Artificial Intelligence: ఏఐ పురోగతిని నిలువరించలేం: మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు
Artificial Intelligence: కృత్రిమ మేధను బాధ్యతతో వాడుకోవడం ఒక్కటే మార్గమని మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ అన్నారు. దీన్ని నియంత్రించడానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
దిల్లీ: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) వినియోగంపై అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శక్తిమంతమైన సాంకేతికత (Artificial Intelligence)లో వస్తున్న పురోగతిని నిలువరించడం సాధ్యం కాదని చెప్పారు. ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో నిబంధనలు రూపొందించడం ఒక్కటే మార్గమని సూచించారు. ఈ ప్రక్రియ వీలైనంత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. పీటీఐకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బాధ్యతతో వినియోగించుకోవాలి..
భారత్ సహా యావత్ ప్రపంచానికి ఏఐ (Artificial Intelligence) ఎంతో మేలు చేస్తుందని బ్రాడ్ స్మిత్ అన్నారు. అయితే, దీన్ని బాధ్యతతో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోజువారీ కార్యకలాపాలపై ఏఐ వల్ల ఎంతో సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇటీవల భారత పార్లమెంట్ ఆమోదం పొందిన ‘సమాచార రక్షణ చట్టం’ బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే దేశంలో వస్తున్న డిజిటల్ మౌలికవసతులూ బాగున్నాయని కితాబిచ్చారు.
ప్రతిభకు భారత్ అడ్డా..
భారత్లో మైక్రోసాఫ్ట్ మరిన్ని పెట్టుబడులకు కట్టుబడి ఉందని స్మిత్ ఉద్ఘాటించారు. అలాగే ఉద్యోగుల నియామకాలూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. తమ కంపెనీకి భారత్ అత్యంత ప్రాధాన్య దేశంగా మారిందని తెలిపారు. కేవలం వినియోగదారుల పరంగానే కాకుండా.. ప్రతిభగల ఉద్యోగులకూ భారత్ అడ్డాగా మారిందన్నారు. 12 నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో భారత్కు చెందిన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
ఇతర దేశాలకు భారత్ స్ఫూర్తి..
డిజిటల్ సాంకేతికత విషయంలో 2020 తర్వాత భారత్ చూపించిన పురోగతి మరే దేశమూ సాధించలేకపోయిందని స్మిత్ అభిప్రాయపడ్డారు. భారత డిజిటల్ మౌలిక వసతులు పురోగమించడమే కాకుండా ఇతర దేశాలనూ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. పలు దేశాలు భారత్ తరహా డిజిటల్ సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
కృత్రిమ మేధ (AI) నైతిక వినియోగానికి అంతర్జాతీయ నిబంధనలు అవసరమని సీఐఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బి20 సమిట్ ఇండియా-2023 కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం అన్నారు. ప్రపంచం మొత్తం ఏఐపై ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. ఇదే సమయంలో నైతికతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!