్రిప్షన్ ఛార్జీలను రూ.149 నుంచి రూ.89కి తగ్గించింది. ఈ ప్లాన్లో ఒకేసారి నాలుగు డివైజుల్లో కంటెంట్ను వీక్షించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..