మనీలాండరింగ్ ఆరోపణలు.. కేవైసీ ఉల్లంఘనలు.. ‘Paytm’పై చర్యలు ఇందుకేనా?
Paytm payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మనీలాండరింగ్ ఆరోపణలు, కేవైసీ ఉల్లంఘనలు ఇందుకు నేపథ్యమని తెలుస్తోంది.
దిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై (Paytm payments Bank) ఆర్బీఐ ఆంక్షలకు సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. మనీలాండరింగ్ ఆరోపణలు, కేవైసీ నిబంధనలు పాటించకపోవడమే ఆర్బీఐ కఠిన నిర్ణయం వెనక కారణమని తెలుస్తోంది. పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ బ్యాంకింగ్ మధ్య కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగలోకి దిగే అవకాశమూ ఉందని తెలుస్తోంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఇటీవల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వినియోగదారుల ఖాతాలు, ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లు, వ్యాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్అప్లు చేయకూడదని స్పష్టం చేసింది. ఇందుకోసం ఫిబ్రవరి 29 వరకు గడువు ఇచ్చింది. అంటే అప్పటివరకూ పేమెంట్స్ బ్యాంక్ సేవలను ఖాతాదారులు వినియోగించుకోవచ్చు. పేటీఎం ఇచ్చే సమాధానంతో ఆర్బీఐ సంతృప్తి చెందకపోతే నిర్దేశిత గడువు తర్వాత పేమెంట్స్ బ్యాంక్ సేవలు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి.
కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల కోత.. 30 వేల మందికి ఉద్వాసన!
ఒకే పాన్.. వేలాది అకౌంట్లు..
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సంబంధించి కేవైసీ చేయని లక్షలాది ఖాతాలు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకే పాన్తో అనేక వేలాది ఖాతాలు తెరిచిన ఉదంతాలు వెలుగుచూసినట్లు సమాచారం. కేవైసీ చేసిన ఖాతాలకు నిర్దేశించిన గరిష్ఠ పరిమితిని మించి కొన్నిసార్లు ఆయా ఖాతాల్లో లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. దీంతో మనీలాండరింగ్ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు సుమారు 35 కోట్ల ఇ-వ్యాలెట్లు ఉండగా.. అందులో 31 కోట్ల ఖాతాలు నిద్రాణ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కేవలం 4 కోట్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. అవి కూడా జీరో బ్యాలెన్స్, స్వల్ప మొత్తాలు కలిగి ఉన్నాయి. నిష్క్రియగా ఉన్న ఖాతాలను మనీలాండరింగ్ కోసం వినియోగించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఓ అనలిస్ట్ పేర్కొన్నారు.
పదే పదే ఉల్లంఘనలు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో కేవైసీ ఉల్లంఘలను ఆర్బీఐ 2021లోనే గుర్తించింది. వీటిని సరిచేసుకోవాలని సూచించింది. అయినా ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. ఆర్బీఐకి సమర్పించిన పలు నివేదికల్లోనూ అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో 2022 మార్చిలో పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ చర్యలు చేపట్టింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం విషయంలో ఆంక్షలు విధించింది.
రంగంలోకి ఈడీ?
డిజిటల్ మోసాల బారిన పడి పలు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు వెలుగుచూసినప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. 2022 సెప్టెంబర్లో పేమెంట్స్ బ్యాంక్ మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సహా ఇతర పేమెంట్ అగ్రిగేటర్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. తమ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వ్యక్తుల వ్యక్తిగత డేటాను సేకరించిన డిజిటల్ రుణ సంస్థలు.. ఈ వ్యాలెట్లు, కొన్ని పేమెంట్ అగ్రిగేటర్ల సాయంతో మోసాలకు తెరతీశారని ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో అవసరమైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఈడీ విచారణ జరిగే అవకాశమూ లేకపోలేదని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో రెండు ట్రేడింగ్ సెషన్లలో వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు 40 శాతం మేర క్షీణించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు