మనీలాండరింగ్ ఆరోపణలు.. కేవైసీ ఉల్లంఘనలు.. ‘Paytm’పై చర్యలు ఇందుకేనా?
Paytm payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనీలాండరింగ్ ఆరోపణలు, కేవైసీ ఉల్లంఘనలు ఇందుకు నేపథ్యమని తెలుస్తోంది.
దిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై (Paytm payments Bank) ఆర్బీఐ ఆంక్షలకు సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మనీలాండరింగ్ ఆరోపణలు, కేవైసీ నిబంధనలు పాటించకపోవడమే ఆర్బీఐ కఠిన నిర్ణయం వెనక కారణమని తెలుస్తోంది. పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ బ్యాంకింగ్ మధ్య కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగలోకి దిగే అవకాశమూ ఉందని తెలుస్తోంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఇటీవల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వ్యాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్అప్లు చేయకూడదని స్పష్టం చేసింది. ఇందుకోసం ఫిబ్రవరి 29 వరకు గడువు ఇచ్చింది. అంటే అప్పటివరకూ పేమెంట్స్ బ్యాంక్ సేవలను ఖాతాదారులు వినియోగించుకోవచ్చు. పేటీఎం ఇచ్చే సమాధానంతో ఆర్బీఐ సంతృప్తి చెందకపోతే నిర్దేశిత గడువు తర్వాత పేమెంట్స్ బ్యాంక్ సేవలు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.
కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల కోత.. 30 వేల మందికి ఉద్వాసన!
ఒకే పాన్.. వేలాది అకౌంట్లు..
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించి కేవైసీ చేయని లక్షలాది ఖాతాలు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకే పాన్తో అనేక వేలాది ఖాతాలు తెరిచిన ఉదంతాలు వెలుగుచూసినట్లు సమాచారం. కేవైసీ చేసిన ఖాతాలకు నిర్దేశించిన గరిష్ఠ పరిమితిని మించి కొన్నిసార్లు ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. దీంతో మనీలాండరింగ్ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సుమారు 35 కోట్ల ఇ-వ్యాలెట్లు ఉండగా.. అందులో 31 కోట్ల ఖాతాలు నిద్రాణ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం 4 కోట్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. అవి కూడా జీరో బ్యాలెన్స్, స్వల్ప మొత్తాలు కలిగి ఉన్నాయి. నిష్క్రియగా ఉన్న ఖాతాలను మనీలాండరింగ్ కోసం వినియోగించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఓ అనలిస్ట్ పేర్కొన్నారు.
పదే పదే ఉల్లంఘనలు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో కేవైసీ ఉల్లంఘలను ఆర్బీఐ 2021లోనే గుర్తించింది. వీటిని సరిచేసుకోవాలని సూచించింది. అయినా ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. ఆర్బీఐకి సమర్పించిన పలు నివేదికల్లోనూ అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో 2022 మార్చిలో పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ చర్యలు చేపట్టింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం విషయంలో ఆంక్షలు విధించింది.
రంగంలోకి ఈడీ?
డిజిటల్ మోసాల బారిన పడి పలు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు వెలుగుచూసినప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. 2022 సెప్టెంబర్లో పేమెంట్స్ బ్యాంక్ మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సహా ఇతర పేమెంట్ అగ్రిగేటర్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. తమ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వ్యక్తుల వ్యక్తిగత డేటాను సేకరించిన డిజిటల్ రుణ సంస్థలు.. ఈ వ్యాలెట్లు, కొన్ని పేమెంట్ అగ్రిగేటర్ల సాయంతో మోసాలకు తెరతీశారని ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో అవసరమైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఈడీ విచారణ జరిగే అవకాశమూ లేకపోలేదని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో రెండు ట్రేడింగ్ సెషన్లలో వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు 40 శాతం మేర క్షీణించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్