Credit Card: ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: విద్యుత్తు, ఫోన్, గ్యాస్, ఇంటి అద్దె వంటి యుటిలిటీ బిల్లులు క్రెడిట్ కార్డుతో (Credit Card) చెల్లిస్తే ఒకప్పుడు సంస్థలు రివార్డులు ఇచ్చేవి. క్రమంగా పరిస్థితి మారుతోంది. అద్దెపై ఇప్పటికే సేవా రుసుము వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతర బిల్లులకూ దీన్ని వర్తింపజేసేందుకు కొన్ని బ్యాంకులు సిద్ధమయ్యాయి.
యెస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకు 2024 మే 1 నుంచి క్రెడిట్ కార్డులతో (Credit Card) చెల్లించే యుటిలిటీ బిల్లులపై 1 శాతం రుసుము వసూలుచేయనున్నాయి. ఉదాహరణకు రూ.1,500 విద్యుత్తు బిల్లు యెస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే రూ.15 రుసుము అదనంగా భరించాల్సి ఉంటుంది.
ఇది అందరికీ వర్తించదు. యెస్ బ్యాంకులో అయితే నెలవారీ యుటిలిటీ బిల్లుల (Utility Bills) విలువ రూ.15,000 దాటితే ఒక శాతం అదనపు రుసుము వర్తిస్తుంది. అంటే ఫోన్, విద్యుత్తు, టీవీ, అద్దె ఇలా వివిధ యుటిలిటీ బిల్లుల చెల్లింపు మొత్తం రూ.15 వేలు దాటిందనుకుందాం. తర్వాత కూడా మళ్లీ ఏదైనా యుటిలిటీ బిల్లు చెల్లించాల్సి వస్తే అదనపు ఫీజు తప్పదు. ఐడీఎఫ్సీ బ్యాంకు విషయంలో ఈ పరిమితి రూ.20వేలుగా ఉంది.
ఎందుకంటే..
తక్కువ ఎండీఆర్..
క్రెడిట్ కార్డు లావాదేవీలపై పేమెంట్ గేట్వేలు వ్యాపారస్థుల నుంచి వసూలుచేసే ఛార్జ్ను ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)’ అంటారు. నిత్యావసరాలు, ట్రావెల్.. ఇలా కేటగిరీని బట్టి ఇది మారుతుంది. యుటిలిటీ బిల్లుల (Utility Bills) చెల్లింపులపై ఎండీఆర్ చాలా తక్కువగా ఉంటుంది. ఫలితంగా బ్యాంకులకు తక్కువ ఆదాయం వస్తోంది. దీన్ని సర్దుబాటు చేసుకునేందుకు ప్రత్యేక రుసుము వసూలు చేయనున్నాయి.
దుర్వినియోగాన్ని అరికట్టేందుకు..
కొంతమంది వ్యాపార అవసరాల కోసం క్రెడిట్ కార్డులను (Credit Card) దుర్వినియోగపరుస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా క్రెడిట్ లిమిట్తో పోలిస్తే యుటిలిటీ బిల్లుల మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాపార అవసరాలను సైతం యుటిలిటీ బిల్లుల కింద చూపి ప్రయోజనం పొందుతున్నారు. దీన్ని నివారించడం కూడా అదనపు రుసుము విధించడం వెనక ఉన్న ఓ కారణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉత్పత్తి ఈ ఏడాదిలోనే
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ సంవత్సరాంతానికి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. -
2023-24లో పీఎస్బీల లాభం రూ.1,41,203 కోట్లు
దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ (పీఎస్బీ) కలిపి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.1,41,203 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాయి. -
వాహన, లోహ షేర్లకు కొనుగోళ్లు
వరుసగా మూడో రోజూ సూచీల లాభాలు కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రాణించడం, సానుకూల ద్రవ్యోల్బణ గణాంకాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
భారతీ ఎయిర్టెల్ లాభంలో 31% క్షీణత
భారతీ ఎయిర్టెల్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.2,072 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,005.60 కోట్లతో పోలిస్తే, ఇది 31% తక్కువ. -
13 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
ఈ ఏడాది ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠమైన 1.26 శాతానికి చేరింది. ఆహార వస్తువులు.. ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడమే ఇందుకు కారణం. -
వార్షిక ఖర్చులో 6-7% సాంకేతికపైనే
దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటా తన వార్షిక నిర్వహణ ఖర్చులో 6-7% సాంకేతికత సంబంధిత అంశాలపైనే ఖర్చు చేస్తోంది. -
భారత్లో లీప్ మోటార్ ఈవీల తయారీ
చైనాకు చెందిన తన భాగస్వామ్య సంస్థ లీప్మోటర్ విద్యుత్ వాహనాలను భారత్లో తయారు చేసి, విక్రయించేందుకు భారత్లోని తన తయారీ కేంద్రాన్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థ స్టెల్లాంటిస్ ఉపయోగించుకోనుంది. -
ఎఫ్అండ్ఓ పై పర్యవేక్షణ పెరగాలి
అధిక నష్టభయం ఉండే ఫ్యూచర్లు, ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంపై పర్యవేక్షణ లేమి వల,్ల వాటిల్లో ట్రేడ్ చేసే చిన్న మదుపర్ల కుటుంబాలకు ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్లు
టీవీఎస్ మోటార్ తన విద్యుత్తు స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్లను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.94,999 (ఎక్స్ షోరూం). -
హైదరాబాద్లో ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకున్న టేబుల్ స్పేస్
కార్యాలయ స్థలానికి కార్పొరేట్ సంస్థల నుంచి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని 4 ప్రధాన నగరాల్లో 13.5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు టేబుల్ స్పేస్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
ప్రాంతీయ మార్గాల్లో సేవలను విస్తరించే లక్ష్యంతో కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని ఇండిగో భావిస్తోంది. ఇందుకోసం 3 విమాన తయారీ సంస్థలు ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్బస్లతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!