Scam Alert: ఆ స్టాక్ రికమండేషన్లు నావి కావు.. ఇన్వెస్టర్లకు నిఖిల్ కామత్ అలర్ట్!
Scam Alert: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి. మంచి లాభాలు ఆర్జించే స్టాక్స్ను సూచిస్తాం అంటూ ప్రముఖుల పేరిట రూపొందించిన ప్రకటనలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Hand picked stocks scam | ఇంటర్నెట్డెస్క్: స్కామ్.. స్కామ్.. స్కామ్.. రోజూ దీనికి సంబంధించి ఏదోఒక వార్త బయటకు వస్తూనే ఉంది. ప్రస్తుతం ట్రెండ్లో నడుస్తున్న అంశాన్ని ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు కొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెరిగాయి. దీనిపై అవగాహన లేకపోయినా పెద్ద మొత్తంలో డబ్బులొస్తాయనే ఆశతో చాలామంది వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. అలాంటివారిపై కేటుగాళ్లు కన్నేశారు. దీనికోసం రూపొందించిన యాడ్లో ఏకంగా బ్రోకరేజ్ సంస్థకు చెందిన వ్యక్తి ఫొటోనే ఉపయోగించారు.
‘‘ఏప్రిల్లో మంచి లాభాలు తెచ్చిపెట్టే స్టాక్స్ గురించి చెబుతాం. దీనికోసం మా వాట్సప్ గ్రూప్లో చేరండి. రోజూ 1-3 స్టాక్లు ఎంపిక చేయాలని సూచిస్తాం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఫస్ట్ అప్లై చేసుకున్న 1000 మందికి మాత్రమే ఉచితం’’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనపై ఏకంగా స్టాక్ బ్రోకరేజ్ సంస్థ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Zerodha's CEO Nikhil Kamath) ఫొటో కనిపిస్తుంది. ఆయనే స్వయంగా స్టాక్లు సజ్జెస్ట్ చేస్తారంటూ ఆ యాడ్ను తయారుచేశారు. ఈ పోస్ట్ నెట్టింట నిఖిల్ కంటపడింది. దీంతో ఆయన ‘‘ఎక్స్’’ వేదికగా స్పందించారు.
విశాఖ సహా మరో 14 విమానాశ్రయాల్లో డిజి యాత్ర
‘‘ఈ ప్రకటన నా నుంచి వచ్చింది కాదు. నేను ఎలాంటి వాట్సప్ గ్రూపుల్లో చేరాలని ప్రకటన చేయలేదు. దయచేసి ఇటువంటి స్కామ్లపై జాగ్రత్త వహించండి’’ అంటూ కామత్ పోస్ట్ చేశారు. తాను ఎటువంటి పెయిడ్ ప్రమోషన్లు చేయనని స్పష్టంచేస్తూ యాడ్కు సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. మరోవైపు.. స్టాక్మార్కెట్ పెట్టుబడుల పేరిట జరుగుతున్న మోసాలు ఎక్కువగా బయటకొస్తున్నాయి. ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చీఫ్ ఎండీ, సీఈఓ ఆశిష్కుమార్ చౌహాన్ (Ashishkumar Chauhan)కు చెందిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. పెట్టుబడులు పెట్టాలంటూ ఆయన ప్రచారం చేస్తున్నట్లు డీప్ఫేక్ వీడియోలు సోషల్మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో ఎన్ఎస్ఈ స్పందించి ఇలాంటి వీడియోలతో జాగ్రత్త వహించాలని హెచ్చరించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం