UPI fraud: యూపీఐ, బ్యాంకింగ్ మోసాలు.. పోయిన డబ్బు తిరిగి పొందొచ్చా?
UPI fraud: ఆన్లైన్ మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్కామ్ల వల్ల డబ్బు పోగొట్టుకుంటే వెంటనే తీసుకోవాల్సిన చర్యలేంటో చూద్దాం!
UPI fraud | ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సహా ఇతర రకాల డిజిటల్ లావాదేవీలు మన రోజువారీ జీవితాల్లో భాగమైపోయాయి. అయితే, వీటిలో ఉన్న సౌలభ్యం.. వివిధ రకాల మోసాల (Online Fraud) బారిన పడే ముప్పును పెంచుతోంది. యూపీఐ (UPI), బ్యాంకింగ్, ఆన్లైన్లో నగదు బదిలీ.. ఇలా వివిధ మార్గాల్లో మోసాలు జరుగుతున్నాయి. ప్రజలను ఉచ్చులోకి లాగడానికి మోసగాళ్లు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి? వాటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఒకవేళ డబ్బు పోగొట్టుకుంటే తిరిగి రాబట్టుకోవడం ఎలా? అనే విషయాలు తెలిసి ఉండాలి.
ఆన్లైన్ మోసాల బారినపడి సొమ్ము పోగొట్టుకున్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని చర్యలను పరిశీలిద్దాం..
యూపీఐ మోసాలు..
యూపీఐ రాకతో భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ భారీగా విస్తరించింది. సులభంగా, వేగంగా నగదు బదిలీ చేయగలగడం దీంట్లోని సౌలభ్యం. అయితే మోసాలకు యూపీఐ లావాదేవీలు (UPI Transactions) కూడా అతీతమేమీ కాదు. ఒక వేళ మోసపోతే.. తక్షణమే ఈ కింది చర్యలు తీసుకోవాలి.
యూపీఐ సర్వీస్ ప్రొవైడర్కు ఫిర్యాదు..
- ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. యూపీఐ మోసం జరిగినట్టు గుర్తించిన వెంటనే చేయాల్సిన మొదటి పని సర్వీస్ ప్రొవైడర్లకు (ఉదా..జీపే, ఫోన్పే, పేటీఎం) సమాచారం అందించడం.
- లావాదేవీ వివరాలను అందించి సొమ్ము వాపస్ వచ్చేలా చేయమని ఆయా సర్వీస్ ప్రొవైడర్లను ‘ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ’ ద్వారా అభ్యర్థించాలి.
ఎన్పీసీఐ ఫిర్యాదు పోర్టల్..
- ఒకవేళ యూపీఐ ప్రొవైడర్ నుంచి స్పందన లేకపోతే, ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)’ పోర్టల్ https://www.npci.org.in/లోకి వెళ్లి ‘‘గెట్ ఇన్ టచ్’’ విభాగంలో ‘యూపీఐ కంప్లయింట్’లో ఫిర్యాదు సమర్పించొచ్చు.
- ప్రత్యామ్నాయంగా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (బ్యాంక్)లో కూడా ఫిర్యాదు ఇవ్వొచ్చు.
బ్యాంకింగ్ అంబుడ్స్మన్, డిజిటల్ ఫిర్యాదులు..
- 30 రోజులు దాటినా సమస్యకు పరిష్కారం లభించకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు. లేదా డిజిటల్ కంప్లయింట్స్ అంబుడ్స్మన్ను కూడా ఆశ్రయించొచ్చు.
- ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. అంబుడ్స్మన్కు అధికారికంగా ఒక ఫిర్యాదు లేఖను సమర్పించాలి.
- cms.rbi.org.in పోర్టల్లోనూ ఫిర్యాదు చేయొచ్చు. లేదా లావాదేవీకి సంబంధించిన వివరాలతో crpc@rbi.org.in ఐడీకి మెయిల్ చేయొచ్చు.
బ్యాంకింగ్ మోసాలు..
సైబర్ నేరగాళ్లు మన బ్యాంకింగ్ వివరాలను తస్కరించి మోసపూరిత లావాదేవీల ద్వారా డబ్బును కాజేస్తుంటారు. ఫిషింగ్ లింక్స్, హ్యాకింగ్ వంటి మార్గాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడుతుంటారు. ఒకవేళ ఈ తరహా బ్యాంకింగ్ మోసాల బారిన పడితే.. ఈ చర్యలు తీసుకోవచ్చు.
బ్యాంకుకు సమాచారం..
- మోసం జరిగినట్టు గుర్తించిన వెంటనే లావాదేవీకి సంబంధించిన వివరాలతో బ్యాంకుకు సమాచారం అందజేయాలి. వీలైనంత వేగంగా ఫిర్యాదు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. మూడు రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే రూ.25,000లోపు వరకు పరిహారంగా ఇప్పించేందుకు బ్యాంకులు కృషి చేస్తాయని నిపుణులు తెలిపారు.
- మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే బ్యాంకులు ఆ సమాచారాన్ని బీమా సంస్థలకు తెలియజేస్తాయి. తద్వారా పరిహారం అందించేందుకు కృషి చేస్తాయి. అయితే, ఖాతాదారుల ప్రమేయం ఏమాత్రం లేకుండా మోసం జరిగినట్టు తేలి.. దర్యాప్తులో పూర్తి వివరాలు లభ్యమైతేనే పరిహారం అందే అవకాశం ఉంది. అన్ని సందర్భాల్లో రిఫండ్ సాధ్యం కాదని నిపుణులు వివరించారు.
సైబర్ క్రైమ్ పోర్టల్..
వర్క్ ఫ్రమ్ హోమ్, లాటరీ వంటి మార్గాల్లోనూ మోసాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిలోనూ మోసగాళ్లు బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని స్కామ్లకు పాల్పడుతుంటారు. ఇలాంటి సందర్భంలోనూ వెంటనే బ్యాంకులను సంప్రదించి ఫిర్యాదు అందజేయాలి. ఒకవేళ సమస్య క్లిష్టమైనదైతే.. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాకపోతే సైబర్క్రైమ్ పోర్టల్ https://cybercrime.gov.in/లోనూ ఫిర్యాదు సమర్పించొచ్చు. హెల్ప్లైన్ నంబర్ 1930కి కూడా కాల్ చేయొచ్చు.
ఇలా రక్షించుకోవచ్చు..
ఇలాంటి ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. అసలు ఎలాంటి స్కామ్లు జరుగుతున్నాయో తెలుసుకోవాలి. వాటిని గుర్తించడంపై అవగాహన పెంచుకోవాలి. ఆన్లైన్ ఖాతాలు, బ్యాంక్ వివరాలు సహా ఇతరత్రా వ్యక్తిగత సమాచారం లీక్ కాకుండా చూసుకోవాలి.
- అపరిచితులకు ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దు.
- ఇ-మెయిళ్లు, టెక్ట్స్ మెసేజ్లలో వచ్చే లింక్లపై క్లిక్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
- ఆన్లైన్ ఖాతాలకు కఠినమైన పాస్వర్డ్లను సెట్ చేసుకోవాలి.
- టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ఏర్పాటు చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
కౌంటర్కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. UTS యాప్తో బుకింగ్ ఎలా..?
UTS app: టికెట్ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం.. -
ఆధార్ కార్డ్లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో తప్పుందా? మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్డేట్ చేసుకోవాలో చూడండి.. -
పెట్టుబడి ప్రభుత్వ బాండ్లలో
చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం. -
టెక్నాలజీ కంపెనీల్లో
బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
ఆధార్ ఏటీఎం.. ఇంటి నుంచే క్యాష్ విత్డ్రా ఎలా చేసుకోవాలి?
Aadhaar ATM: ఇంటి నుంచే డబ్బు విత్డ్రా చేసుకొనే సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందిస్తోంది. దీన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.. -
వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు
IRCTC tour package: వేసవిలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లతో ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ వివరాలను ఓసారి పరిశీలించండి. -
టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి భరోసానిచ్చేలా
బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్ పాలసీలు. వీటిని ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు. -
కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ
IRCTC tour package: వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న కేరళ టూర్ ప్యాకేజీ వివరాల్ని పరిశీలించండి.. -
తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి.. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
డిజీ లాకర్తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!