Iran Israel conflict: ‘హర్మోజ్’ను ఇరాన్ అడ్డుకుంటే.. ఇంధనం ధరలకు రెక్కలే!
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం భారత్ సహా పలు దేశాల్లో ఆయిల్ ధరలు మరింత పెరగడానికి కారణం కావచ్చని అంచనా.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ వాణిజ్యంపై మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం (Iran-Israel conflict) భారత్ సహా పలు దేశాల్లో చమురు ధరలపై పడనున్నట్లు అంచనా. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో క్రూడ్ ఆయిల్ను భారత్ దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్, రాకెట్ దాడులు.. అనంతరం ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ వాతావరణం క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ చర్యలను కట్టడి చేసేందుకు పలు దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఒకవేళ హర్మోజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటే.. ముడి చమురు, ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
కీలక జలసంధి..
ఒమన్-ఇరాన్ సముద్ర మార్గంలో హర్మోజ్ జలసంధి ఉంటుంది. దాదాపు 40 కి.మీ మేర ఇరుకైన ప్రదేశం ఉండగా.. అందులో 2. కి.మీలు నౌకల రాకపోకల కోసం నావిగేషన్ ఛానల్ ఉంటుంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు రోజుకు 2.1కోట్ల (21మిలియన్) బారెళ్ల చమురు ఎగుమతి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారి వినియోగంలో ఇది 21శాతం. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ వినియోగంలోనూ 20శాతం ఇక్కడ నుంచే సరఫరా జరుగుతోంది.
భారత్ అవసరాల్లో 85శాతం క్రూడ్ ఆయిల్ సౌదీ, ఇరాక్, యూఏఈ నుంచి వస్తుండగా.. ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్జీ కూడా ఈ జలసంధి మార్గంలోనే వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ‘హర్మోజ్’ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటే.. చమురు రవాణాకు ఎర్ర సముద్రం (Red Sea) ప్రత్యామ్నాయంగా ఉంది. కానీ, ఎల్ఎన్జీ దిగుమతికి మాత్రం అటువంటి సౌలభ్యం లేదు. దీంతో భారత్లో ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
రష్యాతో కాస్త ఊరట..
ఇరాన్ పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటే.. క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ధరలు పెరుగుతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. తాజా పరిస్థితులతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వీటి ధరలు పెరిగే ముప్పు ఉందని మూడీస్ కూడా అంచనా వేసింది. ఇప్పటికే ఈ ఏడాది తొలి నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే ధోరణి కనిపిస్తోందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ డైరెక్టర్ హార్దిక్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత దిగజారితే.. ముడి చమురు ధరల పెరుగుదలకు దారి తీయవచ్చన్నారు. అయినప్పటికీ, రష్యా నుంచి భారత్కు ఇంధన దిగుమతులు ఇటీవల పెరగడం కాస్త ఊరట కలిగించే అంశంగా నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
Suzuki Motorcycle: సుజుకీ కంపెనీ దాదాపు 4 లక్షల వాహనాలను రీకాల్ చేసింది. ఆయా వాహనాల్లో ఉన్న లోపాన్ని గుర్తించి ఈ రీకాల్ చేపట్టింది. -
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్