MG Motor India: ప్రతీ 3-6 నెలలకు ఎంజీ నుంచి కొత్త కారు
MG Motor: జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా రూ.5,000 కోట్ల పెట్టుబడితో హలోల్లో రెండో ప్లాంట్ను ఏర్పాటుచేయనుంది. తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుంది.
ముంబయి: జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ప్రతీ 3-6 నెలలకు ఓ కొత్త కారును విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులోభాగంగానే రూ.5,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్లోని హలోల్లో రెండో ప్లాంట్ను ఏర్పాటుచేయనుంది. ఈ విషయాన్ని MG మోటార్ ఇండియా ఛైర్మన్ రాజీవ్ చాబా బుధవారం తెలిపారు.
చైనా కార్ల తయారీ సంస్థ SAIC, జేఎస్డబ్ల్యూ గ్రూప్తో కలసి జాయింట్ వెంచర్ ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా జాయింట్ వెంచర్ను ప్రారంభించాయి. హలోల్లో ప్రారంభించే ప్లాంట్ ద్వారా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి లక్ష నుంచి 3 లక్షలకు పెరగనుందని ఎంజీ మోటార్ ఇండి ఛైర్మన్ రాజీవ్ చాబా తెలిపారు. ప్రతీ 3-6 నెలలకు ఓ కొత్త కారును విడుదల చేయాలని చూస్తున్నామన్నారు. భారత్లోనే వీటిని తయారుచేసి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేస్తామని చెప్పారు. 2030 నాటికి దేశీయంగా మిలియన్ యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
దశాబ్దం తర్వాత ఎయిర్టెల్ గ్రూప్ నుంచి మరో ఐపీఓ
ఈసందర్భంగా JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడారు. మారుతీ సుజుకీ మార్కెట్ లీడర్గా నిలవడానికి గల కారణాన్ని ఈసందర్భంగా గుర్తు తెచ్చుకున్నారు. ‘‘నలభై సంవత్సరాల క్రితం భారత్కు వచ్చిన మారుతీ కంపెనీ ఆటో పరిశ్రమ గతినే మార్చేసింది. ఎంతో నాణ్యమైన, అత్యాధునిక కార్లను తీసుకొచ్చింది. దీంతో అంబాసిడర్లు, ఫియట్లను ప్రజలు విస్మరించారు’’ అని పేర్కొన్నారు. ఎంజీ కొత్త ఎనర్జీ వాహన విభాగంలోను అదేతరహా అనుభవాన్ని తిరిగి సృష్టించాలనుకుంటున్నట్లు సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత మెచ్చేలా కొత్త పథకాలు
కెనరా బ్యాంకు కాసా (కరెంటు, సేవింగ్స్ ఖాతాల) డిపాజిట్లు పెంచుకునేందుకు విభిన్న పథకాలను ఆవిష్కరిస్తోంది. ఇందువల్ల డిపాజిట్ల వ్యయం తగ్గి, బ్యాంకు స్థిర వృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తోంది. -
ప్రవాసుల నుంచి రూ.9.20 లక్షల కోట్లు
ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు 111 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.2 లక్షల కోట్ల)ను బదిలీ చేశారు. వృత్తి, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి తరలి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు.. తమ స్వదేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే. -
ఆద్యంతం ఒడుదొడుకులే
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు బుధవారం స్తబ్దుగా ముగిశాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. -
8% వృద్ధికే అధిక అవకాశం
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) భారత జీడీపీ వృద్ధి 8 శాతంగా నమోదయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. -
‘కొవిషీల్డ్’ టీకాను వెనక్కి తీసుకుంటున్న ఆస్ట్ర జెనేకా
పలు రకాల దుష్ఫలితాలు కనిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, మార్కెట్లో ఉన్న కొవిడ్-19 టీకాను వెనక్కి తీసుకోవాలని యూకే కంపెనీ ఆస్ట్రజెనేకా నిర్ణయించింది. -
ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ వాలెట్ యాప్
భారత్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే మొబైల్స్ కోసం గూగుల్ వాలెట్ యాప్ను టెక్ దిగ్గజం గూగుల్ ఆవిష్కరించింది. బోర్డింగ్ పాసులు, లాయల్టీ కార్డులు, టికెట్లు, ప్రభుత్వ రవాణా పాసులు.. తదితరాలను భద్రంగా నిల్వ చేసుకునేందుకు ఈ వాలెట్ వీలు కల్పిస్తుంది. -
నగదు రుణాలు రూ.20వేల లోపే!
నగదు రూపంలో ఇచ్చే రుణాలు రూ.20వేలకు మించకుండా ఉండాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. నగదు లావాదేవీల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొందని తెలుస్తోంది. -
ఏప్రిల్లో శాకాహారం 8% ప్రియం
ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరగడంతో గత నెలలో వెజిటేరియన్ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరిగిందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనాలసిస్ నెలవారీ ‘రోటీ రైస్ రేట్’ నివేదిక వెల్లడించింది. -
400 మంది ఇంజినీర్ల నియామకాలు: కోటక్ బ్యాంక్
ఈ ఏడాది దాదాపు 400 మంది ఇంజినీర్లను నియమించుకునేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తనిఖీల్లో వెలుగు చూసిన సాంకేతిక లోపాలు సరిదిద్దేందుకు, టెక్నాలజీ వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాలని బ్యాంక్ భావిస్తోంది. -
10 కిలోల పెంపుడు జంతువు క్యాబిన్లోనే
తమ దేశీయ విమానాల క్యాబిన్లో 10 కిలోల లోపున్న పెంపుడు జంతువులను అనుమతిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నాకే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ ఎల్అండ్టీ జనవరి- మార్చి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.4,396.12 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,986.78 కోట్లతో పోలిస్తే ఇది 10.2% అధికం. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
తమ వెబ్సైట్లో వేసవి విహారం కోసం శోధించిన వాటి వివరాలను ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ మేక్మైట్రిప్ వెల్లడించింది.