Paytm ఎఫెక్ట్.. పెరిగిన ఫోన్ పే, భీమ్ యాప్ డౌన్లోడ్స్
Paytmపై ఆంక్షల కారణంగా ఫోన్ పే, భీమ్-యూపీఐ, గూగుల్ పే యాప్లను డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య పెరిగింది.
దిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై (PPBL) భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) ఆంక్షలు విధించిన నేపథ్యంలో వినియోగదారులు ఇతర పేమెంట్ యాప్ల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఫోన్ పే (PhonePe), భీమ్-యూపీఐ (BHIM-UPI), గూగుల్ పే (Google Pay) డౌన్లోడ్స్ గణనీయంగా పెరిగాయి. ఫిబ్రవరి 3వ తేదీ ఒక్కరోజే ‘ఫోన్ పే’ను 2.79 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు ‘యాప్ ఫిగర్స్’ (App Figures) సంస్థ వెల్లడించింది. గత వారంతో పోలిస్తే ఇది 45 శాతం పెరుగుదలని తెలిపింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 మధ్య మొత్తంగా 10.4 లక్షల డౌన్లోడ్స్ జరిగాయని నివేదికలో పేర్కొంది.
వినియోగదారులు, వ్యాపారులను ఆకర్షించేందుకు కొంతకాలంగా ఫోన్ పే మార్కెటింగ్లో కొత్త విధానాలను అవలంబిస్తోంది. దీంతో గూగుల్ ప్లేస్టోర్ (Google PlayStore), యాపిల్ యాప్ స్టోర్ (Apple App Store)లో ఉచిత యాప్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం జనవరి 31 నాటికి ప్లేస్టోర్లో ‘ఫోన్ పే బిజినెస్’ యాప్ 188వ స్థానంలో ఉండగా.. ఫిబ్రవరి 5న 33వ స్థానానికి చేరుకుంది. యాప్ స్టోర్లో 227 నుంచి 72కి ఎగబాకింది.
పేటీఎంను కనికరించండి.. ప్రభుత్వానికి స్టార్టప్ల లేఖ!
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి చెందిన భీమ్-యూపీఐ యాప్ డౌన్లోడ్స్ కూడా 50 శాతం మేర పెరిగాయి. జనవరి 19న ప్లేస్టోర్లో 326 స్థానంలో ఉండగా.. ఫిబ్రవరి 5వ తేదీకి ఏడో స్థానంలో నిలిచింది. గూగుల్ పే యాప్ను జనవరి 31- ఫిబ్రవరి 3 మధ్య ప్లేస్టోర్లో 3.95 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆర్బీఐ ఆంక్షల వల్ల పొదుపు ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్, ఎన్సీఎంసీ ఖాతాల్లో ఉన్న డిపాజిట్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేటీఎం స్పష్టంచేసింది. ఫిబ్రవరి 29 తర్వాత యాప్ పనిచేస్తుందని తెలిపింది. కానీ, ఈ ప్రకటన మదుపరులతోపాటు, ఖాతాదారుల్లో విశ్వాసాన్ని నింపలేకపోయింది. మరోవైపు పేటీఎంపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పలు అంకుర సంస్థల వ్యవస్థాపకులు ప్రభుత్వానికి లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?