UPI fraud: యూపీఐ, బ్యాంకింగ్ మోసాలు.. పోయిన డబ్బు తిరిగి పొందొచ్చా?
UPI fraud: ఆన్లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్కామ్ల వల్ల డబ్బు పోగొట్టుకుంటే వెంటనే తీసుకోవాల్సిన చర్యలేంటో చూద్దాం!
UPI fraud | ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సహా ఇతర రకాల డిజిటల్ లావాదేవీలు మన రోజువారీ జీవితాల్లో భాగమైపోయాయి. అయితే, వీటిలో ఉన్న సౌలభ్యం.. వివిధ రకాల మోసాల (Online Fraud) బారిన పడే ముప్పును పెంచుతోంది. యూపీఐ (UPI), బ్యాంకింగ్, ఆన్లైన్లో నగదు బదిలీ.. ఇలా వివిధ మార్గాల్లో మోసాలు జరుగుతున్నాయి. ప్రజలను ఉచ్చులోకి లాగడానికి మోసగాళ్లు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి? వాటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఒకవేళ డబ్బు పోగొట్టుకుంటే తిరిగి రాబట్టుకోవడం ఎలా? అనే విషయాలు తెలిసి ఉండాలి.
ఆన్లైన్ మోసాల బారినపడి సొమ్ము పోగొట్టుకున్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని చర్యలను పరిశీలిద్దాం..
యూపీఐ మోసాలు..
యూపీఐ రాకతో భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భారీగా విస్తరించింది. సులభంగా, వేగంగా నగదు బదిలీ చేయగలగడం దీంట్లోని సౌలభ్యం. అయితే మోసాలకు యూపీఐ లావాదేవీలు (UPI Transactions) కూడా అతీతమేమీ కాదు. ఒక వేళ మోసపోతే.. తక్షణమే ఈ కింది చర్యలు తీసుకోవాలి.
యూపీఐ సర్వీస్ ప్రొవైడర్కు ఫిర్యాదు..
- ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. యూపీఐ మోసం జరిగినట్టు గుర్తించిన వెంటనే చేయాల్సిన మొదటి పని సర్వీస్ ప్రొవైడర్లకు (ఉదా..జీపే, ఫోన్పే, పేటీఎం) సమాచారం అందించడం.
- లావాదేవీ వివరాలను అందించి సొమ్ము వాపస్ వచ్చేలా చేయమని ఆయా సర్వీస్ ప్రొవైడర్లను ‘ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ’ ద్వారా అభ్యర్థించాలి.
ఎన్పీసీఐ ఫిర్యాదు పోర్టల్..
- ఒకవేళ యూపీఐ ప్రొవైడర్ నుంచి స్పందన లేకపోతే, ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’ పోర్టల్ https://www.npci.org.in/లోకి వెళ్లి ‘‘గెట్ ఇన్ టచ్’’ విభాగంలో ‘యూపీఐ కంప్లయింట్’లో ఫిర్యాదు సమర్పించొచ్చు.
- ప్రత్యామ్నాయంగా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (బ్యాంక్)లో కూడా ఫిర్యాదు ఇవ్వొచ్చు.
బ్యాంకింగ్ అంబుడ్స్మన్, డిజిటల్ ఫిర్యాదులు..
- 30 రోజులు దాటినా సమస్యకు పరిష్కారం లభించకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. లేదా డిజిటల్ కంప్లయింట్స్ అంబుడ్స్మన్ను కూడా ఆశ్రయించొచ్చు.
- ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. అంబుడ్స్మన్కు అధికారికంగా ఒక ఫిర్యాదు లేఖను సమర్పించాలి.
- cms.rbi.org.in పోర్టల్లోనూ ఫిర్యాదు చేయొచ్చు. లేదా లావాదేవీకి సంబంధించిన వివరాలతో crpc@rbi.org.in ఐడీకి మెయిల్ చేయొచ్చు.
బ్యాంకింగ్ మోసాలు..
సైబర్ నేరగాళ్లు మన బ్యాంకింగ్ వివరాలను తస్కరించి మోసపూరిత లావాదేవీల ద్వారా డబ్బును కాజేస్తుంటారు. ఫిషింగ్ లింక్స్, హ్యాకింగ్ వంటి మార్గాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. ఒకవేళ ఈ తరహా బ్యాంకింగ్ మోసాల బారిన పడితే.. ఈ చర్యలు తీసుకోవచ్చు.
బ్యాంకుకు సమాచారం..
- మోసం జరిగినట్టు గుర్తించిన వెంటనే లావాదేవీకి సంబంధించిన వివరాలతో బ్యాంకుకు సమాచారం అందజేయాలి. వీలైనంత వేగంగా ఫిర్యాదు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే రూ.25,000లోపు వరకు పరిహారంగా ఇప్పించేందుకు బ్యాంకులు కృషి చేస్తాయని నిపుణులు తెలిపారు.
- మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే బ్యాంకులు ఆ సమాచారాన్ని బీమా సంస్థలకు తెలియజేస్తాయి. తద్వారా పరిహారం అందించేందుకు కృషి చేస్తాయి. అయితే, ఖాతాదారుల ప్రమేయం ఏమాత్రం లేకుండా మోసం జరిగినట్టు తేలి.. దర్యాప్తులో పూర్తి వివరాలు లభ్యమైతేనే పరిహారం అందే అవకాశం ఉంది. అన్ని సందర్భాల్లో రిఫండ్ సాధ్యం కాదని నిపుణులు వివరించారు.
సైబర్ క్రైమ్ పోర్టల్..
వర్క్ ఫ్రమ్ హోమ్, లాటరీ వంటి మార్గాల్లోనూ మోసాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిలోనూ మోసగాళ్లు బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని స్కామ్లకు పాల్పడుతుంటారు. ఇలాంటి సందర్భంలోనూ వెంటనే బ్యాంకులను సంప్రదించి ఫిర్యాదు అందజేయాలి. ఒకవేళ సమస్య క్లిష్టమైనదైతే.. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాకపోతే సైబర్క్రైమ్ పోర్టల్ https://cybercrime.gov.in/లోనూ ఫిర్యాదు సమర్పించొచ్చు. హెల్ప్లైన్ నంబర్ 1930కి కూడా కాల్ చేయొచ్చు.
ఇలా రక్షించుకోవచ్చు..
ఇలాంటి ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. అసలు ఎలాంటి స్కామ్లు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. వాటిని గుర్తించడంపై అవగాహన పెంచుకోవాలి. ఆన్లైన్ ఖాతాలు, బ్యాంక్ వివరాలు సహా ఇతరత్రా వ్యక్తిగత సమాచారం లీక్ కాకుండా చూసుకోవాలి.
- అపరిచితులకు ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దు.
- ఇ-మెయిళ్లు, టెక్ట్స్ మెసేజ్లలో వచ్చే లింక్లపై క్లిక్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
- ఆన్లైన్ ఖాతాలకు కఠినమైన పాస్వర్డ్లను సెట్ చేసుకోవాలి.
- టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ఏర్పాటు చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..