ఎన్విడియా సంపద ఒక్క రోజులో బిగ్జంప్.. కంపెనీల మార్కెట్ విలువలూ దిగదుడుపే!
Nvidia shares jumps: ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఎన్విడియా స్టాక్ ఒక్కరోజులోనే 16 శాతం మేర పెరిగింది. దీంతో ఒక్కరోజులో కంపెనీ సంపద 277 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏదైనా కంపెనీ మంచి త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తే.. ఆ స్టాక్ రాణించడం సహజమే. దాని ప్రభావంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. కానీ, ఒక కంపెనీ ఒక రోజు సంపద కొన్ని కంపెనీల మార్కెట్ విలువలను దాటేస్తే దాన్ని ప్రభంజనమే అనాలి. ఆ ఘనతను సాధించింది అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా (Nvidia). ఆ కంపెనీ షేర్లు ఒక్క రోజులో 16 శాతం రాణించడంతో కంపెనీ మార్కెట్ విలువ 277 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. భారత్కు చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ కంటే ఈ మొత్తం ఎక్కువ కావడం గమనార్హం.
వాల్స్ట్రీట్లో ఒక్క రోజులో ఇంత మొత్తం సంపద పెరగడం ఇదే తొలిసారి. అంతకుముందు మెటా సంస్థ మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో కంపెనీ షేర్లు ఫిబ్రవరి 2న రాణించాయి. దీంతో 196 బిలియన్ డాలర్ల సంపద పెరిగింది. ఇప్పుడు ఎన్విడియా ఆ రికార్డును తిరగరాసింది. దీంతో వాల్స్ట్రీట్లో మైక్రోసాఫ్ట్ (3 ట్రిలియన్ డాలర్లు), యాపిల్ (2.8 ట్రిలియన్ డాలర్లు) తర్వాత అతిపెద్ద స్టాక్గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు సౌదీ అరామ్కో (2 ట్రిలియన్ డాలర్లు) తర్వాత 1.89 బిలియన్ డాలర్లతో నాలుగో అతిపెద్ద స్టాక్గా అవతరించింది.
Xiaomi: ఆ స్క్రీన్ ప్రొటెక్టర్లు వాడొద్దు.. వినియోగదారులకు షావోమీ అలర్ట్!
ఎందుకింత పెరిగింది?
కాలిఫోర్నియాకు చెందిన ఎన్విడియా ఇటీవల మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. హై ఎండ్ ఏఐ చిప్ మార్కెట్లో 80 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ మార్కెట్ అంచనాలను మించి ఆదాయాన్ని నమోదు చేసింది. డిసెంబర్తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 22.10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. పైగా మెరుగైన భవిష్యత్ అంచనాలను ప్రకటించింది. దీంతో 17 బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్కు బై రేటింగ్ ఇచ్చాయి. ప్రైస్ టార్గెట్ను 1100 డాలర్ల నుంచి 1400 డాలర్లకు పెంచాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్లో కంపెనీ షేరు 16 శాతం మేర రాణించి 785.38 డాలర్ల వద్ద ముగిసింది.
మార్కెట్ విలువలు దాటేసి
దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల అరుదైన మైలురాయిని అందుకుంది. తొలిసారి రూ.20 లక్షల కోట్ల మార్కెట్ విలువను దాటింది. డాలర్ విలువ ప్రకారం లెక్కిస్తే రిలయన్స్ మార్కెట్ విలువ 243 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, ఎన్విడియా ఒక్క రోజులో పోగేసిన సంపద రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తి మార్కెట్ విలువ కంటే అధికం కావడం గమనార్హం. రిలయన్స్ ఒక్కటే కాదు.. బ్యాంక్ ఆఫ్ అమెరికా (265 బిలియన్ డాలర్లు), కోకా-కోలా (264 బిలియన్ డాలర్లు), నెట్ఫ్లిక్స్ (255 బిలియన్ డాలర్లు), యాక్సెంచర్ (233 బిలియన్ డాలర్లు), మెక్ డొనాల్డ్స్ (214 బిలియన్ డాలర్లు) వంటి ప్రముఖ కంపెనీల మార్కెట్ విలువలను ఎన్విడియా ఒక్కరోజు సంపద దాటేసిందన్నమాట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం