Nirmala sitharaman: బడ్జెట్లో ‘అద్భుతాలు’ ఉండకపోవచ్చు: నిర్మల సీతారామన్
Nirmala sitharaman on Budget: వచ్చే బడ్జెట్లో కీలక ప్రకటనలు ఏవీ ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడమే ఇందుకు కారణమన్నారు.
Nirmala sitharaman | దిల్లీ: సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్స్గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఇక 2024 లోక్సభ ఎన్నికలకు ఉన్నది ఆరు నెలలు మాత్రమే. వరుసగా మూడోసారి అధికారం చేపట్టాలని చూస్తున్న మోదీ సర్కారు.. ఎన్నికలకు ముందు జనాకర్షక పథకాలు, తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బడ్జెట్లో కీలక ప్రకటనలు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో అలాంటి ‘అద్భుత ప్రకటనలు’ ఏవీ ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) అన్నారు.
యూపీఐ, బ్యాంకింగ్ మోసాలు.. పోయిన డబ్బు తిరిగి పొందొచ్చా?
సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్ సదస్సులో నిర్మలా సీతారామన్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయం కావడంతో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టేది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమేనని, ప్రభుత్వ ఖర్చుల కోసం మాత్రమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. కాబట్టి ఈ సారి బడ్జెట్లో అద్భుతమైన ప్రకటనలు ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి చెప్పారు. కీలక ప్రకటనల కోసం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టే బడ్జెట్ వరకు వేచి చూడాలన్నారు. సాధారణంగా ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంటుంది. 2024 వేసవిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. బ్రిటీష్ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.25,000 కోట్ల పెట్టుబడులకు అవకాశం
ద్విచక్ర వాహనాలు, బస్సులు మనదేశంలో ఈవీ (విద్యుత్తు వాహన) పరిశ్రమకు చోదక శక్తిగా మారుతున్నాయి. -
టెస్లా పవర్పై టెస్లా దావా
భారత్కు చెందిన ఒక కంపెనీ తమ పేరును వినియోగిస్తూ, వినియోగదారుల్లో గందరగోళ సృష్టిస్తోందని ఆరోపిస్తూ, దిల్లీ హైకోర్టులో అమెరికా విద్యుత్ వాహన (ఈవీ) దిగ్గజం టెస్లా దావా వేసింది. -
కొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్
యువతను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ ఎన్ఎస్400జెడ్ ను విపణిలోకి శుక్రవారం విడుదల చేసింది. -
క్యాపిటా ల్యాండ్కు హైదరాబాద్లో 25 లక్షల చ.అ. కార్యాలయ స్థలం
స్థిరాస్తి సేవల సంస్థ ఫినిక్స్ గ్రూపు, హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో నిర్మిస్తున్న 25 లక్షల చదరపు అడుగుల వాణిజ్య భవనాన్ని కేపిటా ల్యాండ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కొనుగోలు చేయనుంది. -
ఎంఆర్ఎఫ్ తుది డివిడెండ్ రూ.194
టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్, మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. -
39% తగ్గిన అదానీ గ్రీన్ ఎనర్జీ లాభం
అదానీ గ్రూప్నకు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్), మార్చి త్రైమాసికంలో రూ.310 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
గోద్రేజ్ ప్రాపర్టీస్ రికార్డు అమ్మకాలు
గోద్రేజ్ గ్రూప్నకు చెందిన స్థిరాస్తి సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్, మార్చి త్రైమాసికంలో గతంలో ఎన్నడూ లేనంతగా రూ.471.26 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
గరిష్ఠాల నుంచి వెనక్కి
సూచీల గరిష్ఠ స్థాయుల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. టెలికాం, యంత్ర పరికరాలు, టెక్ షేర్లు డీలాపడటంతో సెన్సెక్స్ 74,000 పాయింట్ల దిగువకు చేరింది. -
నరేశ్ గోయల్కు బెయిల్ ఇవ్వొద్దు.. ఈడీ
మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, వైద్య ప్రాతిపదికన మధ్యంతర బెయిల్ కోరడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం వ్యతిరేకించింది. -
అంతరిక్ష కార్యకలాపాలకు నిధులు
మనదేశంలో అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలకు నిధులు సమకూర్చడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏబీబీ) సుముఖంగా ఉంది. -
యాపిల్ ఆదాయాల్లో రెండంకెల వృద్ధి
భారతదేశంలో మార్చి త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని నమోదుచేసినట్లు అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( 8)
సిగ్నిటీ టెక్నాలజీస్లో 54% వాటా కొంటున్న కోఫోర్జ్ లిమిటెడ్, ఇప్పుడు ఆ సంస్థ వాటాదార్లకు ‘ఓపెన్ ఆఫర్’ జారీ చేసింది. -
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్లో పెద్దఎత్తున ఖాతాలపై చర్యలు చేపట్టింది. ఒక్క 2024 తొలి త్రైమాసికంలోనే ఏకంగా 2.23 కోట్ల ఖాతాలపై నిషేధం విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..