ఏఐ నైతిక వినియోగమే లక్ష్యం
ఆధునిక సాంకేతికతలు సమాజంపై అమిత ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో, కృత్రిమ మేధ (ఏఐ) నైతిక వినియోగానికి అంతర్జాతీయ నిబంధనలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
అంతర్జాతీయ నిబంధనలు మేలు
బీ20 సమిట్లో ప్రధాని నరేంద్ర మోదీ
దిల్లీ: ఆధునిక సాంకేతికతలు సమాజంపై అమిత ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో, కృత్రిమ మేధ (ఏఐ) నైతిక వినియోగానికి అంతర్జాతీయ నిబంధనలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. క్రిప్టో కరెన్సీ సంబంధిత సమస్యల పరిష్కారానికి కూడా ఒక సమ్మిళిత నిబంధనావళి రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బీ20 సమిట్ ఇండియా-2023 కార్యక్రమంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. వాతావరణ మార్పు, ఇంధన రంగ సంక్షోభం, ఆహార సరఫరా వ్యవస్థల్లో అసమతౌల్యం, నీటి భద్రత వంటివి వ్యాపారాలపై పెను ప్రభావం చూపిస్తాయని, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఉమ్మడి ప్రయత్నాలను పెంచాల్సిన అవసరం ఉన్నారు. ‘క్రిప్టో కరెన్సీలకు సంబంధించిన సవాళ్ల విషయంలో మరింత సమీకృత విధానం అవసరం. అంతర్జాతీయ నిబంధనావళి రూపొందించి, అవి దుర్వినియోగం కాకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంద’ని అంతర్జాతీయ, దేశీయ వ్యాపార దిగ్గజాలకు మోదీ సూచించారు. ఇదే తరహాలో కృత్రిమ మేధ కోసం పని చేయాల్సి ఉందన్నారు. ‘ప్రపంచం మొత్తం ఏఐపై ఎంతో ఆసక్తిగా ఉంది. ఇదే సమయంలో నైతికతను పరిగణనలోకి తీసుకోవాలి. నైపుణ్యాల పునశ్చరణతో పాటు సమాజంపై పడే ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిసి కట్టుగా పరిష్కరించుకోవాల’ని మోదీ పేర్కొన్నారు.
వినియోగదార్లే కీలకం అవ్వాలి
వినియోగదార్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ వ్యాపారాలు జరగాలని ప్రధాని సూచించారు. ఇందుకోసం అంతర్జాతీయ వినియోగదార్ల సంరక్షణ దినోత్సవం నిర్వహించాలని వ్యాపార వర్గాలకు పిలుపునిచ్చారు. ఉత్పత్తి దారులు, వినియోగదారుల మధ్య సమతూకం ఉన్నప్పుడే లాభదాయక మార్కెట్ సాధ్యపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలను కేవలం మార్కెట్ కోణంలో మాత్రమే చూడటం వల్ల.. కొన్నేళ్ల తర్వాతైనా వాణిజ్యానికి హాని కలిగే అవకాశం ఉందని అన్నారు. చంద్రయాన్-3 విజయంతో దేశంలో పండుగ సీజన్ మొదలైందని, ఈ మిషన్ కోసం ప్రైవేటు రంగంలోని కంపెనీలు, ఎంఎస్ఎంఈలు చాలా వరకు విడిభాగాలను సమకూర్చాయని గుర్తు చేశారు. జీ20లో శాశ్వత సభ్యత్వం కోసం ఆఫ్రికా సమాఖ్యను ఆహ్వానించామని తెలిపారు.
- వచ్చే నెలలో దిల్లీలో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆయా దేశాల మధ్య వ్యాపార సంబంధిత విషయాలను చర్చించేందుకు ఏర్పాటు చేసిన వేదికే బిజినెస్ 20 లేదా బీ20 ఫోరమ్. అంతర్జాతీయ వ్యాపార వర్గాలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఆర్థిక శక్తి పెరుగుతోంది
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ విధానాల వల్ల, కొన్నేళ్లలో దేశంలో మధ్యతరగతి ప్రజల సంఖ్య భారీగా పెరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పరిణామం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. ఇటీవల కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడుతున్నారని, వారంతా మధ్య తరగతి కంటే కాస్త దిగువ స్థాయిలో (నియో మిడిల్ క్లాస్) ఉన్నారని ఆయన అభివర్ణించారు. త్వరలోనే వీరంతా మధ్యతరగతి వర్గంలోకి చేరేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. వీరు తమ ఆకాంక్షలతో, దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తారని మోదీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు బయోమెట్రిక్ ధ్రువీకరణ
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, మన స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయనేే అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. అందువల్ల అంతకంటే ముందుగానే, ఎంపిక చేసుకున్న షేర్లను కొని పెట్టుకోవాల్సిందిగా మదుపర్లకు సూచించారు. -
కాకినాడ నుంచి అంతర్జాతీయ విపణికి అమ్మోనియా!
నార్వేలోని ఓస్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యారా క్లీన్ అమ్మోనియా అనే సంస్థ, గ్రీన్కో గ్రూపునకు చెందిన కాకినాడ యూనిట్ నుంచి రెన్యూవబుల్ అమ్మోనియా కొనుగోలు చేయనుంది. -
2030 కల్లా 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్
దేశంలోని 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలంటే, భారత్కు రూ.4.2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భారీ నష్టాల నుంచి లాభాల్లోకి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆఖర్లో పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ 910 పాయింట్లు కోలుకుంది. -
‘ వార్షిక సమాచార నివేదిక’లో కొత్త వెసులుబాటు
వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందులో సమాచార ధ్రువీకరణ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. -
ఎఫ్టీఏ దేశాల నుంచి భారత్కు దిగుమతులు 38% పెరిగాయ్
మనదేశంతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉన్న యూఏఈ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి భారత్కు దిగుమతులు 2018-19లో 136.20 బిలియన్ డాలర్లుగా ఉండేవి. -
ఎయిరిండియా, విస్తారా ఉద్యోగులకు జూన్ కల్లా ఫిట్మెంట్!
ఎయిరిండియా, విస్తారాకు చెందిన 7,000కు పైగా ఉద్యోగులకు జూన్లో ఫిట్మెంట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన ఈ రెండు విమానయాన సంస్థల విలీన ప్రక్రియ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. -
బుల్లెెట్ ఈవీపై తొందర లేదు
బుల్లెట్ బ్రాండ్పై మోటార్సైకిళ్లను విక్రయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ‘అద్భుత’ విద్యుత్ వాహనాన్ని (ఈవీ) తీసుకు రావాలని ఆశిస్తోంది. అందువల్ల ఈవీల్లోకి ప్రవేశించేందుకు తొందరపాటుతో వ్యవహరించడం లేదని చెబుతోంది. -
జొమాటో లాభం రూ.175 కోట్లు
ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే సంస్థ జొమాటో, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.188 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
రాజ్ వట్టికూటి సంస్థలో వాటా కోసం పోటీలో అంతర్జాతీయ పీఈ సంస్థలు
అమెరికన్-భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయిన రాజ్ వట్టికూటికి చెందిన ప్యూర్-ప్లే డిజిటల్ సేవల కంపెనీ అల్టిమెట్రిక్లో మెజారిటీ వాటా కోసం అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థలు పోటీలో ఉన్నాయి. -
భారత్లో మరిన్ని ఎస్యూవీ మోడళ్లు తీసుకొస్తాం: సుజుకీ
కార్ల విభాగంలో తాము కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు భారత్లో స్పోర్ట్ వినియోగ వాహన (ఎస్యూవీ) మోడళ్ల సంఖ్యను పెంచుకుంటామని జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
డ్రోన్ల తయారీ సంస్థ దక్ష అన్మ్యాన్డ్ సిస్టమ్స్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ తన వాటా పెంచుకుంది. ఈ సంస్థలో ఇప్పటికే రెండు దఫాలుగా కోరమాండల్ ఇంటర్నేషనల్ పెట్టుబడి పెట్టింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనం రాక ఆలస్యం కానుంది. అందుకు గల కారణాలను ఆ కంపెనీ ఎండీ వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం