Artificial Intelligence: ఏఐ పురోగతిని నిలువరించలేం: మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు
Artificial Intelligence: కృత్రిమ మేధను బాధ్యతతో వాడుకోవడం ఒక్కటే మార్గమని మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ అన్నారు. దీన్ని నియంత్రించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
దిల్లీ: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) వినియోగంపై అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శక్తిమంతమైన సాంకేతికత (Artificial Intelligence)లో వస్తున్న పురోగతిని నిలువరించడం సాధ్యం కాదని చెప్పారు. ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో నిబంధనలు రూపొందించడం ఒక్కటే మార్గమని సూచించారు. ఈ ప్రక్రియ వీలైనంత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. పీటీఐకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బాధ్యతతో వినియోగించుకోవాలి..
భారత్ సహా యావత్ ప్రపంచానికి ఏఐ (Artificial Intelligence) ఎంతో మేలు చేస్తుందని బ్రాడ్ స్మిత్ అన్నారు. అయితే, దీన్ని బాధ్యతతో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోజువారీ కార్యకలాపాలపై ఏఐ వల్ల ఎంతో సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇటీవల భారత పార్లమెంట్ ఆమోదం పొందిన ‘సమాచార రక్షణ చట్టం’ బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే దేశంలో వస్తున్న డిజిటల్ మౌలికవసతులూ బాగున్నాయని కితాబిచ్చారు.
ప్రతిభకు భారత్ అడ్డా..
భారత్లో మైక్రోసాఫ్ట్ మరిన్ని పెట్టుబడులకు కట్టుబడి ఉందని స్మిత్ ఉద్ఘాటించారు. అలాగే ఉద్యోగుల నియామకాలూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. తమ కంపెనీకి భారత్ అత్యంత ప్రాధాన్య దేశంగా మారిందని తెలిపారు. కేవలం వినియోగదారుల పరంగానే కాకుండా.. ప్రతిభగల ఉద్యోగులకూ భారత్ అడ్డాగా మారిందన్నారు. 12 నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో భారత్కు చెందిన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
ఇతర దేశాలకు భారత్ స్ఫూర్తి..
డిజిటల్ సాంకేతికత విషయంలో 2020 తర్వాత భారత్ చూపించిన పురోగతి మరే దేశమూ సాధించలేకపోయిందని స్మిత్ అభిప్రాయపడ్డారు. భారత డిజిటల్ మౌలిక వసతులు పురోగమించడమే కాకుండా ఇతర దేశాలనూ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. పలు దేశాలు భారత్ తరహా డిజిటల్ సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
కృత్రిమ మేధ (AI) నైతిక వినియోగానికి అంతర్జాతీయ నిబంధనలు అవసరమని సీఐఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బి20 సమిట్ ఇండియా-2023 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం అన్నారు. ప్రపంచం మొత్తం ఏఐపై ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. ఇదే సమయంలో నైతికతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
తాజా వార్తలు (Latest News)
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!