Customer ID: మొబైల్ యూజర్లకు త్వరలో ఆధార్ తరహా ఐడీ!
Mobile users: మొబైల్ యూజర్లకు త్వరలో కస్టమర్ ఐడీ కేటాయించనున్నారు. దీనివల్ల సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఉపయోగడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ సిమ్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్రం నిబంధనలు కఠినతరం చేస్తోంది. సిమ్ కార్డు విక్రేతలకు కేవైసీ నిబంధనలను అమలు చేయాలని, బల్క్ సిమ్ విక్రయాలనూ నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పుడు కొత్తగా మొబైల్ యూజర్లకు ఆధార్ తరహాలో కస్టమర్ ఐడీ పేరిట విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయాలనుకుంటోంది. ప్రధాన సిమ్కార్డుతో పాటు అనుబంధంగా ఉన్న ఫోన్ కనెక్షన్లను గుర్తించేందుకు ఈ ఐడీ ఉపయోగపడుతుంది. వినియోగదారులను సైబర్ మోసాలను రక్షించడంతో పాటు, ప్రభుత్వ పథకాలు నేరుగా అందించేందుకు ఈ ఐడీ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను టెలికాం విభాగం ఇప్పటికే సిద్ధం చేసిందని ‘ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్’ తన కథనంలో పేర్కొంది.
ఆధార్కు 14 అంకెలు కలిగిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ను లింక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల డాక్టర్లు, బీమా సంస్థలు వ్యక్తుల వైద్య సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలు పడుతోంది. ఇదే తరహాలో మొబైల్ సబ్స్క్రైబర్లకు కేటాయించే కస్టమర్ ఐడీ ద్వారా సిమ్ కార్డును ట్రాక్ చేయడంతో పాటు సిమ్ కొనుగోలు చేసిన ప్రదేశం, సిమ్ కార్డు వాస్తవ యజమాని వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
సైబర్ నేరాలపై ఫేషియల్ రికగ్నిషన్ అస్త్రం.. 64 లక్షల ఫోన్ కనెక్షన్లు రద్దు
దేశంలో ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 సిమ్కార్డులను మాత్రమే కలిగి ఉండేందుకు అర్హత ఉంది. కానీ ఇది సరిగ్గా అమలు కావడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా ఆడిట్ నిర్వహిస్తే తప్ప ఇలాంటివి గుర్తించడం సాధ్యపడడం లేదు. అలా ఈ మధ్యే 64 లక్షల మొబైల్ కనెక్షన్లను ప్రభుత్వం రద్దు చేసింది. అదే ఈ కస్టమర్ ఐడీ ద్వారా అయితే ఒక కస్టమర్కు నిర్దేశిత సంఖ్య కంటే మించి అధికంగా సిమ్ కార్డులను జారీ చేయడాన్ని అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
కస్టమర్ ఐడీ ద్వారా సిమ్కార్డు వాస్తవంగా ఎవరు వాడుతున్నారనే వివరాలను ప్రభుత్వం తెలుసుకోగలుగుతుందని చెప్తున్నారు. సిమ్కార్డు జారీ సమయంలోనూ ఆ వివరాలను ఇకపై కోరే అవకాశం ఉంది. దీనివల్ల డేటా ప్రొటెక్షన్ బిల్లుకు అనుగుణంగా పిల్లల మొబైల్ వినియోగంపై తల్లిదండ్రుల అనుమతిని సైతం ధ్రువీకరించుకోవడానికి మొబైల్ కంపెనీలకు వీలు పడుతుంది. కస్టమర్ ఐడీ ద్వారా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు నివారించొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కస్టమర్ ఐడీల ద్వారా వయసు, జెండర్, వైవాహిక స్థితి, ఆదాయం, చదువు, ఉద్యోగం వంటి డెమోగ్రఫీ వంటి వివరాల ఆధారంగా ఆ సమూహాన్ని గ్రూప్ చేయడానికి దోహదపడుతుందని, వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరించినట్లు ప్రభుత్వం దృష్టికి వస్తే ఆ కస్టమర్ ఐడీతో ఉన్న నంబర్లన్నింటినీ ఒకేసారి బ్లాక్ చేయడానికి వీలు పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం